శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా…
కసిరెడ్డి సింధూరెడ్డి నియామకం.
చందానగర్ కాంటెస్టెడ్ కార్పోరేటర్, యువమోర్చా రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కసిరెడ్డి సింధూరెడ్డిని బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమించడం జరిగింది. బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ బిజెవైం పూర్తిస్థాయి కమిటీని ప్రకటిస్తూ ఈ నియామకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కసిరెడ్డి సింధూరెడ్డి మాటాడుతూ… తనను రాష్ట్ర బిజెవైం ఉపాధ్యక్షురాలిగా నియమించి, పార్టీకి పనిచేసే అవకాశం కల్పించిన తెలంగాణా రాష్ట్ర రథసారథి గంగాపురం కిషన్ రెడ్డి గారికి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సేవెళ్ల మహేందర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
సింధూరెడ్డి రాజకీయ ప్రస్థానం…
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చందానగర్ డివిజన్ బిజెపి అభ్యర్థిగా గట్టి పోటీ ఇచ్చిన కసిరెడ్డి సింధూరెడ్డి తదనంతరం పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుండడమే కాక, గత శాసనసభ ఎన్నికల్లో చురుకుగా పని చేయడం, సోషల్ మీడియా ద్వారా పార్టీ ప్రచారాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లారు. జాతీయపార్టీ పిలుపుమేరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.