జీహెచ్ఎంసీలో విలీనమైన మేడ్చల్ నియోజకవర్గంలో డివిజన్లు పెంచాలి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-16T115432.870.wav?_=1

 

జీహెచ్ఎంసీలో విలీనమైన మేడ్చల్ నియోజకవర్గంలో డివిజన్లు పెంచాలి
* మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్
* రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు వేం. నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ శ్రీధర్ బాబు, జీహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ లకు వినతి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 16 :

 

జీహెచ్ఎంసీలో విలీనమైన మేడ్చల్ నియోజకవర్గంలో జనాభా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు డివిజన్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు వేం. నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ శ్రీధర్ బాబు, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్ లను మంగళవారం కలిసి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ

డివిజన్ల సంఖ్య పెరిగితే ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించడానికి, పాలన మరింత సమర్థవంతంగా సాగడానికి అవకాశం ఉంటుందన్నారు. మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డి, మేడ్చల్ మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, మాజీ మేయర్లు తోటకూర అజయ్ యాదవ్, అమర్ సింగ్, పలువురు మాజీ కార్పోరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version