మృతుల కుటుంబాలకు దండ వెంకటేశ్వర్ రెడ్డి ఆత్మీయ పరామర్శ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మ్యాకల ఎల్లమ్మ (75), ఈరోజు అనారోగ్యంతో మృతి చెందిన వనపర్తి లచ్చమ్మ (80) ల కుటుంబాలను పిడిసిల్ల మాజీ ఎంపీటీసీ దండ వెంకటేశ్వర రెడ్డి ఆత్మీయంగా పరామర్శించారు. ఈరోజు మరణించిన వనపర్తి లచ్చమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మ్యాకల ఎల్లమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి..తమకు అండగా ఉంటానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి స్వర్గలోక ప్రాప్తిరస్తు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగారెడ్డి, కూస సుమన్, చర్లపల్లి శ్రీధర్, కత్తుల నాగరాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *