పిల్లల మర్రి బాలోత్సవం బృహత్తరమైన కార్యక్రమం

ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ పట్టణం లో శుక్రవారం జరుపుకుంటున్న ఈ బాలోత్సవం పిల్లల లో దాగిన నైపుణ్యాలను వెలికితీసే బృహత్తరమైన కార్యక్రమం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణం లోని బృందావన్ ఫంక్షన్ హాలు లో జరిగిన మూడవ పిల్లల మర్రి బాలోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంచి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఇక్కడ రాగానే మనసు సంతోషంతో నిండిపోయిందని అన్నారు. వచ్చే సంవత్సరం ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని, భవిష్యత్తు లో నిర్వహించే ఈ కార్యక్రమానికి తన సంపూర్ణ సహకారం ప్రోత్సహం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అంతకు ముందు బాలోత్సవం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, పిల్లల మర్రి బాలోత్సవం అధ్యక్షులు బెక్కం జనార్ధన్, డాక్టర్ ప్రీతి, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కౌన్సిలర్ ప్రశాంత్, బుద్దారం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version