మహిళా సంఘ భవనానికి రక్షణ కరువు?

ఎండపల్లి జగిత్యాల నేటిదాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలోని మహిళ సంఘ భవనానికి రక్షణ కరువై, భవనం కు పెట్టిన తలుపులు ఇలా కనిపిస్తున్నాయి,ప్రభుత్వం మహిళల సమస్యల పరిష్కారం కోసం కింది స్థాయిలో మహిళలు చర్చించుకోవడం కొరకు అప్పటి ప్రభుత్వం కొన్ని గ్రామాల్లో మహిళా సంఘ భవనాలు చేపట్టింది,అలా చేపట్టిన గ్రామాల్లో చర్లపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం పక్కనే ఉన్న మహిళ సంఘభవనం సుమారుగా 10 లక్షలతో నిర్మించారు, కానీ ప్రస్తుతం మహిళా సంఘాల కొరకు నిర్మించిన భవనం తలుపులు పగులగొట్టినట్ల,లేక చెదలు పట్టి పోయినట్ల అని ప్రజలు చర్చిచుకుంటున్నరు, పైగా పక్కనే అక్కడక్కడ మద్యం సీసాలు దర్శనమివ్వడంతో ఎవరైనా ఆకతాయిలు వచ్చి పగల గొట్టారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి, ఏది ఏమైనా ఆ ప్రాంతంలో ఎలాంటి చెడు కార్యకలాపాలకు తావు లేకుండా ప్రతి రోజూ పోలీస్ వారిచే పెట్రోలింగ్ నిర్వహించాలని , అధికారులు స్పందించి,మహిళా సంఘాల భవనానికి రక్షణ కల్పించేలా, శాశ్వతంగా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, మహిళలు,ప్రజలు కోరుతున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version