మహనీయుని ఆశయాలు మరిచిపోకండి

నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి….

కొల్చారం,( మెదక్) నేటిధాత్రి :-

నవభారత నిర్మాత భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త గొప్ప మహనీయుని 133వ జయంతి వేడుకలు ఈనెల 14న ఆదివారం ప్రపంచవ్యాప్తంగా కన్నుల పండుగగా జరుపుకొనుటకు ప్రజల సిద్ధమయ్యారు, 1891 ఏప్రిల్ 14న జన్మించిన మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మరణించారు, నేటికీ బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించి 133 సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఈ సందర్భంగా ప్రపంచ మేధావిగా ప్రపంచ దేశాలలోనే ఒక దళిత కుటుంబంలో జన్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలో ఆరడుగుల ఆ జాను బావుడు ఈ దేశంలో జన్మించడం ఈ దేశ ప్రజల కు ఎంతో గర్వకారణం కానీ ఆయన ఆశయాలు ఆదేశాలు సిద్ధాంతాలు మాత్రం పాలక ప్రభుత్వాలు నీరు కారుస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి, కుల నిర్మూలన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో కృషి అంతా ఇంతా కాదు, భారతదేశ మొట్ట మొదటి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు అరుదైన పీ, హెచ్, డి పట్టా తోపాటు లండన్ లో డాక్టరేట్ పట్టా కూడా పొందారు, ఎన్నో పీ. హెచ్, డి ల తోపాటు డాక్టర్ రేటు పట్టాలు పొందిన ఏ కైక వ్యక్తిగా ఈ ప్రపంచంలో అంబేద్కర్ కు సాటి లేరు, న్యాయ సామాజిక ఆర్థిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశారు ఆయన, 1956 సంవత్సరంలో హిందూ మతం నుంచి బౌద్ధ మతాన్ని స్వీకరించారు ఈ బౌద్ధమతంలో ఆయనతోపాటు లక్షలాది మంది దళితులు సామూహికంగా బౌద్ధమతంలోకి మార్పిడి అయ్యారు, రాజ్యాంగం పుస్తకం లోని అనేక అంశాలను పాలక ప్రభుత్వాలు కుటిల రాజకీయాల కోసం రాజ్యాంగ పుస్తకాన్ని రూపుమాపడానికి చేయడానికి కుట్రలు చేస్తున్నారని దేశ ప్రజలు గాండ్రిస్తున్నారు , ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు, రోజు రోజుకు రాజ్యాంగాన్ని పూర్తిగా రూపుమాపే విధంగా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని పదే పదే విమర్శలు వస్తున్నాయని ఇందుకోసం పాలక ప్రభుత్వాలు తక్షణమే రాజ్యాంగం సవరణ పేరుతో రాజ్యాంగాన్ని నిర్మూలిస్తే సహించేది లేదని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు 1990లో ఆనాటి భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది 1956లో అక్టోబర్ 29న నాగపూర్ కేంద్రంగా బౌద్ధమతం ధర్మదీక్షలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు ఇప్పటికీ ముంబైలో డియర్ అంబెడ్కర్ రాజగృహం ప్రస్తుతం రాజగిరి భవనంగా పేరు పెట్టారు అంబేద్కర్ స్మారక చిహ్నం ఇల్లు ముంబై నగరంలోని దాదర్ హిందూ కాలనీలో ఉంది ఈ రాజాగృహం రాజగిరి ని డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు సందర్శిస్తుంటారు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర గురించి ఆయన విద్యాభ్యాసం గురించి ఆయన చిన్ననాటి నుంచి అంటరానివాడిగా పాఠశాలలో అగ్రవర్ణాలు అంబేడ్కర్ పట్ల చూపిన వివక్షత వంటి అనేక సంఘటనలు ఇప్పటికీ రక్తపు మరకలు వెంటాడుతున్నాయి,ఎంత చెప్పినా అంబేద్కర్ గురించి తక్కువనే ఆయన జీవిత చరిత్ర ఎన్ని సంవత్సరాలు అయినా చెప్పడానికి సరిపడదు దేశవ్యాప్తంగా మొక్కుబడిగా జయంతి వేడుకలు వర్ధంతి వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆశయాలను ఆ దేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ తాను రచించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఈ సందర్భంగా ఈ దేశ రాజకీయ పార్టీల నాయకులు పాలక ప్రభుత్వాలకు చెందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లోని రాజ్యాంగ సభలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version