అనూరియా కేసులో నాలుగుకు చేరిన మృతులు.. జిల్లా కలెక్టర్
రాజమహేంద్రవరంలో అనూరియా వ్యాధితో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరిందని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు.
తూర్పుగోదావరి, ఫిబ్రవరి 23: రాజమహేంద్రవరంలో అనూరియా వ్యాధితో ఆసుపత్రుల్లో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరిందని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటా సర్వే నిర్వహించి 73 శాంపిల్స్ సేకరించామని వివరించారు. అలాగే పాల వ్యాపారికి చెందిన 42 గేదెల నుంచి పాలు సేకరించి.. ఆ శాంపిల్స్ను కూడా హైదరాబాద్ ల్యాబొరేటరీలకు పంపామన్నారు. రాజమహేంద్రవరంలో చోటు చేసుకున్న అనూరియా(మూత్రం నిలిచిపోవడం)పై జిల్లా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన అంశాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
