గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ గోశాల గోమాతలకు భూపాలపల్లి ప్రధాన ఆస్పత్రి వైద్యురాలు వంకదారు సుస్మిత సోమవారం దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు నరేష్ తీర్థ ప్రసాదాలను ఆశీర్వచనాలను అందజేశారు. గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేసిన డాక్టర్ సుస్మిత కు కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.