అధికారం కోసంమే కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలు.

బిఆర్ఎస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది.

జెడ్పిటిసి గొర్రె సాగర్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట‌్యాల మండలంలోని చింతకుంట‌రామయ్యపల్లి, చిట‌్యాల, ఏలేటిరామయ్యపల్లి, గ్రామాలలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలను కలిసి బిఆర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భీమా లాంటి అద్బుతమైన పథకాలు ఇవ్వడం జరిగిందని వివరించారు, కళ్యాణ లక్ష్మితో ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలబడ్డారని వృద్ధులకు వికలంగులకు ఒంట‌రి మహిళలకు ఆసరా ఫించన్లతో అండగా నిలబడ్డారని గుర్తు చేసారు, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఎన్నికల హామీలు అమలు చేయడంలేదని ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎంపి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఆరెపల్లి మల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి మడికోండ రవీందర్ రావు, పాండ్రాల వీరాస్వామి,టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్, రమణాచారి, దామేర రాజు, పులి రవి, కందుల రమేష్, కట‌్కూరి రాజేందర్, బుట‌్టి ఉపేందర్ , లింగరెడ్డి, పోశాల రాజు,ఏకు ప్రవీణ్, దూడపాక సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version