రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 16 ,నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు.మురళీకృష్ణ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు నెరవేర్చి బదిలీలో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.