డి సి ఏ, నిర్లక్ష్యం తోనే మెడికల్ మాఫియా కు దారి తీసింది.

గుర్తింపు ఫార్మసిస్ట్ లేకుండా ఔషధ విక్రయాల కేంద్రాలు మూసివేయాల్సిందే, దేశంలోని అనేక న్యాయస్థానాల తీర్పు.

మహా మెడికల్ మాఫియా తనిఖీలు చేసిన అధికారులకు గుర్తింపు ఫార్మసిస్టులు ఉన్నట్లు గుర్తించారా, తక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు.

ముదిరిపోయి మాఫియా రెచ్చిపోతుంది, ఉన్నత అధికారుల జోక్యంతోనే మాఫియాకు కళ్లెం. వేయి కళ్ళతో చూస్తున్న జనం.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

మామూళ్ల మత్తులో మాఫియాను సృష్టించిన అధికారులకు ప్రజల ప్రాణాల విలువలు చట్టాలు నిబంధనలు వారి చేతుల్లో కీలుబొమ్మలా నడుస్తాయి అనడానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ఉమ్మడి మండలంలో మెడికల్ మాఫియా ఆగడాలే సాక్షాలు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్, డి సి జి ఐ, ఔషధ విక్రయాలకు సంబంధించి అనేక కఠిన నిబంధనలు అమలులోకి తీసుకువచ్చిన అధికారులు అమలుపరిచే పరిస్థితి ఉండదు. అది కేవలం కాగితాల పై వరకి పరిమితం కావడం జరుగుతుంది. “రాజు తలుసుకుంటే కురడా దెబ్బలకు కుదువ ఉండదు” అన్న సామెత అక్షర సత్యం అని ఉమ్మడి మండలంలో మహా మెడికల్ మాఫియా కు డ్రగ్ కంట్రోల్ అధికారులు కాసుల మత్తు లొ ఉండి నిర్లక్ష్య వైఖరి కనబరచడం ఇదే ప్రత్యక్ష సాక్షమని కూడా చెప్పడంలో సందేహం లేదు. మెడికల్ మాఫియా కు సంబంధించి సాక్షాలు వాస్తవాలను ప్రచురించినప్పటికీ కూడా అధికారులు తనిఖీలు జరిపి ప్రత్యక్షంగా అవుకు తౌకలు ఉన్నప్పటికీ 15 రోజులు గడుస్తున్న చర్యలు తీసుకోకపోవడం అనుమానాలు కాదు వాస్తవాలు అనేటట్టుగా వ్యవహరిస్తుంది అనటంలో సందేహం లేదు. ఉమ్మడి మండలంలో మెడికల్ మాఫియా ప్రస్తుతం అధికారుల నిర్నిక్ష ధోరణితో రెచ్చిపోయి, నిబంధనలకు విరుద్ధంగా ఔషధ విక్రయాలు, ప్రైస్క్రిప్షన్ లేకుండానే వందల రూపాల ఔషధాలను విక్రయాలు చేయడం, అర్హత లేని వ్యక్తులందరూ మందుల విక్రయాలు జరపడం, డ్రగ్ హన్కింగ్, మెడికల్ యజమాని వైద్యం, ఇలా అనేక డ్రగ్ కంట్రోల్ అథారిటీ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మెడికల్ దుకాణాలపై డ్రగ్ కంట్రోల్ అధికారుల నిశ్శబ్ద వైఖరి డ్రగ్ అధికారులు ఏ విధమైన మత్తులో మత్తులో ఉండి చర్యలకు ససేమీరా అంటున్నారని చెప్పక తప్పడం లేదు.

డి సి ఏ, నిర్లక్ష్యం తోనే మెడికల్ మాఫియా కు దారి తీసింది.

గజ ఆరోగ్య వ్యవస్థలు ఔషధ కేంద్రాల నుండి ప్రజల ఆరోగ్యాలను కాపాడుటకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ శాఖ కీలక బాధ్యత వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ డ్రగ్ కంట్రోల్ శాఖ ఇప్పుడు వారి బాధ్యతను విస్మరించింది అని చెప్పడానికి మహా మెడికల్ మాఫియా ఆగడాలి సాక్ష్యం. మెడికల్ మాఫియా ను అధికారుల అండదండలు చూసుకొని ఏలాంటి తప్పు చేసిన తమకు అడిగే వారు ఎవ్వరు లేరని ముడుపులు చెల్లిస్తే చాలు అనే ఆలోచన మెడికల్ మాఫియా ఏర్పాటై అమాయక ప్రజలను రోగులను దోచుకోవడం జరుగుతుంది. రిటైల్ ఔషధ దుకాణాలకు సంబంధించి డ్రగ్ మరియు కాస్మోటిక్ చట్టం 1940 మరియు కాస్మోటిక్ రూల్ 1945 తోపాటు రిటైల్ మెడికల్ నిర్వహణకు సంబంధించి పబ్లిక్ హెల్త్ ను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తో పాటు న్యాయస్థానాలు సైతం కఠిన నిబంధనలు చర్యలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయా శాఖలకు ప్రత్యేకంగా డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా బి సి జి ఐ, ఆదేశాలను అమలు పరచాలని కూడా ఆదేశించడం జరిగింది. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నీ ఉమ్మడి మహాదేవపూర్ మండల్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి ఆనుకొని ఉండడం మండలానికి సంబంధించిన రోగులే కాకుండా పక్క రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా మహా మెడికల్ మాఫియాకు ఊబిలో పడి ఉన్నారు. సుమారు మహారాష్ట్రలోని సిరివంచ తాలూకా కు సంబంధించిన 16 గ్రామాలు మహా మెడికల్ మాఫియా ఆ గ్రామాల ప్రజలకు తమ గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది. ఇక మహా మెడికల్ మాఫియా ఆగడాలకు మాత్రం డ్రగ్ కంట్రోల్ శాఖ చర్యలు తీసుకునే సత్తా లేకుండా పోయింది. ప్రత్యక్షంగా అధికారులు తనిఖీ చేస్తున్న క్రమంలో ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్ యజమానులు అధికారులకు వివరణ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మెడికల్ నిర్వహణకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఇతర లావాదేవీల్లో కూడా కనీస నిబంధనలు లేనప్పటికీ కూడా అధికారుల నుండి నేటికీ చర్యలు తీసుకోకపోవడం గల కారణం డ్రగ్ కంట్రోల్ ఉన్నత అధికారులు పేద ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పట్టపగలు నిర్భయంగా పేద ప్రజలు అమాయక రోగుల నుండి స్థానిక రోగులే కాకుండా పక్క రాష్ట్రాలకు సంబంధించిన రోగులను సైతం స్వయ వైద్యం చేస్తూ ఔషధాలను విక్రయిస్తున్నారంటే డ్రగ్ కంట్రోల్ శాఖ నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది అనేది స్పష్టం అవుతుంది.


గుర్తింపు ఫార్మసిస్ట్ లేకుండా ఔషధ విక్రయాల కేంద్రాలు మూసివేయాల్సిందే, దేశంలోని అనేక న్యాయస్థానాల తీర్పు.

పబ్లిక్ హెల్త్ సెక్టార్ కు సంబంధించి ఔషధ విగ్రహాల్లో ప్రజల ఆరోగ్యానికి పరిరక్షణ చేయడంలో డి సి జి ఐ తోపాటు ఇండియన్ ఫార్మా కౌన్సిల్ లు షెడ్యూల్ హెచ్ / హెచ్ వన్
ఫార్మసీ చట్టం 1947 అలాగే 42 ఏ 1940 రూల్స్ 62 పిల్లలు కఠినంగా అమలు పరచాలని కోరడం జరిగింది. అంతేకాకుండా ఔషధవిక్రయాల్లో ఔషధ దుకాణాల ఏర్పాట్లు గుర్తింపు పొందిన ఫార్మసిస్ట్ ఔషధ ఔషధ అభిప్రాయాలు మాత్రమే జరపాలని ఢిల్లీ హైకోర్టు తో పాటు ముంబై తమిళనాడు తో పాటు పలు న్యాయస్థానాలు ఔషధ విక్రయాల్లో గుర్తింపు పొందిన ఫార్మసిస్ట్ తప్ప ఇతరులకు ఔషధ అభిప్రాయాలు చేసే అర్హత లేదని అలాంటి ఔషధ కేంద్రాలు డ్రగ్ కంట్రోల్ అధికారి దృష్టికి వస్తే తక్షణమే మూసివేయాలని వారిపై క్రిమినల్ ప్రొసీజర్ ఆక్ట్లను కూడా నమోదు చేయాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇండియన్ ఫార్మసీ అసోసియేషన్ రిజిస్టర్ ఫార్మసిస్ట్ లేకున్నప్పటికీ కూడా ఫార్మసీలు నిర్వహించడం పై ఐపీఏ చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు షెడ్యూల్ హెచ్ వన్ తో పాటు కాస్మోటిక్ చట్టాలను సూచిస్తూ చర్యలకు ఆదేశించాలని కోరడం కూడా జరిగింది. మరి రాష్ట్రాల్లో న్యాయస్థానాలు ఇండియన్ ఫార్మసీ అసోసియేషన్ తో పాటు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా పబ్లిక్ హెల్త్ షెడ్యూల్ లోని హెచ్ వన్ ఇలాంటి చట్టాలకు డ్రగ్ కంట్రోల్ అధికారులు పాటిస్తున్నారా అంటే మెడికల్ మాఫియా ఏర్పాటు పేద ప్రజలు మరియు రోగులకు మరింత ప్రాణాపాయం దుస్థితికి తీసుకు వెళ్ళుటకు మెడికల్ మాఫియా కు ప్రోత్సహిస్తున్నారు అని అనడానికి మహా మెడికల్ మాఫియా ఆగడాల కు సంబంధించిన సాక్షాలు సరిపోతాయి.

మహా మెడికల్ మాఫియా తనిఖీలు చేసిన అధికారులకు గుర్తింపు ఫార్మసిస్టులు ఉన్నట్లు గుర్తించారా, తక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు.

ఒకవైపు న్యాయస్థానాలు డిసిజిఐ తో పాటు ఇండియన్ ఫార్మసీ అసోసియేషన్ అలాగే ప్రత్యేకంగా షెడ్యూల్లోని హెచ్ వన్ ఔషధ విక్రయాల్లో కేవలం గుర్తింపు పొందిన ఫార్మసిస్ట్ ఆధ్వర్యంలోని ఔషధాలను విక్రయించాలని ఒకవేళ ఫార్మసీలు గుర్తింపు పొందిన ఫార్మసిస్ట్ లేకుండానే యాజమాన్యం లేదా ఇతరులు ఔషధాలను విక్రయిస్తే వారిపై డ్రగ్ కాస్మోటిక్ యాక్ట్ తో పాటు షెడ్యూల్ హెచ్ లో తెలిపిన పబ్లిక్ హెల్త్ ఆక్ట్ కు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయన్న విషయం అధికారులకు తెలిసినప్పటికీ కూడా తక్షణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి. గత నెల 18వ తేదీ మహా మెడికల్ మాఫియాకు సంబంధించి డ్రగ్ కంట్రోల్ అధికారులు నాలుగు మెడికల్ షాపులను తనిఖీలు చేసే క్రమంలో గుర్తింపు పొందిన ఫార్మసిస్ట్ ఫార్మసీ లైసెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వ్యక్తి అధికారుల విచారణ సమయంలో మెడికల్ షాపులో ఉన్నాడా లేదా యజమానులే అధికారులకు వివరించారా అంటే విచారణ చేపట్టిన వాటిలో ఎవరికి కూడా ఫార్మసీ పై అవగాహన లేదు ఫార్మసిస్ట్ నీ పదం దూర ప్రాంతం వరకు ఉండదు కానీ అధికారులు గుర్తింపు పొందిన ఫార్మసిస్ట్ లేకుండా ఫార్మసీలో ఔషధాల విక్రయాలు సంబంధించి డి సి జి ఐ తోపాటు హెచ్ వన్ నిబంధనలు అధికారులకు గుర్తు రాలేదా తెలంగాణ రాష్ట్రంలోని 2012 14 తో పాటు 17 లో అనేక మెడికల్ దుకాణాలను వాటి లైసెన్సులను రద్దుచేసి 8 నెలల నుండి రెండు సంవత్సరాల వరకు ఆ మెడికల్ షాపులను సిస్ చేయడం లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక న్యాయస్థానాలు మాత్రం సమయాన్ని ఇవ్వకుండానే తక్షణ చర్యలకు ఆదేశా జారీ చేయాలని 1947 42/a తో పాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లను కూడా అమలు పరచాలని ఆదేశాలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ కు సంబంధించి కఠిన నిబంధన ఉన్నప్పటికీ కూడా తనిఖీ చేసిన అధికారులకు వారు ఫార్మసిస్టులుగా కనబడ్డారా ఏమో తెలవదు కానీ 15 రోజులు పూర్తయినప్పటికీ కూడా తనిఖీ చేసిన మెడికల్ షాపులతోపాటు అధికారులు వచ్చారన్న సమాచారం తెలుసుకొని మూసి వేయబడిన మెడికల్ షాపులపై చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. షో కాస్ నోటీస్ ఇవ్వడం జరిగిందని మాఫియాలో కొందరు చెప్పుకోవడం జరుగుతుంది తప్ప అధికారికంగా షోకాస్ నోటీసులు జారీ చేసిన విషయం బహిర్గతం కాకపోవడం మరిది అనుమానాలకు దారితీస్తుంది.

ముదిరిపోయి మాఫియా రెచ్చిపోతుంది, ఉన్నత అధికారుల జోక్యంతోనే మాఫియాకు కళ్లెం. వేయి కళ్ళతో చూస్తున్న జనం.

ఇక ఉమ్మడి మండలం మహాదేవపూర్ మహా మెడికల్ మాఫియా ఆషామాసి వ్యవహారంలో లేదు ప్రశ్నిస్తే రాజకీయాలను ఆశ్రయిస్తాం లేదంటే అసత్యపు ఆరోపణలు చేస్తాం కిందిస్థాయి అధికారులు తమ గుప్పిట్లో ఉన్నారు తమకు ఏమి కాదు మాఫియాలో అందరూ ఫార్మసిస్టులే ఏలాంటి నిబంధనలు పాటించం ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలకు పోలిచ్చే పరిస్థితి లేదు ప్రైవేట్ ఇతర ఆసుపత్రులకు డాక్టర్లతో కన్సల్ట్ మెడికల్ షాప్ ముందు నుండే ప్రైవేట్ వైద్యులకు ఫోన్ వారు తెలిపిన మందులు పది నిమిషాల్లో రెడీ 1500 నుండి 2500 రూపాయల వరకు వసూలు, మరోవైపు ఏ డాక్టర్ అవసరం లేదు రోగం చెప్తే సరిపోతుంది 200 నుండి 600 వరకు ఔషధాలు సిద్ధం. ఫార్మసిస్ట్ ఎవరూ లేరు ప్రతి మెడికల్ షాప్ యజమానితోపాటు కుటుంబంలోని అందరూ ఫార్మసిస్టులే, మైనర్లు సైతం ఔషధాలు విక్రయించడం ఔషధాల విక్రయాల్లో 6 నుండి 11 సంవత్సరాల వరకు మైనర్లు వచ్చిన రోగం పేరు చెప్తే సరిపోతుంది ఔషధాలు అందించి రూపాలు తీసుకోవడమే లక్ష్యం, ఎవరికి బిల్లు ఇచ్చే పరిస్థితి ఉండదు, ఔషధాల రికార్డు నమోదు విక్రయం చేసిన ఔషధాలకు సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్ వైద్యుని సమాచారం జడకి లేకుండా చేశారు, ప్రతి మెడికల్ నిర్వాహకుడు పక్కన ఒక రూము ఏర్పాటు చేసుకొని వైద్యం అందించడమే లక్ష్యం, ప్రభుత్వ ఆసుపత్రి ఇతర గుర్తింపు పొందిన డాక్టర్ అవసరం లేదు మేమే అంత చూసుకుంటాం, రెండు సిలై ఒక ఇంజక్షన్ తోపాటు నాలుగు రకాల టాబ్లెట్ 1200 బిల్లు, ఇది చూసి స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లకుండా మెడికల్ యజమానుల వద్ద చికిత్స చేయించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మహాదేవపూర్ మండల కేంద్రంతోపాటు సూరారం అంబటిపల్లి, గ్రామాల్లో మాఫియా తన ఆగడాలను ముమ్మరంగా కొనసాగిస్తుంది, మరోవైపు పక్క రాష్ట్రానికి సంబంధించిన రోగులు కూడా మాఫియాకు సంబంధాలు ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ వాహనాల ద్వారా ఔషధాలను లేదా వారికి తెలిసిన బంధువుల ద్వారా మందులను రవాణా చేయడం జరుగుతుంది. మహా మండలంలో మెడికల్ మాఫియా భాగోతం ఇది. వ్యవహారమంతా డ్రగ్ కంట్రోల్ అధికారులకు తెలియకుండానే జరుగుతుందా డ్రగ్ కంట్రోల్ అధికారులు కేవలం గత నెల 18 కి ముందు ఈ మండల చరిత్ర లోని తనిఖీలు చేసిన దాఖలాలు లేవు, ఈ వ్యవహారమంతా అధికారుల కనుసైగల్లో ఉండి చేయడం జరుగుతుంది అనడానికి సాక్ష్యాలు అవసరం లేదు, అధికారుల తనిఖీలు అనంతరం 15 రోజులు గడుస్తున్న చర్యలు తీసుకోకపోవడమే సాక్ష్యం. మహా మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టడం కేవలం ఉన్నత అధికారులతోనే సాధ్యం అవుతుంది అని ఉమ్మడి మండల ప్రజల మరియు రోగుల నమ్మకం. విజిలెన్స్ తో పాటు డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ మరియు డిప్యూటీ డైరెక్టర్ అలాగే డైరెక్టర్ జనరల్ సరిహద్దు ప్రాంతమైన మహాదేవపూర్ మండల పేద ప్రజల మరియు రోగులకు మెడికల్ మాఫియా నుండి విముక్తి కొరకు ఉమ్మడి మండలంలోని సుమారు 24 మెడికల్ షాపులపై తక్షణ చర్యలు తీసుకొని మారుమూల ప్రాంత ప్రజలను వారి పరాణాలను కాపాడుతారని వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. ఇక ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version