పిడిఎస్ యూ డిమాండ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
తెలంగాణ విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని
పిడిఎస్ యూ ఇల్లందు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వం 10 యేండ్ల కాలంలో విద్యార్థులకు స్కాలర్షిప్ లు చెల్లించకుండా కాలయాపన చేసి మొండి చేయి చూపించారని ఫలితంగా విద్యార్థులు ఫీజులు చెల్లించలేక నేటికీ తమ సర్టిఫికెట్స్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల వద్దనే ఉన్నాయని తెలిపారు. అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని ఇప్పటివరకు తెలంగాణా విద్యార్థులకు సుమారు 7 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా దృష్టి సారించకపోవడంతో విద్యార్థులు తీవ్ర మనోవిధానం గురి కావాల్సి వస్తుందని అన్నారు.
రాష్ట్రంలో ఫీజులు చెల్లించలేని విద్యార్థులు పై చదువులకు వెళ్లలేకపోయారని, విద్యాసంస్థలు నడిపించలేక కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాసంస్థలను మూసివేశారని, మరికొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు కొత్త గురుకులాలకు అద్దె భవనాలుగా ప్రభుత్వానికి అప్పజెప్పిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ఏది ఏమైనా ప్రభుత్వం స్కాలర్షిప్ ల పై ఒక స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి, ప్రవేటు విద్యాసంస్థల యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని తక్షణమే స్కాలర్షిప్స్ మరియు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ గుండాల మండల నాయకులు వినయ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.