కురుమ సంఘం మండల అధ్యక్షుడు శెవల్ల రాజయ్య
చేర్యాల నేటిధాత్రి..
దొడ్డి కొమురయ్య పోరాటం సాక్షిగా చేర్యాలను రెవెన్యూ డివిజన్ సాధిస్తామని కురుమ సంఘం చేర్యాల మండల అధ్యక్షులు శెవల్ల రాజయ్య అన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై చేస్తున్న దీక్షలు గురువారం 25వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో నాలుగు మండలాల కురుమ, గొల్ల కులస్తులు కూర్చున్నారు. వారికి జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల పరమేశ్వర్, కో చైర్మన్ పుర్మ ఆగం రెడ్డి లు కండువాలు కప్పి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కురువ సంఘం నాయకులు మాట్లాడుతూ.. నాడు దున్నే వాడికే భూమి కావాలని వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి నిజాం రాజకర్లకు తరిమికొట్టిన చరిత్ర చేర్యాల ప్రాంతానికే దక్కిందన్నారు. తాలూక, నియోజకవర్గ స్థాయిని కోల్పోయి ఎంతో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య పోరాటం సాక్షిగా రెవెన్యూ డివిజన్ సాధన కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. ఈదీక్షల్లో కురుమ సంఘం నాయకులు కౌన్సిలర్ చెవిటి లింగం, అందె అశోక్, ఆలేటి యాదగిరి,బియ్య రమేష్, చేటుకూరి కమలాకర్, జెల్ల శ్రీనివాస్, ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి,సూర్న శ్రీకాంత్, కొల్పుల యాదగిరి, బండారి సిద్దయ్య, ఎగుర్ల ఎల్లయ్య, బండారి శ్రీశైలం, బియ్య సిద్ధులు, కొల్పుల నర్సయ్య, కర్రె రాములు, బైతి మల్లయ్య, ఒగ్గు రవి కుమార్, బియ్య బాబు, నంగి కనకయ్య, శిగుళ్ల కొమురయ్య, తిగుల్ల కనకయ్య, బియ్య అశోక్, మేక శ్రీనివాస్, చెవిటి ఐలయ్య, శిగుళ్ల యదయ్య, అల్లం రాజు, తొర్రి రాజు, బోల్లబోయిన రాజు, పెరబోయిన రాజు, బైతి ఎల్లం, చౌదరి అశోక్ తదితరులు కూర్చోగా వారికి సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగ రావు, వీరన్నపేట సర్పంచ్ కొండపాక భిక్షపతి, మల్లిగారి యాదగిరి, కందుకూరి సిద్దిలింగం, తడక లింగం, ఆకుల రమేష్, బిజ్జ రాము,సనవాల ప్రసాద్, తాడెం వెంకట స్వామి తదితరులు సంఘీభావం తెలిపారు.