మధ్యాహ్న భోజన కార్మికుల బైక్షాటన

యూనియన్ తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్


పరకాల నేటిధాత్రి (టౌన్)
బడి పిల్లలకు అప్పులు చేసి ఎదురు పెట్టుబడి పెట్టి కడుపునిండా తిండి పెట్టే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అన్నం పెట్టే చేతులతోనే భిక్షాటన చేయించడం సిగ్గుచేటు అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొట్ల చక్రపాణి అన్నారు.గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న సమ్మెలో భాగంగా కొంగు పట్టి పరకాల లో బిక్షాటన చేశారు.ఈ సందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షులు బోట్ల చక్రపాణి మాట్లాడుతూ గత 18 నెలలుగా చాలీచాలని వేతనాలు నెలకు ₹1000 జీతంతో పనిచేసి అనేక పోరాటాల ఫలితంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 2022 మార్చి లో 2000 రూపాయల జీతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆ పెరిగిన జీతం కూడా నేటికి ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు.మధ్యాహ్న భోజన కార్మికులు వంట నిర్వాహాన కోసం అప్పులు చేసిన డబ్బులు ఆరు నెలలు గడుస్తున్నా నేటికీ ఆ బిల్లులు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వీరికి ఉద్యోగ భద్రత,గుర్తింపు కార్డు ఈఎస్ఐ,పిఎఫ్ ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేకుండా పని చేస్తున్న ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా రోడ్డుపై నెట్టు వేయడం దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే గుర్తింపు కార్డులు,వంట పాత్రలు, పోషిస్తున్నారు అంగన్వాడి సెంటర్లకు సరఫరా చేస్తున్నట్లు కోడిగుడ్లు స్కూళ్లకు పంపించాలని,సరిపడా గ్యాస్ ఇవ్వాలని,యూనిఫామ్ ఇవ్వాలని తదితర డిమాండ్ల పరిష్కరించాలని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన ఫలితం లేకపోవడంతో సమ్మె చేస్తున్నామని ఆయన తెలిపారు.ప్రభుత్వం బేషజాలకు పోకుండా యూనియన్ తో చర్చలు జరిపి వీరి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.లేనియెడల ఈ సమ్మెను మరింత ఉదృతం చేస్తామని చక్రపాణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు పోతిరెడ్డి సమ్మక్క,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version