భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం1948 సెప్టెంబర్ 17 నా వచ్చిందని ఏడు నూతుల నిశిధర్ రెడ్డి అన్నారు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులుఏడునూతుల నీశిధర్ రెడ్డి జాతీయ జెండాను ఎత్తిన అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం మొత్తం స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వస్తే మనకు తెలంగాణ కు మాత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు నిజాం రజాకార్ల ఆధీనంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా స్వాతంత్ర్యం రావడం జరిగిందని నిజాం రజాకార్లు తెలంగాణలో ఉన్నటువంటి మన ఆడ బిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడివ్వడం జరిగిందని ఎంతోమంది ప్రజలను పన్నుల పేరుతో హింసించేవారని కనబడ్డ అటువంటి మహిళలను అత్యాచారాలు చేసే వాళ్లని ఎదురు తిరిగిన వారిని కిరాతకంగా చంపేవారని అన్నారు అదేవిధంగా బిజెపి రాష్ట్ర నాయకులు వెన్నంపల్లి పాపయ్య గారు మాట్లాడుతూ రజాకారుల పాలన ఇప్పటికీ కూడా కొనసాగుతున్నదని గత ప్రభుత్వం కూడా రజాకారులకు అనుకూలమైన పరిపాలన కొనసాగించడం జరిగిందని ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించకపోవడం కూడా రజాకారులను సమర్థిస్తూ ఈరోజు రాజకీయ లబ్ధి కోసం పరిపాలన కొనసాగిస్తున్నారని ఇదంతా తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నదని ఇలాంటి పార్టీలను భూస్థాపితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన అన్నారు
కార్యక్రమంలో లింగంపల్లి ప్రసాద్ రావు భట్టు రవి దొంగల రాజేందర్ మంధల రఘునాథరెడ్డి తిరుపతిరావు కిసాన్ మోర్చా మరియు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిప్ మరియు ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాచన వేణి రవీందర్ మరియు బిజెపి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి, కంచం నరసింహమూర్తి పెండ్యాల రాజు చెక్క శంకర్ మాదం మధు మల్లేష్ రాజేష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు…..