చేనేత ఎన్నికలు వెంటనే నిర్వహించాలి

వీలైనంత త్వరగా చేనేత సహకార ఎన్నికలు నిర్వ హించాలి

చేనేత కార్మికుల సంక్షేమం మెరుగుపడుతుంది

అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్య దర్శి బాసాని బాలకృష్ణ

శాయంపేట నేటిధాత్రి:

 

ఎన్నికలతో చేనేత సహకార సంఘాలకు పూర్వ వైభవం వస్తుందోనని నేతన్నలో ఏండ్లు ఎదురుచూస్తున్న వారి కోరిక అందని ద్రాక్షలా మారుతుంది ఇప్పుడు అప్పుడు అంటూ 8 ఏళ్లుగా ఎన్నికలు ఊరిస్తూనే ఉన్నారు తాజాగా ప్రభుత్వం చేనేత జౌళి శాఖ సహకార సంఘాల గడువును పొడిగి స్తూనే కాలయాపన చేస్తుంటే దీంతో అసలు ఎన్నికలు జరు గుతాయో అనే అనుమానాలు కార్మికుల్లో వ్యక్తమౌతుంది. నాటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వాయిదా వేస్తూ వస్తుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి గతంలో ఉన్న పాలకవర్గాలకే అధికారం అప్పగిస్తుంది ఇలా ఇప్పటివరకు 18 దఫాలుగా జరుగుతుంది. ఎన్నికలు జరగకపోవడం ప్రత్యేకంగా సంఘాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో వాటి పరిస్థితి దుర్భరంగా మారి మనుగడకు ప్రశ్నార్ధకం అవుతోందని చేనేత కార్మికులు పేర్కొంటున్నారు.

చేనేత సంఘాలకు ఎన్నికల నిర్వహించాలి

స్థానిక సంస్థల ఎన్నికలతో పా టు చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి బాసాని బాలకృష్ణ అన్నారు.మాట్లాడుతూ 8 సంవత్సరాల నుండి చేనేత సంఘానికి పర్సన్ ఇన్చార్జిగా పాలక వర్గాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు పెట్టకుండా నిర్లక్ష్యా నికి గుర్తు చేస్తున్నారని తెలిపా రు. ఇప్పటికీ ఎన్నికలు జరగక చాలా కాలం అవుతుంది ఎన్నికల నిర్వహించడం వల్ల చేనేత కార్మికుల సంక్షేమం మెరుగు పడుతుంది అయిన ప్పటికీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని దానిపై స్పష్టత లేదు.చేనేత సంఘాలకు ప్రభు త్వం నుండి వచ్చిన నిధులపై విచారణ చేయాలని అధికారు లకు విన్నవించుకుంటే సంఘం పాలకవర్గం రాజీనామాను ఆమోదించి స్పెషల్ ఆఫీసర్ ను నియమించడం అన్నారు. ఇప్పటికైనా చేనేత సొసైటీ నిధులకు సంబంధించి విచా రణ చేసి స్థానిక సంస్థల ఎన్నిక లతో పాటు చేనేత సంఘానికి కూడా ఎన్నికలు నిర్వహిం చాలని కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version