వరుస సెలవులతో ప్రజలకు ఇబ్బందులు.

శనివారం వస్తారో లేదో ఆదివారం సెలవే.

ఇబ్బందుల్లో ప్రజలు, అధికారులు ఖుష్.

ఈ వారం కేవలం రెండు రోజులు మాత్రమే పని దినాలు.

సెలవుకు బదులు ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ ప్రధానికి నివాళులు అర్పిస్తే బాగుండేది.

శనివారం ఆదివారాలు ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి పని దినాలు కొనసాగించేలా ఆదేశించాలి. ఉమ్మడి మండల ప్రజలు.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

వరుస సెలవుల రాకతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకపోలేదు. రెండు రోజులు క్రిస్మస్ సెలవులు ముగియకముందే దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశ ప్రజలకు తీరని లోటు కలిగినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు తెచ్చుకోకపోవడం సామాన్యులకు ఇబ్బందులు కలగక తప్పలేదు.

ఈవారం సోమ మరియు మంగళవారం రెండు రోజులు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు అధికారులు తమ పని దినాలు కొనసాగించి బుధ గురు రెండు రోజుల క్రిస్మస్ సెలవుకు వెళ్ళిన అధికారులు మూడవరోజు శుక్రవారం కార్యాలయాలకు పయనం కొరకు సిద్ధమై ఉన్నప్పటికీ మాజీ ప్రధాని మృతి సెలవు దినం ప్రకటించడంతో ప్రభుత్వ కార్యాలయాలు తెచ్చుకోలేదు. కానీ సాధారణ ప్రజలు మాత్రం మూడవరోజు శుక్రవారం కార్యాలయాలు తెలుస్తాయని తమ పనులు తీసుకుంటామని ఎంతో ఆశతో ఉన్న ప్రజలకు మాత్రం నిరాశ కనబరిచింది.

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అకాల మృతి
యావత్ దేశానికి తీరని లోటు అయినప్పటికీ దేశ ఆర్థిక సంపనాన్ని తన మేధస్సుతో గాడిలో పెట్టిన ప్రధానికి ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి వారికి నివాళులు అర్పిస్తే వారి ఆత్మకు అలాగే వారు దేశానికి చేసిన సేవలకు ఎంతో గర్వకారణంగా ఉంటుందని సాధారణ ప్రజానీకం అనుకుంటున్న మాటలు. ఇక ప్రభుత్వ అధికారుల విషయానికొస్తే ఇప్పటికే అనేక అధికారులు ఉమ్మడి మండలం మహాదేవపూర్ మరియు పలిమెల మండలాలకు చెందిన అధికారులు స్థానికంగా ఉండకుండా ఇతర ప్రదేశాల నుండి రాకపోకలు కొనసాగిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు శనివారం ఒకే రోజు కదా అని పై అధికారుల మీటింగ్ లేదా వీడియో కాన్ఫరెన్స్ పేర్లతో శనివారం రోజులు దాటేస్తే తిరిగి సోమవారం రోజు రావచ్చని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు రేపటి కార్యాచరణలో నిమగ్నమై ఉండటం సహజమని ఉమ్మడి మండల ప్రజలు చెప్పుకుంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా ఉన్నత అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారం రోజు అధికారులు ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో హాజరయ్యేలా చూడాలని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు నూతన పథకాలలో ఇంద్రమ్మ ఇండ్ల సర్వే విషయంలో అర్హులైన పేద ప్రజల పేర్లు నమోదు కాకపోవడం తో ఇల్లు లేని నిరుపేదలు అధికారులకు విన్నపించుకొనుటకు గత మూడు రోజుల నుండి కార్యాలయాల తెరుచుటకు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లా ఉన్నత అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రోజు కూడా సాధారణ రోజు లాగే పని దినాన్ని కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని చర్యలు ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version