తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో ట్రైబల్ స్కూల్లో బోరు మోటార్ ప్రారంభించిన ఎంపీపీ పడిగల మానస రాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిషత్ నిధుల నుండి అలాగే గ్రామపంచాయతీ నిధుల నుండి రెండు లక్షల ఇరవై వేల రూపాయలతో బోరు మోటారు ప్రారంభించడం జరిగిందని మన మంత్రి కేటీ రామారావు సహకారంతో మండలాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు పాఠశాలకు బోరుబాటలు మంజూరు చేసిన మంత్రి కేటీ రామారావుకి స్థానిక ప్రజాప్రతిలకు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీవాణి రమేష్ ఎంపీటీసీ ప్రసూన నరసయ్య వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి సలీం నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు