సుజాత విద్యానికేతన్ పాఠశాలలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం

హసన్ పర్తి / నేటి ధాత్రి

66 వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాల యందు జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతరాం కర్ణ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న లడ్డాక్ లోని సిఆర్పిఎఫ్ జవాన్లపై చైనా ఆర్మీ జరిపిన దాడిలో 17 మంది జవాన్లు వీర మరణం పొందారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న వారి స్మృతికి నివాళులర్పిస్తూ జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. దేశ భద్రతలో సరిహద్దు జవాన్ల యొక్క విధి నిర్వహణ అత్యంత కష్ట సాధ్యమైనది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ మంచు కొండలలో దేశ సరిహద్దులను కాపలా కాస్తు మనం సురక్షితంగా ఎటువంటి భయాందోళన లు లేకుండా జీవించడానికి తోడ్పడుతున్నారని కాబట్టి మనం కూడా దేశbభక్తిని పెంపొందించుకొని వారి త్యాగాలను సదా గుర్తుంచుకోవాలని విద్యార్థులకు బోధించారు. దేశంలోపల ఉగ్రవాద నిర్మూలనకు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించే రోజు ఈ రోజు. విద్యార్థులుగా మీరు కూడా ఇప్పటినుండే దేశభక్తిని పెంపొందించుకొని భవిష్యత్తులో దేశానికి సేవ చేసే వీర జవాన్లుగా ఎదగాలని మన పాఠశాల నుండి అనేకమంది సీఐ ఎస్ఐ కానిస్టేబుల్ గా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అమర జవాన్లకు నివాళులర్పిస్తూ సెల్యూట్ చేసి రెండు నిమిషములు మౌనం పాటించడం జరిగింది. పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గూడూరు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు జూపాక నాగరాజు ఏ వెంకట్ వై అరుణ సంధ్య, సుచిత్ర, ప్రవళిక, సబిహా, సుధారాణి, భవాని, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version