ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జెడ్పిచైర్ పర్సన్ గండ్ర జ్యోతి
మారపల్లి సుధీర్ గెలుపుకై బీఆర్ఎస్ విస్తృత ప్రచారం
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలో వరంగల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ గెలుపు కొరకు మండలంలో వసంతపూర్, ప్రగతి సింగారం, పత్తిపాక గ్రామాలలోపనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుపై ఓటువేసి గెలిపించాలని పలు గ్రామాల ప్రజలను కోరడం జరిగిందని గండ్ర జ్యోతి తెలిపింది .ఈకార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ , మైలారం ఎంపీటీసీ గడిపే విజయ విజయ్ కుమార్ , తహరాపూర్ ఎంపీటీసీ గొట్టిముక్కుల స్వాతి విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామ్ శెట్టి లతా లక్ష్మారెడ్డి మైలారం మాజీ సర్పంచ్ అరకిల్ల ప్రసాద్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ రాజిరెడ్డి ,ప్రగతి సింగారం మాజీ సర్పంచ్ సుమలత రమణారెడ్డి శాయంపేట మాజీ సర్పంచ్ వల్పదాస్ చంద్రమౌళి మండల నాయకులు మారపల్లి మోహన్ ధైనంపల్లి కరుణ బాబు, పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షుడు పసుల ప్రవీణ్, వసంతపూర్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి శాయంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేందర్,పలు గ్రామాల నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు