జిఎచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోజ్ని వారి కార్యాలయంలో దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసిన వైనం

కూకట్పల్లి, మార్చి 04 నేటి ధాత్రి ఇన్చార్జి

జిఎచ్ఎంసి కమిషనర్ డి.రోనాల్డ్ రోజ్ వారిని వారి కార్యాలయంలో 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆ
ల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు సమస్యల గురించి చర్చించ డం జరిగింది. ఈ సందర్భంగా డివి జన్ పరిధిలోని ఎల్లమ్మబండలో ఉన్న హిందు, ముస్లిం, క్రిస్టియన్ స్మశానవాటికల సుందరికరణ పను లు మధ్యలో ఆపేశారు కాబట్టి వాటిని వెంటనే పునఃప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని,అలాగే గోవింద్ హోటల్ సర్కిల్ నుండి వయా ఎల్లమ్మబండ ప్రధాన రహ దారి సిక్కుల బస్తి వరకు జరగవ లసిన 100 fts రోడ్డు విస్తరణ పనులప్మలో భాగంగా రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించి రోడ్డు ను ఇరువైపులా వెడల్పు చేయకుండా వదిలేశారు.రోడ్డుకు డివైడర్ నిర్మించి వదిలేయడం వల్ల గతంలో కన్నా ట్రాఫిక్ సమస్య ఎక్కువై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టివెంటనే రోడ్డు విస్తరణ పను లు కూడా ప్రారంభించి ట్రాఫిక్ సమ స్యలకు పరిష్కరం చూపడం వంటి
విషయాలను కార్పొరేటర్ కమిషనర్ వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిం ది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version