జడ్చర్ల నియోజకవర్గం ప్రజలకు అన్ని వేళల్లో అండగా ఉంటా.

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గురువారం రోజు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
ప్రజా తీర్పును గౌరవిస్తూ జడ్చర్ల ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉంటానని,ఎవరు కూడా అధైర్య పడవద్దని జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.స్వగృహంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు,పార్టీ ఎల్లపుడూ మీ అండగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,లేకుంటే ప్రతిపక్ష పాత్రలో సమర్థవంతంగా ప్రభుత్వ తీరును ఎండగడుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జడ్చర్ల నియోజకవర్గం లోని అన్ని గ్రామాల ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు కష్టపడిన ప్రతి కార్యకర్తకు నాయకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి అన్నారు. కానీ గెలుపుకు విరుద్ధంగా ప్రజలు తీర్పునిచ్చారని ప్రజా తీర్పును గౌరవిస్తూ జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల తోడుంటానని హామీ ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version