వెల్దండ / నేటి ధాత్రి
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని రాచూరు గ్రామానికి చెందిన చెట్ల కాశన్న (48) అనారోగ్యంతో బుధవారం ఉదయం మరణించాడు. ఇతని భార్య ఎనిమిది నెలల క్రితమే అనారోగ్యంతో బాధపడుతూ.. మృతి చెందింది. వీరికి నవీన్ (18) శిరీష (16) రేణుక (13) శివరాణి (8) అనే నలుగురు పిల్లలు ఉన్నారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోవడంతో నలుగురు పిల్లలు తండ్రి శవం వద్ద బోరున విలిపించారు. చిన్నారుల రోదనను చూసిన గ్రామస్తులు.. పసి వయస్సులో పిల్లలకు కష్టాలు వచ్చాయని.. తల్లిదండ్రులు లేని లోటు ఎవరు తీర్చలేరని.. గ్రామస్తులు కంటతడి పెట్టారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మండల బీజేవైఎం ఉపాధ్యక్షుడు బెక్కరి సురేష్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు కోరారు.