వనపర్తి నేటిదాత్రి:
శ్రీ వాసవి సేవా సమితి మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా వనపర్తి త్రినేత్ర హాస్పిటల్ కంటి వైద్యులు డాక్టర్ దివ్య సుధింద్ర ను నియమించినట్లు శ్రీవాసవి సేవ సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి ప్రకటనలో తెలిపారు.
సేవ గుణం కలిగిన దివ్య గత మూడేళ్లుగా పేదవారికి ఎలాంటి రుసుము తీసుకోకుండా కంటి వైద్య సేవలు అందిస్తూ తన వృత్తిలో కూడా సేవాభావాన్ని చాటారు. గతంలో సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలలో తన వంతుగా డాక్టర్ దివ్య సహకారాలు అందించారు. సమాజ సేవలో ఆమె పాత్ర కొనసాగాలని సురేష్ శెట్టి అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దివ్య సుధింద్ర మాట్లాడుతూ,, తనపై నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతను అంకితభావంతో నెరవేరుస్తూ ముందుకు వెళ్తానని నాకు అవకాశం కల్పించిన వాసవి సేవా సమితి గౌరవ చైర్మన్ మాజి రాజ్యసభ సభ్యులు టి జి వెంకటేష్, వ్యవస్థాపక అధ్యక్షుల కు పూరి సురేష్ శెట్టి కి కృతజ్ఞతలు తెలిపారు.
