కాంగ్రెస్ నాయకుల గాలి మాటలు నమ్మి మోసపోవద్దు..గోస పడొద్దు

మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మన్న

మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 2

కాంగ్రెసోళ్ల గాలి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు..గోస పడొద్దని మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మన్న ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల వివరిస్తూ..బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ అంబెడ్కర్ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. దళితుల జీవితాల్లో వెలుగు నింపాలనే సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా దలితబందు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా ముందుకెళ్తున్న కేసీఆర్ కి మద్దతు తెలపాలని కోరారు. ఎన్నికలు రాగానే అధికార దాహంతో మాయాటలు చెప్పే కాంగ్రెస్, బిజెపి మాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దన్నారు. కార్యకర్తలంతా పార్టీ గెలుపుకోసం శక్తివంచన లేకుండా కృషిచేయాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీకోసం పనిచేసే ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటానని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version