మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించిన సిపిఎం బృందం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని సోమవారం సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు గొల్లపల్లి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ రాష్ట్ర బృందం మేడిగడ్డను సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ కి ఉదయం 11 గంటలకు చేరుకొని బ్యారేజి లోని కృంగిన 19,20,21 పిల్లర్ల ను పరిశీలించారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన వేడిగడ్డ కృంగిపోవడంతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని నీళ్లపాలు చేశారని మండిపడ్డారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అని గొప్పలు చెప్పుకునే కాలేశ్వరం ప్రాజెక్టు ఇంత తక్కువ కాలంలోనే కృంగిపోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ప్రాజెక్టు డిజైన్ లోపమా నిర్మాణ లోపమా నిపుణులు కమిటీ తేల్చాలని అన్నారు. మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యులైన ఎల్ ఎన్ టి సంస్థ లేదా గత ప్రభుత్వం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని అన్నారు. గత ప్రభుత్వాల బాధ్యత రహితం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని, ప్రజల డబ్బు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టే ముందు అఖిలపక్షం, నిపుణులతో కమిటీ వేసి నిర్మాణం చేపట్టవలసి ఉండేది. కెసిఆర్ చరిత్ర సృష్టించడం కోసం చేసిన తప్పిదం వల్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యతయుతంగా వ్యవహరించాలని బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో నీటి కరువు మొదలవు తుందని వెంటనే రైతులను తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సాగు నీటి ప్రాజెక్ట్ లో నే అత్యధిక ఖర్చు చేసిన ప్రాజెక్టు కాలేశ్వరం ప్రాజెక్టు అని, మేడిగడ్డ కుంగిపోవడం పై న్యాయ విచారణ చేసి బాధితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును కొనసా గించాలా లేదా తర్వాత ఆలోచించండి కానీ ప్రస్తుతం రైతులతో రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ చర్యలు మరమ్మత్తులు చేపట్టి రైతులకు నీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు,సీపీఎం పార్టీ పట్టణ అధ్యక్షులు వెలిశెట్టి రాజయ్య
ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పోలేం రాజేందర్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పోలం చిన్న రాజేందర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్, ఆకుదారి రమేష్, ఆత్కూరి శ్రీధర్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version