నర్సంపేట,నేటిధాత్రి :
గణపతి నవరాత్రి ఉత్సవాలను పునస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని సరోజినిదేవి రోడ్ లో రాయల్ స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి పూజ,మహా అన్నదాన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్ జుర్రు రాజు,రాయల్ స్టార్స్ యూత్ సభ్యులు,భారతీయ జనతా యువ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్,యువ మోర్చ నియోజకవర్గ కన్వీనర్ ఆముదాల రమేష్,అబ్బరబోయిన రాజు,అంబేద్కర్,యువ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు కొంకిశా విఘ్నేష్, యువ మోర్చ జిల్లా కార్యదర్శి ఎర్ర రాజు, పట్టణ యువ మోర్చ అధ్యక్షులు తప్పేట్ల సతీష్,జిల్లా కార్యవర్గ సభ్యులు చిలువేరు అన్వేష్,కుసుమ భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.