పూర్తిగా మారిపోతున్న జమ్ముాకశ్మీర్‌

గణనీయంగా తగ్గిన ఉగ్రవాదం

 ప్రజల ప్రాధాన్యత ఉపాధిపైనే

మతఛాందసవాదం స్థానంలో సెక్యులరిజం

గణనీయంగా తగ్గిన ఉగ్రసంఘటనల వల్ల మరణాలు

డెస్క్‌,నేటిధాత్రి: 

గత ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిపై ఒక మాజీ సైనికుడు ఒకరు పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావాన్ని కలిగించే ఇటువంటి వ్యూహాత్మక దాడులను పాకిస్తాన్‌ ఏవిధంగా నిర్వహిస్తున్నది వివరించారు. ఇదే సమయంలో అంతర్జాతీయ స మాజం ఇటువంటి దాడులను ఖండిస్తున్నప్పటికీ ఒక వ్యూహం ప్రకారం అమలు చేస్తున్న ఈ దాడులను పాకిస్తాన్‌ ఆపడంలేదు. అయితే 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత మన ప్రభుత్వం జమ్ము`కశ్మీర్‌లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతోంది. వీటిని ఏదోవిధంగా అడ్డుకొని ప్రపంచానికి కశ్మీర్‌ను ఒక పెద్ద సమస్యగా చూపాలనుకుంటున్న పాకిస్తాన్‌ చర్యలను మనదేశం ఏవిధంగా కట్టడి చేస్తుందనేదే ఇక్కడ కీలకాంశం. ముఖ్యంగా ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ప్రతి దేశపౌరుడిలో దీనిపై ఆందోళన వ్యక్తం కావడం సహజం. ఈనేపథ్యంలో జమ్ము`కశ్మీర్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిస్థితి ఎట్లా వుంటుందనేది ఇప్పుడు ప్ర ధానంగా చర్చించాల్సిన అంశం. 

ప్రకృతి సౌందర్యం, ఎండ వెలుగుల్లో వెండిలా మెరిసే విస్తరించిన హిమాలయాలు, సమున్నత సాంస్కృతిక వైభవంతో పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లే జమ్ము`కశ్మీర్‌ గత మూడు దశా బ్దాలుగా ఉగ్రవాదం రూపంలో భౌగోళిక సంఘర్షణకు లోనవుతూనే వుంది. ఇంత జరుగుతున్నా పర్యాటకులను తనవైపు ఆకర్షించడంలో జమ్ము`కశ్మీర్‌ తన ప్రత్యేకతను అన్నివేళల్లో నిలుపుకుంటూనే వచ్చింది. 370 అధికరణం రద్దు తర్వాత పర్యాటకులకు స్వర్గధామంగా మరిన్ని సొబగులతో ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, తన సౌందర్యాన్ని మరింత ఆకర్షణీ యంగా తీర్చిదిద్దుకుంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఉగ్రవాదం శిథిలమయం చేస్తున్నా, తన ది వ్యమైన సౌందర్యం ఎక్కడా చెక్కుచెదరలేదు. నేటి మారిన పరిస్థితుల్లో ఇప్పటివరకు ప్రాకృతిక సౌందర్యంతో అలరారిన ఈ ప్రాంతంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే, ఆభరణాలతో మెరిసిపోయే సౌందర్యవతిలా, మనదేశానికి అద్భుత మణికిరీటంగా మారగలదు. 

370 అధికరణం రద్దుకు ముందు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా అన్నీ అడ్డంకులే. ఒకవైపు ఉగ్రవాదం మరోవైపు, జమ్ముాకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకు న్నాయి. మిగిలిన దేశం అభివృద్ధి పథంలో దూసుకెళుతుంటే, జమ్ముాకశ్మీర్‌ ఉగ్రవాద గాయాలతో నిరంతరం బాధపడాల్సి వచ్చేది. అన్నింటికి సైంధవుడిలా అడ్డుపడుతున్న ఈ 370 అధికరణాన్ని రద్దు చేయడంతో రాష్ట్రం దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు సమానంగా మారిపో యింది. రాజ్యాంగం ఇక్కడ కూడా అమలు కావడంతో అన్ని రకాల అవకాశాలకు ద్వారాలు తెరచుకున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి జమ్ముాకశ్మీర్‌ రాష్ట్రాన్ని ఇప్పుడు జమ్ముాకశ్మీర్‌ మరియు లద్దాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విడగొట్టింది.

ఇప్పటివరకు అంతర్లీనంగా మరుగున పడిన ఆధునికత క్రమంగా జమ్ము`కశ్మీర్‌లోకి ప్రవేశించ నుంది. డేటా సెంటర్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్‌ పార్క్‌లు, రక్షణరంగ స్టార్టప్‌లు, తయారీ రంగ ప్రవేశం వంటివి ఒకప్పుడు కల! కానీ నేడవి వాస్తవరూపం దాల్చడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను కేంద్రం రూపొందించి అమలు చేసేదిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం డేటాసెంటర్లకు పెద్దఎత్తున డిమాండ్‌ వుంది. జమ్ము`కశ్మీర్‌లోని చల్లని వాతావరణం వీటికి ఎంతో అనుకూలం. మిగిలిన దేశంతో పోలిస్తే ఇక్కడి అనుకూల వాతావరణం కారణంగా డేటా సెంటర్ల నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ ఖర్చు దాదాపు 40% వరకు తగ్గుతుంది! సరిగ్గా ఇటువంటి శీతల వాతావరణం ఉన్న పోలెండ్‌లో మైక్రోసాఫ్ట్‌ ఒక పెద్ద డేటాసెంటర్‌ కేంద్రాన్ని నెలకొల్పింది. మారిన పరిస్థితుల్లో ఇటువంటి డేటా సెంటర్లను శ్రీనగర్‌ మరియు జమ్ము`కశ్మీర్‌లోని ఇతర అనుకూల ప్రాంతాల్లో ఎందుకు నెలకొల్పకూడదన్న పశ్న్ర సహజంగానే ఉదయిస్తుంది. ఇక్కడి హైడ్రోఎలక్రిక్‌ ప్రాజెక్టులనుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ వల్ల చౌకధరలోనే ఇది లభ్యమవుతుంది. 

జమ్ముాకశ్మీర్‌లో వ్యవసాయం కూడా ఆధునిక రూపాన్ని సంతరించుకుంటోంది. సంద్రాయంగా సాగుచేసే ఉద్యానవన పంటనలనుంచి ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం వైపునకు మారే అవకా శాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మాత్రమే ఉత్పత్తి అయ్యే పండ్లు, కుంకుమ పువ్వుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉన్న సంగతి తెలిసిందే. సేంద్రీయ విధానంలో వీటి ఉత్పత్తులను చేపట్టవచ్చు. వీటికి తోడు కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, ప్రత్యక్ష మార్కెట్‌ లింకేజ్‌, ఆ గ్రోాప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు వంటివి రైతుల ఆదాయాన్ని బాగా పెంచడమే కాదు, అను బంధ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందడానికి దోహదం చేయగలవు.

ఇక రక్షణరంగానికి చెందిన స్టార్టప్‌లు, రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, సాంకేతికపరమైన ఎకోసిస్టమ్‌తో పాటు ప్రత్యేక డిఫెన్స్‌ కారిడార్లను అభివృద్ధి పరచినట్లయితే, అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో పనిచేసే మన సైనిక దళాలకు అవసరమైన వాటిని దేశీయంగా ఉత్పత్తి చేయవచ్చు. ఎంతో సంక్లిష్టమయంగా వుండే భౌగోళిక పరిస్థితుల్లో జవాన్లు పనిచేయడానికి అనువైన సామ గ్రిని సమకూర్చవచ్చు. ఇక ప్రత్యేక ఆర్థిక మండళ్లు సహజంగానే ఐ.టి./ఐటీఈ మరియు ఎల క్ట్రానిక్‌ పరిశ్రమలను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన యువకు లకు ఆవసరమైన నైపుణ్య శిక్షణను వేర్వేరు కార్యక్రమాల ద్వారా అందిస్తే, అత్యంత విలువైన హ్యూమన్‌ కేపిటల్‌ తయారవుతుంది. విద్యుత్‌ వాహనాలకు బ్యాటరీలు తయారుచేసే యూనిట్లు, సెమికండక్టర్‌ తయారీ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా జమ్ము`కశ్మీర్‌లో పారిశ్రామిక దృశ్యమే సమూలంగా మారిపోతుంది. గత జనగణన ప్రకారం జమ్ము కశ్మీర్‌ జనాబా 12.3 మిలియన్లు. అద్భుతమైన మానవ వనరులు కలిగిన ప్రాంతం. దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానత వల్ల యువకులకు మంచి అవకాశాలు లభిస్తాయి. 

అభివృద్ధి అవకాశాలు సరే. జమ్ముాకశ్మీర్‌లో భద్రత, సుస్థిరత అనేవి ఇప్పుడ ప్రధానాంశాలుగా వున్నాయి. ఇప్పటివరకు జమ్ముాకశ్మీర్‌ ‘‘సున్నితమైనాసైన్యం గుప్పిట్లో’’ వుండే ప్రాంతమన్న అభి ప్రాయం బలంగా నాటుకుపోయింది. అటువంటి అభిప్రాయం కలిగినవారు ఇప్పుడు తమ ఉద్దేశాన్ని మార్చుకోవాలి. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్‌, జమ్ముాకశ్మీర్‌ పోలీసులు ఇప్పుడు అనుక్షణం డేగకళ్లతో భద్రతా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. మరింత విస్తరించిన భద్రతా వ్యవస్థ కారణంగా నేడు జమ్ముాకశ్మీర్‌ ఒక స్థాయి భద్రత కలిగిన ప్రాంతంగా వుంది. 9/11 దాడుల తర్వాత దేశీయ విమానసర్వీసుల్లో భద్రతను మరింతగా పెంచారు. పలితంగా దేశీయ విమానయానం మ రింత భద్రంగా మారింది. ఉగ్రవాద సంఘటనలు రాష్ట్రంలో కనీసస్థాయికి తగ్గిపోయాయి. రాళ్లు విసరడం, మాటిమాటికి బంద్‌లు, హర్తాళ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. అన్నింటికంటే ముఖ్య మైన అంశమేంటంటే స్థానికంగా ఉగ్రవాద నియామకాలు తగ్గిపోవడం. 2018లో ఇవి 119గా వుండగా, 2023 నాటికి కేవలం 12కు పడిపోవడం గమనార్హం. 2018 నుంచి భద్రతాసిబ్బంది, సాధారణ పౌరులు, సైనిక చర్యలు గణనీయంగా తగ్గిపోయాయి. ఉదాహరణకు 2018లో 271 మంది ఉగ్రవాదులు హతం కాగా, 2023 నాటికి ఈ సంఖ్య 87కు పడిపోయింది. 2024లో ఈ సంఖ్య మరింతగా తగ్గిపోయింది. ఇక సాధారణ పౌరుల మరణాల విషయానికి వస్తే 2018లో వీరి సంఖ్య 86 కాగా, 2022 నాటికి 30కి, 2023లో 12కు పడిపోయింది. అదేవి ధంగా భద్రతా జవాన్ల మరణాలు 2018లో 95 వుండగా 2022 నాటికి 30కి, 2023 నాటికి 4కు పడిపోయింది. ముఖ్యంగా మరింత విస్తరించిన భద్రతా వలయం, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే మూలాలను ధ్వంసం చేయడం, కేంద్రపాలిత ప్రాంతంగా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ప్రత్యక్ష పాలన కింద వుంచడంతో కేంద్ర ప్రభుత్వం తన పథకాలను నేరుగా అమలు చేయగలుగుతోంది.

అయితే జమ్ముాకశ్మీర్‌ ఆర్థికంగా మరింతగా నిలదొక్కుకోవడానికి మరింత సమన్వయ సహకారాలు అవసరం. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి ప్యాకేజీలను చిత్తశుద్ధితో అమలుచేస్తున్నది. 370 అధికరణం రద్దు తర్వాత 106 కేంద్ర చట్టాలను అమల్లోకి తీసుకురాగా, అమల్లోవున్న చాలా రాష్ట్ర చట్టాలను రద్దుచేశారు. 2023 డిసెంబర్‌ 11న సుప్రీంకోర్టు తన అతి కీలకమైన తీర్పులో 370 అధికరణం రద్దును సమర్థించింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆర్థిక పురోగతిలో స్థానిక ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల రా ష్ట్రంలో శాంతి సుస్థిరతలు దీర్ఘకాలం చెక్కుచెదరకుండా కొనసాగగలవు. 

జమ్ముాకశ్మీర్‌లో కేంద్రం డీలిమిటేషన్‌ ప్రక్రియను చేపట్టడంతో జమ్ము ప్రాంతంలో అసెంబ్లీ సీ ట్లు 37 నుంచి 42కు పెరగ్గా, కశ్మీర్‌ లోయలో 46 నుంచి 47కు పెరిగాయి. రాష్ట్రంలో మొట్ట మొదటిసారి 9 సీట్లను గిరిజన తెగలకు కేటాయించం విశేషం. డీడీసీ మరియు పంచాయతీ ఎన్నికల్లో కొత్త పార్టీలు పాల్గనడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతోందనడానికి గొప్ప ఉదాహరణ. ప్రజలు వేర్పాటువాదం నుంచి, జాతీయ రాజకీయాలవైపు మరలడం శుభపరిణా మం. అన్ని వ్యవస్థలతో పాటు ఆర్థిక సంస్కరణలు కూడా అమల్లోకి తీసుకురావడం వల్ల జమ్ముాకశ్మీర్‌ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా వుండబోతున్నదన్న విశ్వాసం కలుగుతోంది. ఈ పరిణా మాల నేపథ్యంలో ‘‘ప్రత్యామ్నాయ పెట్టుబడుల ప్రపంచం’’ జమ్ముాకశ్మీర్‌నుంచి ఇక ఎంతోకాలం దూరంగా వుండలేదు. పెట్టుబడిదార్లు, ఎంటర్‌ప్రెన్యూర్లు, ఇతర భాగస్వాములు ఇక్కడ తమ పెట్టుబడులను విస్తరించడం ద్వారా భారత్‌ మణికిరీటంగా భావించే జమ్ముాకశ్మీర్‌ ఆర్థిక పునరభివృద్ధికి దోహదకారులు కావాలి. 

 జమ్ముాకశ్మీర్‌లో ఇప్పటివరకు తాండవమాడిన మతఛాందసవాదం, వేర్పాటువాదం స్థానాలను సెక్యులరిజం, నేషనలిజంలు ఆక్రమించాయి. హింస స్థానంలో శాంతి సుస్థిరమవుతోంది. అయితే ఇంకా ఉగ్రవాద మూలాలు సమూలంగా నాశనం కాలేదన్నది వాస్తవం. కానీ ఇప్పటి చర్యలే కొనసాగితే, త్వరలోనే ఈ మహమ్మారినుంచి రాష్ట్రం పూర్తిగా బయటపడగలదనడంలో ఎంతమా త్రం సందేహం లేదు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version