నాయకేర్ దన్, నిర్వహించిన బంజారా నాయకులు

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

నాడు 05 డిసెంబర్1963 వసంతారావు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా నవాబుపేట మండల కేంద్రంలోని బంజారా భవన్ లో గురువారం మండల బంజారా నాయకులు నాయకేర్ దన్ ను ఘనంగా నిర్వహించారు.
వసంతరావు నాయక్ నాయకత్వం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్భవించింది. మహారాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ మరియు విద్యా నిర్మాణం లో గణనీయమైన కృషి చేశారు. మహారాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేస్తూనే సామాన్యులపై దృష్టి సారిస్తూ తన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు. భారతీయ సమాజానికి రైతులు వెన్నెముక. ‘రైతు బతికితేనే దేశం బతుకుతుంది’ అనే నమ్మకాన్ని వసంతరావు నాయక్ నిలకడగా కొనసాగించడం రాజకీయ రంగంలో సాధారణ పౌరుడిని ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగంగా మార్చడానికి ప్రజాస్వామ్య వికేంద్రీకరణపై ఆయన ఉద్ఘాటించారు. ఆయన కృషి వల్ల మహారాష్ట్రలో పంచాయత్ రాజ్ వ్యవస్థ నిర్మాణం చాలా సులువైంది.నవాబుపేట బంజారా నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో గోర్ శిక్వాడి- గోర్ సేన కోఆర్డినేటర్&ఎల్ ఎచ్ పి ఎస్ అధ్యక్షులు సంతోష్ నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తులసి రామ్ నాయక్, సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ చైర్మన్ నీల్య నాయక్, ఎస్టీ సెల్ చైర్మన్ జాను నాయక్, ఎల్ ఎచ్ పి ఎస్ జిల్లా ఆధ్యక్షులు శంకర్ నాయక్,కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ నాయక్,ఎల్ ఎచ్ పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వర్త్యా తులసి రామ్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేతవత్ శంకర్ నాయక్, కొల్లూరు విస్లావత్ సేవ్య నాయక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ నాయక్,మాజీ ఎంపీటీసీ అంబదాస్,మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్,మాజీ ఉపసర్పంచ్ భాగన్ నాయక్,ఎల్ ఎచ్ పి ఎస్ ప్రధాన కార్యదర్శి విశ్లవత్ మాంగ్య నాయక్,ఠాగూర్ నాయక్,పాండు నాయక్,మల్లేష్ నాయక్, సెవ్య నాయక్,రమేష్ నాయక్, అంగూర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version