నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను మోసంచేసిన కాంగ్రెస్ పార్టీ..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అంటూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన నుంచి నియామకాల విషయంలో నిరుద్యోగులు మోసానికి గురవుతున్నారని నవాబుపేట మండల బీజేవైఎం ఆధ్వర్యంలో నవాబుపేట తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపించినట్లుగానే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంతంలో నడుస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని ఈ మోసాలను ఎండగడుతూ తెలంగాణ నిరుద్యోగ యువత తరపున బీజేవైఎం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉందన్నారు. ఈ నియంతృత్వా ప్రభుత్వం కనీస స్పందన లేకుండా కాలయాపన చేస్తుందని నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వయసు వస్తుందన్నారు. నిరుద్యోగుల తరఫున నవాబుపేట తహసీల్దారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని నవాబుపేట మండల బిజెపి బిజెవైఎం నాయకులు తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

తెలంగాణ బీజేవైఎం శాఖ నిరుద్యోగుల సమస్యలపై డిమాండ్..

1) గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 క్వాలిఫై చేయాలి.

2) గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లలోఅదనంగా పోస్టులను పెంచాలి.

3) 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ని నిర్వహించాలి. ప్రస్తుత డీఎస్సీ పరీక్షలను పోస్ట్ పాండ్ చేసి నూతన తేదీలను ప్రకటించాలి.

4) అన్ని నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి..

5) పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46 ను రద్దు చేయాలి..

6) జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలి..

ఈ డిమాండ్ల కొరకు బీజేవైఎం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం తాసిల్దార్ కి నిరుద్యోగుల తరఫున జిల్లా కలెక్టర్ కి తెలియజేయాలనిబీజేవైఎం నాయకులు ఎమ్మార్వో ను కోరారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు బుడ్డోల్ల ఆంజనేయులు,
బిజెపి జనరల్ సెక్రెటరీ కొందుర్తి రామకృష్ణ,
డాక్టర్ శివాజీ నవపేట్
సంగం శ్రీశైలం, శ్రీను,
విజయ్ కుమార్,
మైలవరం అధ్యక్షురాలు లక్ష్మి,రామకృష్ణ, వీరేష్,మహేందర్, చంద్రకళ,బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version