స్వచ్ఛత స్వచ్ఛ సర్వేక్షన్ నిర్వహణ
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛత స్వచ్ఛ సర్వేక్షన్ నిర్వహించారు. గ్రామీణ 2025లో భాగంగా స్వచ్ఛతపై గ్రామాల్లో ర్యాంకింగ్ ఇవ్వడా నికి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించి స్వచ్ఛత స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా హుస్సేన్ పల్లి, ఆరేపల్లి, నర్సింహులపల్లి వెరిఫికేషన్ గా పర్యటించి గ్రామాల్లో ఉన్నటువంటి తడి పొడి చేత్త నిర్వహణ ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్ గ్రామపంచాయ తీలో పనితీరు, మరుగుదొడ్ల నిర్వహణ సోక్పిట్ మరియు సామాజిక తనిఖీలు నిర్వహిం చి గ్రామాల్లో మెరుగైన పరిశుభ్ర త ఎలా ఉంది అనేదానిపై తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ ఫణి చంద్ర ,ఏంపిఓ రంజిత్, ఏపీఓ అనిత గ్రామ పంచాయతీ కార్యదర్శిలు స్వచ్ఛభారత్ కన్సల్టెంట్ సంపత్ కుమార్ ఎస్ ఎస్ జి టీం సభ్యులు రాజు, రాణి, రేవంత్ మరియు కారోబార్లు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.