రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన బేడ బుడగ జంగాలు చోప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ కు మద్దతు ప్రకటించారు. అధ్యక్షులు కోడగంటి అంజయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరగా సుంకె రవిశంకర్ వారందరికీ బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికుడైన రవిశంకర్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని పునరుద్గాటించారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోటి జరుగుతుందని విశ్వసించి బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కోండ కిష్టారెడ్డి, రామడుగు మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, కోండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్ రెడ్డి, గోపాలరావుపేట గ్రామ మాజీ సర్పంచ్ నేరెళ్ళ అంజయ్య గౌడ్, గోపాలరావుపేట గ్రామశాఖ అధ్యక్షులు వెల్పుల హరిక్రిష్ణ, పూడూరి మల్లేశం, పైండ్ల శ్రీనివాస్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.