బిజెపి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు పకీరుగడ్డ ఆకు దారి వాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి బిజెపి పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి హాజరై ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కావున వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేష్ ని కూడా అన్ని వర్గాల ప్రజలు మీ చల్లని మనసుతో ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు భాస్కర్ సారయ్య సుదర్శన్ వెంకటరామిరెడ్డి దిలీప్ నితిన్ గౌతమ్ సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు