అత్యవసర సమయంలో రక్తదానం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు

తంగళ్ళపల్లి నేటి దాత్రి

తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామానికి చెందిన జక్కుల రాములకు అత్యవసర సమయంలో రక్తం అవసరం ఉందని వైద్యులు తెలపడంతో వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మీరాలశ్రీనివాస్ యాదవ్ వెంటనే స్పందించి హాస్పిటల్ కి వెళ్లి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర సమయంలో రక్తం అవసరం ఉండగా తెలుసుకొని వెళ్లి వారికి రక్తదానం చేయడం జరిగిందని అలాగే ప్రతి ఒక్కరు రక్తదానం చేసి మీరు చేసిన ఒక రక్తదానం ముగ్గురికి అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు రక్తదానం చేయడంతో వారి కుటుంబ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version