ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడికి నిరసనగా రేవంత్ రెడ్డి, అరికేపూడి గాంధీ దిష్టిబొమ్మ దహణం

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):

నేటి ధాత్రి:

వీణవంక మండల కేంద్రంలోని చల్లూరు గ్రామంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడికి నిరసనగా చల్లూరు గ్రామం లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, అరికేపూడి గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమం లో చల్లూరు గ్రామ మాజీ ఎంపిటిసి ఎలవేని మల్లయ్య ,రామిడి సంపత్ రెడ్డి, జక్కు నారాయణ,దండి తిరుపతి ,నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి,ఆవునూరి జీవన్, ఎలకపల్లి నగేష్ బైరెడ్డి సుభాస్కర్ రెడ్డి, పసియుద్దీన్ ఈదునూరి అనిల్, బొంగోని అనిల్ కుమార్,చేన్నవేని నాగరాజు, అజాం, అరుణ్, రాహుల్,అభిలాష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *