నిజాంపేట, నేటి ధాత్రి ,ఏప్రిల్ 5
నిజాంపేట మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ లో ని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపసర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు కొమ్మాట బాబు,
మాజీ ఎంపీటీసీ తమ్మలి రమేష్, దళిత సంఘాల నాయకులు గర్గుల శ్రీనివాస్, సంజీవ్, కొమ్మట స్వామి అశోక్ తదితరులు పాల్గొన్నారు