జమ్మికుంట మార్కెట్లో రోజురోజుకు తగ్గుతున్న పత్తి ధరల.
జమ్మికుంట ( నేటి ధాత్రి )
జమ్మికుంటలో పత్తి ధరలు కొన్ని రోజులుగా స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయి. వారం ఆరంభంలో ఆశాజనకంగా కనిపించిన ధరలు, వారాంతానికి వచ్చేసరికి గణనీయంగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం క్వింటాకు రూ.7,600, బుధవారం రూ.7,550, గురువారం రూ.7,500, శుక్రవారం రూ.7,450 పలికింది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.150 వరకు ధర తగ్గడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు.
