డాక్టర్ సారంగపాణి సేవలు అభినందనీయం
కరకగూడెం ఎంఈఓ గడ్డం మంజుల
20 వేల విలువచేసే ట్రాక్ సూట్ రేగళ్ల పాఠశాలకు అందజేత
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
కరకగూడెం మండలం రేగళ్ల ఎంపీపీఎస్ స్కూల్ లో ఈరోజు ఆ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు టి సుజాత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన కరకగూడెం మండల విద్యాధికారి గడ్డం మంజుల మాట్లాడుతూ విశ్రాంత ఆయుర్వేద కళాశాల హైదరాబాద్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సారంగపాణి 20వేల విలువ చేసే ట్రాక్ సూట్ ను విద్యార్థులకు అందజేయడం మారుమూల ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంత విద్యార్థుల మేధస్సును పెంచేలా వారి కృషి అభినందనీయం అన్నారు. బట్టుపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టి. మోహన్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ బడులని పరిరక్షించుకునే చర్యలలో భాగంగా ఈ పాఠశాల ఉపాధ్యాయుల కృషి , మరియు గ్రామస్తులకు కృషి ఉన్నప్పుడే పిల్లల భవిష్యత్తు మెరుగవుతుందని, అందుకోసం ఇంకా దాతలు డాక్టర్ సారంగపాణి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని కోరారు. జన విజ్ఞాన వేదిక స్టేట్ కల్చరల్ సెక్రటరీ డాక్టర్ లింగంపల్లి దయానంద్ మాట్లాడుతూ, ఒక్కసారిగా పిల్లలందరూ ట్రాక్ సూట్ వేసుకొని గ్రౌండ్లోకి రాగానే కళ్ళు చెమ్మగిల్లాయని , ఇలాంటి అవకాశము ఉపయోగించుకునీ విద్యార్థులు ముందుకు సాగాలని కోరారు. ఆయుష్ యోగా శిక్షకులు యోగి రాంబాబు విద్యార్థులకు గంటన్నర పాటు యోగా శిక్షణ అందించి, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం యోగా తరగతులు స్వచ్ఛందంగా పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వీరన్న, గ్రామ పెద్దలు పాయం నాగేశ్వరరావు , పాయం శ్రీనివాస్ , బాలకృష్ణ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.