రక్త అవయవ దానాలు చాలా ముఖ్యం.

రక్త అవయవ దానాలు చాలా ముఖ్యం..

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320డి గవర్నర్ నగేష్..

రామాయంపేట మార్చి 10 నేటి ధాత్రి (మెదక్)

రక్తదానము, అవయవదానం అనే రెండు దానములు నేటి పరిస్థితుల్లో సమాజంలో అవసరము ఉన్నవారికి సరియైన సమయంలో దొరకనట్లయితే అపాయకరమని లయన్స్ క్లబ్స్ ఇంటర్ నేషనల్ జిల్లా 320 డి గవర్నర్ నగేష్ పంపాటి అన్నారు..
ఆదివారం (09.03.2025 న)

Blood

రాగి కన్వెన్షన్,హైదరాబాద్ లో సాయంత్రం జరిగిన లయన్స్ జిల్లా 320-డి
19 వ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్** లో రామాయంపేట లయన్సక్లబ్ చార్టర్ సభ్యులు లయన్ డా. ఏలేటి రాజశేఖర్ రెడ్డి రూపొందించిన తన 18 వ రక్త, అవయవ దాన ప్రచార గోడపత్రిక ను విడుదల చేస్తు అన్నారు.గత కొంతకాలంగా రక్త అవయవ దాన ప్రచారానికై తీవ్ర కృషి చేస్తున్నట్లు, దానివల్ల లయన్స్ జిల్లా 320-డి లో విస్తృతంగా రక్తదాన శిబిరం లను నిర్వహించినట్లు తెలిపారు. అలాగే అవయవదానం కూడా చాలా ప్రాముఖ్యతను పొందిందని, ఎంత ప్రచారం నిర్వయించిన కూడ దాతలు ముందుకు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. లయన్స్ తమ తమ క్లబ్ ల ద్వారా రక్త,అవయవ దానాలకు విస్తృత ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు, ఏరియా గాట్ లీడర్ ఆర్.సునీల్ కుమార్ తో పాటు ఇతర లయన్స్ నాయకులు లయన్ ఏ. అమర్నాథ్ రావు గవర్నర్ ఎలెక్ట్ , లయన్ ఎం. విజయలక్ష్మి ఫస్ట్ వైస్ గవర్నర్ ఎలెక్ట్ ,లయన్ డిచిపల్లి నరసింహ రాజు సెకండ్ వైస్ గవర్నర్ ఎలెక్ట్ , లయన్ కె. సూర్యనారాయణ జి.ఎల్.టి ఎక్స్టెన్షన్ లీడర్ మరియు ఇతర లయన్స్ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version