శంకరయ్య…’మనీ’కింకరుడయ్యా!? శంకరయ్య ఒత్తిళ్లు..! టిపిఎస్‌ లకు తిట్లు?

 

`ఎక్కడిక్కడ జనం చీవాట్లు!?

`పాపం అడకత్తెరలో నలుగుతున్న టిపిఎస్‌ లు.

`లంచాలు తింటున్నారని శాపనార్థాలు?

` క్షేత్ర స్థాయిలో జనం గగ్గోలు…

`జోనల్‌ కమీషనర్‌ ఆదేశాల అమలులో చుక్కలు చూస్తున్న ఉద్యోగులు.

`సికింద్రాబాద్‌ లో ఇలా చేసే శేరిలింగంపల్లి కొచ్చారు?

` శేరి లింగంపల్లి లో మరింత సంపాదనకు శంకరయ్య ఎగబడ్డాడు?

` అధికారులను రాచి రంపానపెడుతున్నాడు?

`మింగలేక కక్కలేక అధికారులు మధనపడుతున్నారు?

`జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వల్ల ఎమ్మెల్యే గాంధీ అబాసుపాలౌతున్నారు?

`ఏరి కోరి తెచ్చుకున్న ఎమ్మెల్యేకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు?

`జోనల్‌ కమీషనర్‌ పనుల వల్ల ఎమ్మెల్యే కు ఎదురుకానున్న తిప్పలు?

`ఎన్నికలలో ఎమ్మెల్యే కు ఇబ్బందులు తప్పవు?

ఉద్యోగం వచ్చేదాకా జీవితం… సమాజం…జనం…సేవ… ఇలాంటి ఎన్నో ఆలోచనలు చేస్తారు. కొంత మంది అదే జీవితాంతం అనుసరిస్తారు. కొందరు అవన్నీ మర్చిపోతారు…సంపాదనకు ఎగబడతారు. ఉద్యోగం చేస్తూ ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటూ, పనులు చేయడానికి నా కేంటి? అనడం మొదలు పెడతారు…మొహమాటం లేకుండా ఎంతిస్తావ్‌ అని బేరం పెడుతుంటారు…ఇటీవల కాలంలో ఆ బేరం కూడా మారిపోయింది. ఇంతిస్తే గాని పని కాదని చెప్పేస్తున్నారు…పని కావాల్సిన ప్రజలు అంతివ్వలేను మహా ప్రభో అని బ్రతిమిలాడుకుండున్నారు. అయినా కొందరు అధికారులు కనికరం అన్నది వారి దరిదాపుల్లో లేనట్లు, వారి డిక్షనరీ లో లేనట్లు, నా మాటే శాసనమన్నట్లు వసూలు చేస్తున్నారు. జేబులు నింపుకుంటున్నారు…కోట్లు కూడబెట్డుకుంటున్నారు. అలాంటి వారిలో జిహెచ్‌ఎంసి శేరిలింగంపల్లి జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య ఒకరు? అని జనం చెప్పుకుంటున్న మాట…ఉద్యోగుల ఆవేదన. 

ఎక్కడిక్కడ జనం చీవాట్లు!?

 జోనల్‌ కమీషనర్‌ పెట్టే టార్గెట్ల మూలంగా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు టార్గెట్లు పెడుతూ, జనాన్ని ఇబ్బందులు పెట్టినట్లే ఉద్యోగులను కూడా జోనల్‌ కమీషనర్‌ రోజుకింత వారానికింత అని ఆర్డర్‌ వేస్తాడు. దాంతో టౌన్‌ ప్లానింగ్‌ విభాగ సిబ్బంది యాతన అంతా ఇంతా కాదు…జోనల్‌ కమీషనర్‌ మాట కాదనలేక, ఎదురు చెప్పలేక, మా వల్ల కాదనలేక, ఉద్యోగం చేయడం తప్పని సరై వారు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రజలతో పంచాయతీ పెట్టుకునేది అధికారులు, తిట్లు తినేది అధికారులు. పాపం అడకత్తెరలో నలుగుతున్న టిపిఎస్‌ లు. 

తాజాగా శేరి లింగంపల్లిలో నిర్మాణంలో వున్న ఓ బిల్డింగ్‌ కూల్చివేసేందుకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వచ్చారు.  

దాంతో స్థానిక ప్రజలు, ఆ నిర్మాణానికి చెందిన వ్యక్తులు టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిని తిట్టిన తిట్టు తిట్డకుండా తిట్టారు. ఇప్పటికే ఇవ్వాల్సిన లంచాలు ఇచ్చాము…ఇంకా ఎన్ని సార్లు లంచాలు లంచాలివ్వాలని దూషించారు. శాపనార్థాలు పెట్టారు. నిజానికి ఆ బిల్డింగ్‌ నిర్మాణం అక్రమమే అయితే నిర్మాణం మొదలైనప్పుడే అధికారులు అడ్డుకోవాలి. నిర్మాణానికి అవసరమైన హద్దులు ఇవ్వాలి. అంతే కాని నిర్మాణానికి ముందు అన్ని రకాల అనుమతులు ఇచ్చి, తీసుకోవాల్సినంత తీసుకొని, మరింత లాగేందు నిర్మాణం జరగకుండా అడ్డుకోవడం సరైంది కాదు. కానీ ఇలా సగం నిర్మాణం జరిగిన తర్వాత అడ్డుకుంటేనే అధికారులు అడిగినంత ముట్డజెబుతారు. ఇదీ జిహెచ్‌ఎంసి అధికారులు అనుసరించే విధానం. అలాగే శేరిలింగంపల్లిలోనూ జరుగుతోంది. గతంలో ఇక్కడ అలాంటి వాతావరణం లేదని ప్రజలు, అధికారులు కూడా అంటున్నారు. జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వచ్చిన తర్వాతే ఇలాంటి పనులెక్కువయ్యాయని వాపోతున్నారు. క్షేత్ర స్థాయిలో జనం గగ్గోలు…జోనల్‌ కమీషనర్‌ ఆదేశాల అమలులో టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది చుక్కలు చూస్తున్నారు. 

సికింద్రాబాద్‌ లో ఇలా చేసే శేరిలింగంపల్లి కొచ్చారు?

 గతంలో ఇదే శంకరయ్య సికింద్రాబాద్‌ జోనల్‌ కమీషనర్‌ గా పనిచేసిన సమయంలో అక్కడ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు దీపావళి పండగ సందర్భంగా తలా ఓ పది లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారట…అధికారులు తమ వల్ల కాదని తెలిసినా, ఆయనకు ఎదురు చెప్పలేక తలాడిరచారట…కానీ ఓ మహిళా టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఎదురుతిరిగిందట…ఏకంగా మంత్రి కేటిఆర్‌ దృష్టికి ఈ సమస్య వెల్లేలా చేసిందట. దాంతో శంకరయ్య తిక్క కుదిరిందనే అందరూ అనుకున్నారు. సికింద్రాబాద్‌ నుంచి తప్పించి, శేరి లింగంపల్లి జోన్‌ కు మార్చడంతో ఇక శంకరయ్య అవినీతికి పుల్‌ స్టాప్‌ పడుతుందనుకున్నారట…అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఏరికోరి శంకరయ్య కు శేరి లింగంపల్లి లో పోస్టింగ్‌ వేయించారట…శంకరయ్య తీరు ఏ మాత్రం మారలేదు. నిజానికి సికింద్రాబాద్‌ లో ఆమ్థానీ తక్కువ. ఇక్కడ నగరం విస్తరిస్తున్నందున రోజువారీ సంపాదన శంకరయ్య కు పెరిగిందనేది అధికారులు చెప్పుకునే మాట. 

శేరి లింగంపల్లి లో మరింత సంపాదనకు శంకరయ్య ఎగబడ్డాడు? 

అధికారులను రాచి రంపానపెడుతున్నాడు? అనేది ఇక్కడ ప్రధాన వాదన. మింగలేక కక్కలేక అధికారులు మధనపడుతున్నారు? ఇక ఇదిలా వుంటే జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వల్ల ఎమ్మెల్యే గాంధీ అబాసుపాలౌతున్నారు? ఏరి కోరి తెచ్చుకున్న ఎమ్మెల్యేకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు?

 జోనల్‌ కమీషనర్‌ పనుల వల్ల ఎమ్మెల్యే కు ఎదురుకానున్న తిప్పలు? ఎన్నికలలో ఎమ్మెల్యే కు ఇబ్బందులు తప్పవు? జనం చెబుతున్నారు.

దళిత బంధు లో దగా.. దగా!

`దళితుల సొమ్ముకు ఎర!

`పథకం అమలుకు అధికారుల పొగ?

` అటు అధికారులు…ఇటు ట్రేడర్లు!

`కారుకు షోరూం కొటేషన్‌ లక్షన్నర అదనం…

`ట్రాక్టర్ల్‌ కు కూడా అంతే లక్షన్నర…

`మధ్య వర్తులంతా షోరూమ్‌ యజమానులే…

`వాటాల పంపకాలు వారి చేతుల మీదుగానే!

`ఇటు ఇస్తున్నారు…అటు అమ్ముకునే దారి చూపిస్తున్నారు.

`కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు?

`దళిత బంధును పక్కదారి పట్టిస్తున్నారు?

`పథకాన్ని నీరుగారుస్తున్నారు?

`సెంట్రింగ్‌ యూనిట్‌ లో రెండు లక్షలు కమీషన్‌…

` ప్రతి ఫైలుపై సంతకానికి ఎస్సీ కార్పొరేషన్‌ అధికారికి రూ. 30 వేలు.

`ప్రతి వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ కు ఆర్టీవోకు రూ. 13 వేలు.

` రాత్రికి రాత్రే లీడర్ల ట్రేడిరగ్‌ లైసెన్స్‌…

`దళిత బంధు అమలుపై ఇంటలిజెన్స్‌ ఆరా…

` రెండో విడతలో అధికారులు ఏది చెబితే అదే తీసుకోవాలి?

`మొదటి విడతలో తీసుకోని వారు వాహనాలే తీసుకోవాలి?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సమాజం ఎటుపోతోంది? దళితుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యతను ఎందుకు విస్మరిస్తోంది? ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రారంభించినా, ఆచరించి, అమలు చేయాల్సిన ఉద్యోగ వ్యవస్ధలో కొందరి వల్ల లక్ష్యం ఎందుకు నిర్వీర్యమౌతోంది? అన్న ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి? అసలు దళిత బంధు సొమ్ముకు అధికారులు ఆశపడడం ఏమిటి? దళారులు కాజేయాలని చూడడమేమిటి? ఎవరికి వారు తమ సొమ్మే అన్నట్లు వాటాలు వేసుకోవడమేమిటి? సంతకాలు పెట్టాలంటే ఇంత ఇవ్వాలని అధికారులు షరతులు పెట్టడమేమిటి? లంచం ఇస్తే తప్ప సంతకం పెట్టమన్నంత ధోరణి ప్రదర్శించడమేమిటి? మొత్తంగా దళిత బంధు లాంటి గొప్ప పథకం అమలో ఇంత దోపిడేంది? పైలెట్‌ ప్రాజెక్టన్న భయం కూడా అధికారుల్లో లేకపోవడం ఏమిటి?  

 సహజంగా ప్రైవేటు వ్యక్తులు షోరూంలలో కారు, ట్రాకర్‌, ఏ వాహనం కొన్నా, ప్రభుత్వ వర్గాలు కార్లు కొన్నా ఒకటే రేటు వుండాలి. 

అందుకు అవసరమైన కొటేషనే వేసి ఇవ్వాలి. ఒక వేళ తేడా ఏమైనా వుంటే అది వెయ్యో…రెండు వేలో తేడా వుంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అంతే కాదు పెద్దఎత్తున కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్న సమయంలో మరింత తగ్గించి ఇవ్వాలి. ఇంతకు తగ్గించి ఇస్తేనే మేం కార్లు, ట్రాక్టర్లు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులే షరతులు విధించాలి. అది కాకుండా షోరూం లెందుకు రేట్లు పెంచి కొటేషన్లు ఇస్తున్నాయన్న అనుమానం అందరికీ వస్తుంది? కాని అసలు తిరకాసు ఇక్కడే వుంది? ఇది అధికారులు ఆడుతున్న డ్రామా అన్నది అందరికీ తెలిసిందే…కాని అడిగిన వారు లేదు? ప్రశ్నించిన వారు లేదు? అధికార వ్యవస్ధలో కింది నుంచి పై స్ధాయి దాకా అందరికీ తెలిసి జరగుతుందే? అయినా ఇంత దోపిడా? ఒక వాహనం మీద సుమారు రూ.లక్షన్నర ఎక్కువ చెల్లించడం అంటే లబ్ధిదారుడిని దోపిడీ చేయడం. ప్రభుత్వాన్ని మోసం చేయడం కాదా? ఇది చట్టరిత్యా నేరం కాదా? అయినా ఇంతగా అధికారులు ఎలా భరితెగిస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమంటే కూడా భయం లేకుండాపోయిందా? ప్రభుత్వం ఉద్యోగాలు తీసేస్తుందన్న ఆలోచన కూడ లేదా? జైలుకెళ్లాల్సి వస్తుందన్న భయం కూడా లేదా? ఉద్యోగాలు పోయినా ఫరవాలేదన్న ధైర్యమా? ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన అధికారులే ప్రభుత్వ ధనం దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారు. ఇందులో తమపాత్ర కనిపించంకుండా షోరూం యజమానులు, అక్కడ పనిచేసే ఉద్యోగులను మధ్యవర్తులుగా మార్చి సొమ్మును పంచుకుంటున్నారు. డైరెక్టుగా అంత పెద్ద అమౌంటు తీసుకుంటున్నట్లు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా కోట్లాది రూపాయలను నొక్కేస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సమారు 4వేల కార్లు, 4వేల ట్రాక్టర్లకు లబ్దిదారులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో మెజార్టీ లబ్ధిదారులకు వాహనాలు అందించారు. ఆ వాహనాల మీద అదనంగా వేసిన కొటేషన్‌ సొమ్మును అధికారుల పంచుకున్నారు. ఇంత భహిరంగంగా దోపిడీ సాగిస్తున్నారు. ఇదిలా వుంటే ఇక రెండు జిల్లాలకు చెందిన ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు ప్రతి అప్లికేషన్‌ అప్రూవల్‌కు లబ్దిదారుల నుంచి రూ.30వేలు వసూలు చేసినట్లు సమాచారం. లబ్ధిదారుల్లో ఉన్నత విద్యావంతులున్నారు. అమాయకులైన లబ్ధిదారులనుంచే కాదు…ఉన్నత విద్యావంతులైన వారి నుంచి కూడా ముక్కుపిండి వసూలు చేసినట్లు రూ.30వేలు వసూలు చేశారని తెలుస్తోంది. అంటే తమ సంతకానికి వున్న పవర్‌ అని చెప్పకనే చెబుతున్నట్లు లెక్క. 

ఇక ఆ వాహనాల రిజిస్రేషన్‌ అన్నది ఆర్టీవో ఉచితంగానే చేయాలి.

 కాని ఆయనేం తక్కువ తిన్నారా? ఆయన కూడా ప్రతి వాహనానికి రూ.13వేలు వసూలు చేశారని లబ్ధిదారులు చెతున్నారు. పైగా ఎవరైనా లబ్ధిదారులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే, పుణ్యానికి వస్తేనే ఇలా మాట్లాడుతున్నావ్‌…కష్టపడితే ఏం మాట్లాడతావో? అంటూ బెదిరించి మరీ డబ్బులు వసూలు చేసినట్లు చెబుతున్నారు. సరే అన్ని అవాంతరాలు దాటుకొని వాహనాలు తెచ్చుకున్నా ప్రతి వాడి కన్నూ ఆ వాహానాల మీదే…ఎలాగైనా వారి దగ్గరనుంచి ఆ వాహనాలు లేకుండా చేశారు..పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌ లోని వివిధ జిల్లాల నుంచి వచ్చి ట్రాక్టర్లు, కార్లు కొనుగోలు చేశారు. లబ్ధిదారులకు రెండు, మూడు లక్షలు చెతిలో పెట్టి వాహానాలు లేకుండా చేశారు. లబ్ధిదారుల బలహీనతలను ఆసరా చేసుకొని లీడర్లు, అధికారులు చేసిన పని వల్ల దళిత బంధురాకముందు దళితుల పరిస్దితి ఎలావుందో…ఇప్పుడూ అదే పరిస్దితి వుంది. అసలు దళిత బంధు వాహనాలు అమ్మొద్దు…ఎవరూ ఇతరులు వారి వద్ద నుంచి కొనుగోల చేయెద్దు. మరి ఎలా ఈ తతంగం అంతా జరుగుతోంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టిపెట్టాలి. లబ్దిదారులకు నగదు ఆశ చూపించి, సొమ్ము చేసుకున్న వారి వద్దనుంచి వాహనాలు వసూలు చేసి తిరిగి, లబ్ధిదారులకు అందించాలి. అప్పుడుగాని ఇలా ప్రభుత్వ పథకాల దుర్వినియోగానికి ఎవరూ పాల్పడరు…

   ఇక సెంట్రింగ్‌ యూనిట్‌ విషయంలో మరీ ఘోరం…

సెంట్రింగ్‌ పేరు మీద రూ.8లక్షలు డ్రా చేయించి తీసుకుంటున్న ట్రేడర్లు, లబ్ధిదారులకు రూ.6లక్షలు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి లబ్ధిదారుని వద్ద నుంచి రూ.2లక్షలు కాజేస్తున్నారు. అధికారులకు వాటాలు పంచేస్తున్నారు. ఇదేనా ట్రేడర్ల ముసుగులో నాయకులు అడుతున్న నాటకం. అటు నాయకులు మోసం చేసి, ఇటు అధికారుల మోసం చేసి, దళితులకు న్యాయంగా అందాల్సిన సొమ్మును మాయంచేయడం ఎంత దుర్మార్గం. లబ్ధిదారులకు సెంట్రింగ్‌ యూనిట్‌ రూ.8లక్షల విలువ చూపించాల్సిందిపోయి, రూ.6లక్షలు చేతిలో పెట్టడమేమిటి? రూ.2 లక్షలు తీసుకోవడమేమిటి? ఇంత దర్జాగా దళిత బంధు సొమ్ము నొక్కేయడమేమిటి? మొదటి విడతలో దండుకోవాల్సినంత దండుకొని కోట్లు కొల్లగొట్టిన అధికారులు, రెండో విడతలో ఎలా నొక్కాలి? ఎంత నొక్కాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. పైగా మొదటి విడతలో ఎలాంటి లబ్ధి పొందని వారి నుంచి ఎలా వసూలు చేయాలన్నదానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఓ మండలంలో లబ్ధిదారురాలైన ఓ మహిళ తనకు కెమెరా కావాలని, తాను ఫోటోగ్రఫీ వృత్తిని నిర్వహించుకుంటానని అధికారుల దృష్టికి తీసుకెళ్తే, కారు తీసుకో..అని ఉచిత సలహా ఇచ్చారట. అంతే కాదు కారు తీసుకుంటామంటేనే సంతకం చేస్తామని కూడా చెప్పారట. అంటే ఫోటో కెమెరా విషయంలో ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. అదే కారు తీసుకుంటే షోరూం నుంచి నేరుగా వాటా అందే అవకాశం వుంది. ఇప్పటికే దళిత బంధులో దోచుకోవాల్సినంత దోచుకున్నారు…ఇంకా అడుగు బొడుగు వున్నవాటిని కూడా వదలమని తెగించి చెప్పేస్తున్నంత పని చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారించాల్సివుంది.

దళిత బంధు ట్రాక్టర్లు ఆంధ్రాలో..! హర్యానా నుంచి తెచ్చిన బర్రెలు స్వర్గంలో!!

`ఇదీ దళిత బంధు అమలు అధికారుల నిర్వాకం.

`ఏసి. గదుల్లో కూర్చొని అధికారులు చేసిన అమలు తీరుకు నిదర్శనం.

`దళిత బంధు వాహనాలు అమ్మినా, కొన్నా నేరమే!

`అయినా ఎలా కొన్నారు? అమ్మకాన్ని అధికారులు ఎలా ప్రోత్సహించారు?

`దళిత బంధు ట్రాక్టర్లలో 60 శాతం ఆంద్రాకు చెందిన వ్యక్తులు ఎలా కొనుగోలు చేశారు?

`ట్రాక్టర్లు తరలుతుంటే అధికారులు ఏం చేశారు?

` రెండు జిల్లాల కలెక్టర్లు ఏం పర్యవేక్షిస్తున్నారు?

`ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు నిర్వాకం ఎందుకు కనపడలేదు?

`అగ్రికల్చర్‌ ఏడి. ట్రాక్టరు షోరూం యజమానిని కమీషన్‌ కోసం బెదిరింపులేమిటి?

`ఇన్ని ట్రాక్టర్ల అమ్మకానికి అవకాశం కల్పిస్తే కమీషన్‌ ఇవ్వవా? గద్దించడమేమిటి?

`వాహనాల మీద సిఎం. స్టిక్కర్‌, దళిత బంధు అని ఎందుకు రాయలేదు?

`లబ్ధి దారులు బర్రెలు మేమే కొనుక్కుంటామంటే ఎందుకు అధికారులు సహకరించలేదు?

`కరీంనగర్‌ డైరీ వాళ్లు ఎందుకు ఒప్పుకోలేదు?

`గతంలో ఉత్తర భారత్‌ నుంచి గొర్రెల కొనుగోలు అనుభవాలున్నాయి.

`అయినా బర్రెల విషయంలో అదే ఎందుకు అనుసరించారు?

`గేదెల మరణానికి కారకులెవరు?

`వాతావరణ మార్పులు పడక బర్రెలు చనిపోయాయి.

` ఇప్పటికైనా మేం చెప్పినట్లు వినండి…అని దళిత రైతులు కోరుతున్నారు.

`బర్రెలు ఇవ్వడం కుదరదు…మరో ఇతర యూనిట్లు పెట్డుకోమని కొత్తగా అధికారుల ఒత్తిళ్లు?

`ఇప్పుడు గైడ్‌ లైన్స్‌ అడ్డం రావడం లేదా?

`పాలు పితకడం, వ్యవసాయ సాగు తప్ప మాకేం పనిరాదన్నా అధికారులు వినడం లేదు?

`లబ్ధి దారుల మాటకు విలువలేదు?

`దళిత బంధు ఆగమౌతున్నా అధికారులకు పట్టింపు లేదు?

`లబ్ధి దారులు చెప్పినట్లు చేస్తే అధికారులకు కమీషన్లు రావు?

`ఏజెన్సీలకు డైరెక్ట్‌ గానే ఫోన్లు చేసి అధికారులు కమీషన్లు వసూలు చేసుకున్నారు?

`కాల్‌ రికార్డులౌతాయన్న భయం కూడా లేదు?

`దళిత బంధు తో కోట్లు దండుకున్నారు?

`లబ్ధి దారులను ఆగం చేశారు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సహజంగా పాలకులు మోచేతికి బెల్లం పెట్టి నాకిస్తారని గతంలో చెప్పుకోవడం విన్నాం. ఎదో ఒక సంక్షేమ పధకం ప్రవేశపెట్టి గొప్పలు చెప్పుకోవడం చూశాం…ప్రజల జీవితాలు వెలిగిపోతున్నాయని చెప్పుకున్న సందర్భాలు అనేకం. కాని తెలంగాణ సాధించి, ప్రజల ఆదరణతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రకటించి, అమలు చేస్తున్న పధకాలు అన్నీ ఇన్నీ కావు. అందులో ఎంతో ప్రాముఖ్యమైన, ప్రత్యేకమైన, ప్రధానమైన పధకం దళిత బంధు. మొదటి సారి తెలంగాణలో అట్టడుగు వర్గాలకు న్యాయం చూస్తున్నాం. అనేక పధకాల అమలు అనుభవిస్తున్నారు. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా అనేక సదుపాయలు అందుకుంటున్నారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ చేయూతనందుకుంటున్నారు. అలాగే దళితుల జీవితాల్లో సంపూర్ణంగా వెలుగులు నిండాలని ఆశించిన ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్‌. అందుకు అవసరమైన గొప్ప పధకానికి రూపకల్పన చేసి, ప్రకటించి అమలు చేస్తున్నారు. దళితులకు కొత్త జీవితాలు ప్రసాదిస్తున్నారు. గతంలో దళితులకు ఎంతో కొంత రుణాలు ఇవ్వడమే గొప్పగా చెప్పుకునేవారు. కాని ఇప్పుడు పైసా కూడా ప్రభుత్వానికి తిరిగి కట్టకుండా, పూర్తి సబ్సిడీతో దళిత బంధు పధకంలో రూ.10లక్షల వరకు అందజేస్తున్నారు. లబ్ధిదారుల కోరిక మేరకు, వారి సూచనలను అనుసరించి ప్రభుత్వం వారి ప్రావీణ్యాన్ని బట్టి యూనిట్లను అందజేస్తున్నారు. వారికి ఉపాధి మార్గం చూపిస్తున్నారు. వాటిలో అనేకం వున్నాయి. రైతులుగా పాడిని కావాలనుకుంటున్నవారికి గేదెలు అందజేస్తున్నారు. వ్యవసాయ పనిముట్టుగా పనిచేసే హార్వెస్టర్లు ఇస్తున్నారు. ట్రాక్టర్లు అందజేస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ వున్నవారికి కార్లు ఇస్తున్నారు. కిరణా షాపు నిర్వహిస్తామనుకునేవారికి ఆ సదుపాయం కల్పిస్తున్నారు. సెల్‌ఫోన్‌ షాపులు, ఫర్నిచర్‌ షాపులు, సెంట్రింగ్‌ వర్కులు, టెంట్‌ హౌస్‌లు ఇలా అనేక రూపాల్లో ఉపాది చూపిస్తున్నారు. కాని కొందరు అధికారులు ఈ పధకాన్ని పక్కదోవ పట్టించారు. ఆ పధకం అమలులో చీకట్లు నింపారు. సహజంగా ఎస్సీ కార్పోరేషన్‌ అధికారరులు అమయాకులైన దళితుల్లో మరింత చైతన్యం నింపాలి. వారి జీవితాలకు ఒక మార్గదర్శకంగా నిలవాలి. కాని కొందరు అధికారులు, ముఖ్యంగా ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు చేసిన నిర్వాకం మూలంగా దళిత బంధు వరంగా కాకుంగా, శాపంగా పరిణమించేలా చేస్తున్నారు. వారికి అందాల్సిన సొమ్మును కాజేస్తున్నారు. ఎంతో బాధ్యతగా దళిత బంధును అమలు చేయాల్సిన అధికారుల తీరు బాధాకరం. అత్యంత దురదృష్టకరం. ఇంకా చెప్పాలంటే దుర్మార్గం. పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు అధికారుల తీరు మారడం లేదు. అవినీతి ఆపడం లేదు. అక్రమ సంపాదన మానుకోవడం లేదు. పథకాన్ని నిర్వీర్యం చేసే పన్నాగం పన్నుతున్నారు. ప్రజల పన్నులతో వచ్చే జీతాలు తీసుకుంటూ, ప్రజలకే సున్నం పెడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. 

ఇక్కడు ముఖ్యంగా రెండు విషయాలు చర్చించుకోవాల్సిన అసవరం వుంది.

ప్రభుత్వం పేద దళితుల్లో సాగుతోపాటు, పాడిని చూసుకునేవారి కోరిక మేరకు 8 గేదెలు అందజేయాలని నిర్ణయించింది. అందులో హుజూరాబాద్‌ నియోజక వర్గంలో వేలాది మందిరైతులకు గెదెలు సరఫరా చేశారు. మొదటి విడతగా ముందు 4 గేదెలను అందజేశారు. ఇంత వరకు బాగానే వుంది. కాని అసలు తిరకాసు ఇక్కడే వుంది. ప్రభుత్వం అనుకున్నది ఒకటి. కాని అధికారులు ఆచరించింది మరొకటి. లబ్ధిదారులు మొదటగా గేదెల కోసం షెడ్‌ ఏర్పాటు చేసుకోవాలి. అందుకు అవసరమైన సొమ్మును లబ్ధిదారులు బ్యాంకునుంచి డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. షెడ్డు నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు తీసుకొని, లబ్ధిదారులు కరీంనగర్‌ డైరీకి అందజేశారు. కరీంనగర్‌ డైరీ అధికారులు రైతులను విడతల వారీగా హర్యానా తీసుకెళ్లి, గెదెలు ఇప్పించారు. కాని ఆ గేదెలు మన వాతావరణంలో మనుగడ సాగిస్తాయా?లేదా? అన్నది ఆలోచించలేదు. ఉత్తర బారత ప్రాంతానికి, మన ప్రాంతానికి వాతావరణంలో ఎంతో వ్యత్యాసం వుంటుంది. అందుకే లబ్ధిదారులైన రైతులు తాము ఇక్కడే గేదెలను కొనుగోలు చేసుకుంటామని చెప్పారు. అయినా అధికారులు వినలేదు. ఏ గేదె ఎక్కువ పాలు ఇస్తుందో… ఎంత ఆరోగ్యంగా వుందో…ఎంత వయసు వుందో…ఇలాంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని ఇక్కడే కొనుగోలు చేసుకుంటామని ఎంత మొత్తుకున్నా అధికారులు వినలేదు. గతంలో కురుమలు, యాదవులకు గొర్రెల యూనిట్లు ప్రభుత్వం అందజేసింది. అప్పుడు కూడా అధికారుల అత్యుత్సాహంతో ఇలాంటి పరిస్దితే ఎదురైంది. రైతులను తీసుకెళ్లి ఉత్తర ప్రదేశ్‌ లాంటి ప్రాంతాల నుంచి గొర్రెలు కొనుగోలు చేసి తెచ్చారు. వాటిలో చాలా వరకు గొర్రెలు మరణించాయి. గొర్రెలకు ఇన్యూరెన్సు వుండడం మూలంగా వారికి పెద్దగా నష్టం జరగలేదు. కాని గేదెలకు అలాంటి అవకాశం కల్పించబడలేదు. దాంతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. గేదెలను హర్యానా నుంచి కొనుగోలు చేసిన సందర్భంలో లబ్ధిదారులు ఇక్కడే కొనుగోలు చేస్తామంటూ రూల్స్‌, రెగ్యులేషన్లు అంటూ కొత్త కొత్త బాష్యాలు చెప్పిన అధికారులు, ఇప్పుడు కూడా వారి మాటలు వినడం లేదు. కాని గేదల స్దానంలో మరో రకమైన యూనిట్‌ ఎంపిక చేసుకొమ్మని కొత్త సలహాలు ఇస్తున్నారట…అంటే ఇప్పుడు రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్లు అతిక్రమించొచ్చా? అందుకు అధికారులకు ప్రభుత్వమేమైనా మార్గదర్శకాలు జారీ చేసిందా? అదే నిజమైతే గేదెలను ఇక్కడే కొనుగోలు చేసేలా కొత్త గైడ్‌ లైన్స్‌ ఇస్తుందే గాని, ఇతర యూనిట్లను ఎంపిక చేసుకొమ్మని చెబుతుందా? ఇలా ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసేంందుకు, కమీషన్లలో కొత్త దారులు వెతుక్కునేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నారు తప్ప, లబ్ధిదారులకు మేలు చేయాలన్న సోయి మాత్రం ఒక్క శాతం కూడా లేదన్న సంగతి తేలిపోయింది. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటే తప్ప, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగవు. ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పడవు. 

ఇక ట్రాక్టర్ల మాయాజాలం మరో రకమైంది. 

హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో కొన్ని వందల ట్రాక్టర్లు దళిత బంధు కింద అందజేయడం జరిగింది. మరి ఆ టాక్టర్లు ఇప్పుడు లబ్ధిదారుల వద్ద వున్నాయా? లేదా అన్న వాటిని చూసుకునే తీరిక అధికారులకు లేదు. అంతే కాదు ఏ లబ్ధిదారుడికైనా అందిన ప్రతి యూనిట్‌ విషయంలోనూ వారికి ఉపాధి ఎంత లభిస్తోంది. ఒక వేళ లేకపోతే, వారికి ఎలా ఉపాధి కల్పించాలన్నది కూడా ప్రభుత్వ ఉద్యోగులే చొరవ తీసుకోవాలన్నది రూలు. కాని ఎస్పీ కార్పోరేషన్‌ ఉద్యోగులు ట్రాక్టర్లు ఇచేసి చేతులెత్తేశారు. వాటిని అమ్ముకోమ్మని చెప్పి, చేతులు దులుపుకుంటున్నారు. అసలు ఇక్కడ ఎంతో ముఖ్యమైన విషయాలను అధికారులు గాలికి వదిలేశారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి యూనిట్‌ మీద దళిత బంధు స్కీమ్‌ పేరు ఖచ్చితంగా రాయించాలి. పైగా ముఖ్యమంత్రి ఫోటో స్టిక్కర్‌ ఖచ్చితంగా వుండాలి. అది కారైనా, ట్రాక్టరైనా,హార్వెస్టరైనా మరేదైనా సరే, దళిత బంధు స్కీమ్‌ కనిపించేలా వుండాలి. కాని అధికారులు తూతూ మంత్రంగా మాత్రమే వాటిని చూసుకున్నారు. మిగతావాటికి వదిలేశారు. దళిత బంధు స్కీమ్‌ కింద లబ్ధిదారులకు అందజేసిన ఏ వాహనమైనా, మరే ఇతర యూనిట్‌ అయినా సరే అమ్ముకోవడానికి వీలులేదు. ఎవరూ కొనుగోలు చేయకూడదు. అదే జరిగితే ఇద్దరిదీ నేరమే అవుతుంది. ఈ విషయం అమాయకులైన లబ్ధిదారులకు చెప్పకుండా అధికారులు మభ్యపెట్టారు. ఈ విషయం తెలియక ట్రాక్టర్లు చాలా మంది లబ్ధిదారులు అమ్ముకున్నారు. సుమారు 60శాతానికి పైగా ట్రాక్టర్లు ఇప్పుడు లబ్ధిదారుల వద్దలేవు. ఈ విషయంలో లబ్ధిదారులను మాయ చేసి, వారి చేత అమ్మకాలకు పురిగొల్పింది కూడా అధికారులే కావడం గమనార్హం. ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు ఇలా లబ్ధిదారుల సొమ్ముకు కన్నం పెడితే, అగ్రికర్చర్‌ అధికారులు తామేం తక్కువా అనుకున్నారో ఏమో! ట్రాక్టర్లు సరఫరా చేసిన ఎజెన్సీల వద్దకు వెళ్లి, ఇన్ని ట్రాక్టర్లు అమ్మకానికి అవకాశం కల్పించామని, తమకు కమీషన్‌ ఇవ్వాలని వారిని వేధించి వసూలు చేసినట్లు కూడా తెలుస్తోంది. అగ్రికర్చర్‌ డిపార్లుమెంటుకు చెందిన ఓ ఉన్నతాధికారి ఏకంగా ఆ ఎజెన్సీ యజమానికి బెదిరించినట్లు కూడా సమాచారం. ఇలా ఎవరికి వారు కమీషన్ల పేరుతో వాటాలు పంచుకొని, దళిత బంధు సొమ్ము కాజేశారు…లబ్ధిదారుల వద్ద ట్రాక్టర్లు లేకుండా చేశారు. ఇప్పుడు ఆ ట్రాక్టర్లనీ ఆంధ్రాప్రాంతానికి చెందిన కొంత మంది వ్యక్తులకు దగ్గరుండి మధ్యవర్తుల చేత అధికారులు కధలు నడిపించారు. మొత్తంగా పథకానికి సున్నా చుట్టేశారు.

దళిత బంధు మేసిన రాబందులెవరు?

`ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడిచిందెవరు?

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశలు, ఆశయాలు వమ్ము చేసిందెవరు?

`హుజూరాబాద్‌ పైలెట్‌ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిరదెవరు?

`దళిత బంధును పప్పు బెల్లాలు చేసుకొని పంచుకొని మింగిందెవరు?

`ప్రతిపక్షాలకు మాటలకు కొమ్ము కాసేలా వ్యవహరించిన అధికారులెవరు?

`ప్రతిపక్షాల మాయలో పడి దళితబంధు లబ్ధి దారులను దోపిడీ చేసిందెవరు?

`అమాయకపు దళితుల జీవితాలను ఆగం చేసిందెవరు?

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిందేమిటి? 

`అధికారులు ఆచరించిందేమిటి?

`ఎస్సీ కార్పొరేషన్‌ చేసిన ఘన కార్యమేమిటి?

`లబ్ధి దారులను పక్కదారి పట్టించడంలో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారుల పాత్రేమిటి?

`జిల్లా స్థాయి అధికారుల పంపకాల మాటేమిటి?

`ఉత్తుత్తి ట్రేడర్స్‌ కు సొమ్ము కట్టబెట్టడమేటి?

`కార్లు ఇచ్చిన ఏజెన్సీకి అదనంగా మరో లక్షన్నర కలపని అధికారుల ఆదేశాలలో ఆంతర్యమేమిటి?

`దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లు దళిత బంధు లూటీ మాటేమిటి?

`వందల కోట్లు మింగి, కరిమింగిన వెలగపండు చేస్తిరి?

`ప్రభుత్వ లక్ష్యం నీరుగార్చితిరి?

`లబ్ధి దారులను మోసం చేసి, నిండా ముంచితిరి?

` ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తిరి?

`అసలు దొంగల చేత తిన్నది కక్కిస్తే గాని దళిత బంధు లక్ష్యం నెరవేరదు?

`రొయ్యలు తిని మూతి నాకినంత సులువుగా కోట్లు కొట్టేసి చేతులు దులుపుకుంటిరి?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలోని ప్రతి దళిత కుటుంబం కళకళలాడాలి. ప్రతి దళితుడు లక్షాదికారి కావాలి. ఆత్మగౌరవంతో బతకాలి. ఆర్ధికంగా ఉన్నత స్ధితికి చేరుకోవాలి. సమస్యలు లేని జీవితాన్ని గడపాలి. ఆర్ధిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవాలి. ఆపసోపాలు లేని జీవన యానం కావాలి. తెలంగాణ వచ్చింది. తెలంగాణలో అన్ని వార్గాలు ఆనందంగా బతకాలి. అందులో దళితులు మరింత సంతోషంగా బతికే రోజులు రావాలి. తరతరాలుగా అణచివేతకు, వివక్షకు గురౌతూ, సమాజంలో అట్టడుగు వర్గాలుగా మిగిలిపోతూ, ఆర్ధిక అసమానతలతో వెనుకబడిన దళితుల జీవితాల్లో మార్పులు రావాలి. వారు కూడా సమాజంలో ఉన్నతంగా బతకాలి. అందుకు వారికి ఆర్ధిక చేయూత కల్పించాలి. ఉపాధి అవకాశాలు కల్పించబడాలి. ఉన్నతమైన ఉచిత విద్యావకాశాలు అందించాలి. రేపటి తరాన్ని ఉన్నతంగా తీర్చదిద్దాలి. అసమానతలు లేని సమాజం నిర్మింపబడాలి. వెనుబాటు తనం పోవాలి. అది సామాజిక పరంగానైనా, ఆర్దిక పరంగానైనా అందరూ ఏకతాటిపైకి వచ్చే సమాజ నిర్మాణం జరగాలి. ఇదీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచన..ఆచరణ. 

 సమాజంలో దళిత వార్గల అభ్యున్నతి గురించి గొప్పగా కొన్ని దశాబ్ధాలుగా చెప్పుకుంటున్న మాటే…మనం వింటున్న మాటే…కాని ఆచరణేది…ఆచరించిన వారేరీ..  

ఇన్నేళ్లయినా ఆ మాటలు మాటలుగానే మిగిలిపోతూ వచ్చాయి. అందుకే కేటాంచిన సొమ్ము మూటలు మాయమైపోతూ వచ్చాయి…దళితులకు చేయూతనందించిన వారేరీ…గొప్పగా బడ్జెట్‌లో లెక్కలు చూపించి మోసం చేసిన వారే…అలా కాకుండా నేరుగా దళితులకు మేలు జరిగేలా, ఆర్ధికపరమైన లబ్ధి జరిగేలా, ప్రతి దళితుడు లక్షాదికారి అయ్యేలా చేయాలని ప్రపంచ చరిత్రలోనే వినూత్నమైన, విప్లవాత్మకమైన దళిత బంధు పధకాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రవేశపెట్టారు. తెలంగాణలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించింది ముఖ్యమంత్రి ఒక్క కేసిఆర్‌ మాత్రమే…గతంలో చాలా మంది నాయకులు, చాల మంది ముఖ్యమంత్రులు చాలా చెప్పారు. కాని ఏది ఆచరించి చూపించలేదు. బడ్జెట్‌లలో కేటాయింపులు, తర్వాత వాటి మళ్లింపులు. ఇవే కాదా…మొన్నదిదాకా చూసింది…కాని నేడు ఆ పరిస్ధితి లేదు. దళితుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తున్న తరుణమిది. ముందుగా పైలెట్‌ ప్రాజెక్టు హుజూరాబాద్‌లో తీసుకోవడం జరిగింది. ఆ నియోకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.పది లక్షలు అందించే కార్యక్రమం మొదలైంది. అయితే ఇందులో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో దూరదృష్టితో ఉన్నతమైన ఆశయాలు…ఆలోచనతో…ఆచరాత్మక దృక్పధాన్ని మేళవించి ఒక విప్లవాత్మక ధోరణితో దళిత బంధు అమలుకు శ్రీకారం చుట్టారు. కాని ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులకు చెవికెక్కలేదా?… లేక సరిగ్గా వినిపించుకోలేదా? ముఖ్యమంత్రి ఆదేశాలూ పూర్తిగా అవగాహన చేసుకోలేదో? ఏమో గాని దళిత బంధు అమలులో అధికారుల తీరు వివాదాస్పదమౌతోంది. పెద్దఎత్తున చర్చనీయాంశమౌతోంది. దళిత బంధు ఆశయాలకు తూట్లుపొడిచారన్న విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నాయి. పై స్ధాయి అధికారులు చేసిన అవకతవలపై, కింది స్ధాయి అధికారుల మెడకు చుట్టుకునే పరిస్దితులు రానున్నాయి. ప్రభుత్వం తెలంగాణలోని ప్రతి దళితుడిని లక్షాధికారి చేయాలన్న గొప్ప సంకల్పంతో చేస్తున్న యజ్ఞానికి తూట్లు పొడిచి, పైలెట్‌ ప్రాజెక్టులోనే పెద్ద కుంభకోణానికి అధికారులు తెరతీసినట్లు స్పష్టమౌతోంది. 

 ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అన్నవి కనీస అవసరాలు..

.అవి తీరాలంటే పని చేయాలి. కష్టపడాలి. డబ్బు సంపాదించాలి. అందుకు ఉపాధి కావాలి. ఆ ఉపాధి ఏదో ఒక రూపకంగా అందాలి. దాన్ని ప్రతి వ్యక్తి ఆచరించాలి. అనుసరించాలి. అవసరాలు తీర్చుకోవాలి. ఇది మనిషి ఫిలాసఫీ…అనుసరించి…ఆచరించాల్సిన ప్రాక్టికాలిటి…కాని సమజాంలో ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలు మారినా తలరాత మారని, జీవితాలు మార్పులు రాని దళిత సమాజం పట్ల గత ప్రభుత్వాలు సానుభూతి మాత్రం చూపిస్తూ వచ్చేవి. కాని వారి జీవితాల్లో వెలుగులు నింపే పని జరగలేదు. కాని ఇప్పుడు మొదలైంది. దళిత బంధుతో ఆ యజ్ఞం ప్రారంభమైంది. అందుకు ప్రతి దళితకుటుంబానికి ప్రభుత్వం నేరుగా ఆర్ధికపరమైన సాయం అందిస్తోంది. ఆ సొమ్ముతో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తోంది. హుజూరాబాద్‌లో ప్రారంభమైన దళిత బంధు సుమారు 18వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం చేపట్టింది. గొప్పగా ఆ పథకం అమలుకు మార్గం వేసింది. కాని అధికారుల తీరుతో ఆ పధకం అసలు లక్ష్యాలకు తూట్లు పడేలా చేసింది. నిజానికి ప్రభుత్వ లక్ష్యం వేరు…అధికారులు అనుసరించింది వేరు…అందులోనూ కుంభకోణానికి తెరతీశారు…దాంతో ప్రభుత్వం ఎంతో గొప్ప లక్ష్యంతో చేపట్టిన పధకాన్ని అధికారులు నీరు కార్చుతున్నారు. దళిత బంధు అమలుకు ఎవరి రెకమెండేషన్‌ అవసరం లేదు…దళితుడైన ప్రతి వ్యక్తికి ఆర్ధిక చేయూత కల్పించబడాలి. ఇదే అధికారులకు వరంగా మారింది. లబ్ధిదారులైన ప్రతి దళితుడికి ముందు రూ.5లక్షలతో వారు కోరుకున్న యూనిట్‌ అందజేయాలి. లేదూ..కొంత మంది కలిసి ఏర్పాటు చేసుకొనే సంయుక్త యూనిట్‌ను అందించాలి. ఇవన్నీ అధికారుల పర్యవేక్షణలో జరగాలి. ఎవరెవరు ఏ ఉపాధి కావాలనుకుంటున్నారు…వారికున్న నైపుణ్యాన్ని బట్టి ఆయా యూనిట్లను అందించాల్సిన బాధ్యత ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులది. కాని ఇక్కడ జరిగింది వేరు…పథకం అమలులో సొమ్ములు ఖర్చు చేశారు..కాని లక్ష్యాలకు తూట్లు పొడిచారు…దళితుల జీవితాలను ఎక్కడ వేసినగొంగళి అక్కడే అన్నట్లు తయారు చేశారు…

దళిత బంధు అమలులో అందించిన యూనిట్ల జాడేది అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.

పెద్దఎత్తున ఎస్పీ కార్పోరేషన్‌ అధికారులు పై స్ధాయి నుంచి కింది స్ధాయి దాకా వాటాలు పంచుకున్నట్లు లెక్కలేసి, దళిత బంధు సొమ్మును దానంగా ఇస్తున్నట్లు ఇచ్చింది తీసుకోండన్నట్లు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. దళిత బంధు సొమ్ము ప్రతి దళితుడి అక్కంట్లో వున్నప్పటికీ వాటిని ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు ఎంతో చాకచక్యంగా వాటిని మళ్లించే ప్రయత్నం చేశారు. లబ్ధిదారుల బలహీనతలను ఆసరాగా చేసుకొని వారికి, నగదు ఆశ చూపించి మోసం చేశారు… 

 ప్రతిపక్షాల తీరు…అధికారుల పనితీరు… రెండూ కలిసి దళిత బంధు అమలుకు తూట్లు పొడిచేలా చేశాయి. 

అసలు దళిత బంధు అన్నది అమలుసాధ్యం కానిదంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ వచ్చాయి. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే ప్రవేశపెట్టిన పధకమంటూ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాయి. అంతే కాకుండా ప్రభుత్వం దళితుల అక్కంట్లో వేసిన డబ్బులు తిరిగి తీసుకుంటుందని అసత్య ప్రచారం విసృతంగా చేశాయి. ఆ మాటలే నిజమన్నట్లుగా కొందరు అధికారులు వ్యవహరించారు. లబ్ధిదారుల బలహీనతలను అధికారులు సొమ్ము చేసుకున్నారు. ప్రెండ్లీ ఎంప్లాయిస్‌ అని ప్రభుత్వం చెబితే..దళిత బంధులను ఊడ్చుకుతిన్నారు…వాటాలేసుకొని పంచుకుతిన్నారు. లబ్ధిదారులను మోసం చేశారు…

  మేం వేలు పెడితే రాజకీయమౌతుందని అధికార పార్టీకి చెందిన బిఆర్‌ఎస్‌ నేతలు ఈ విషయంలో వేలు పెట్టలేదు.

 దళితులందరికీ సాయం అందుతున్నప్పుడు వాటిని రాజకీయం చేయకుంటనే మేలని బిఆర్‌ఎస్‌ నేతలు ఎంతో హుందాగా వ్యవహరించారు. ప్రతిపక్షాలేమో…దళిత బంధు ఫెయిల్‌ కావాలని కుయుక్తులు పన్నాయి. గందరగోళం సృష్టించారు. ప్రజలను రెచ్చగొట్టారు. అమాయకులైన వారికి లేనిపోనివి కల్పించి చెప్పారు. దళిత బంధు డబ్బులు వాడుకోకపోతే, ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని అసత్య ప్రచారం సృష్టించారు. ప్రతిపక్షాలు సృష్టించి ఈ గందరగోళం ఎస్సీ కార్పోరేషన్‌ అధికారుల పాలిట వరమైంది. పట్టించకునే నాధుడు లేడు…అడిగే దిక్కులేదనుకున్నారో ఏమో ఇష్టారాజ్యం చేశారు. దళిత బంధులో దక్కించుకోవాల్సినంత దక్కించుకున్నారు. విస్తరిలో మిగిలిన మెతుకులు విధిల్చినట్లు లబ్ధిదారులకు సున్నం పెట్టారు. ఆకు వక్కలు మాత్రం అధికారులు తిన్నారు. నోరు పొక్కినా ఏదో రుచి నాలుకకు అంటిందే పరమన్నామ్మన్నట్లు అధికారులు ఇచ్చింది లబ్ధిదారులు పుచ్చుకున్నారు. పుణ్యానికి వచ్చింది ఎంతైతే అంత అని సరిపెట్టుకోమన్నారు. తమకు చెందాల్సిన సొమ్మును ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు కాజేస్తున్నారన్న సత్యం తెలుసుకోలేకపోయారు. లబ్ధిదారుల బలహీనతే అధికారులు అప్పనంగా వాడుకున్నారు…దోచుకోవాల్సినంత దోచుకున్నారు…(ఉత్తుత్తి ట్రేడర్ల మాయాజాలం…దళిత బంధు నిధులు మాయం) రేపటి మీ నేటిధాత్రిలో…

అధికారులు ఉన్నట్టా? ఉండి లేనట్టా?

చొప్పదండి / నేటి ధాత్రి

కరీంనగర్ జిల్లాచొప్పదండి మండల పరిధిలోని ఆర్నకొండ గ్రామ పెట్రోల్ బంక్ నుండి మొదలయ్యే రాష్ట్ర రహదారికి ఇరువైపుల ఉన్నటువంటి చెట్లను కర్ర వ్యాపారాలు యదేచ్చగా రాత్రికి రాత్రే ఎలాంటి అనుమతులు లేకుండా కోయడం జరిగింది. అసలు అధికారులు ఉన్నట్టా? ఉండి లేనట్టా? అన్నట్టుగా ఉంది ఇక్కడి వ్యవహారం. ఇలా గతంలో కూడా జరిగినట్టు సమాచారం. ఇకపోతే ఫారెస్ట్ అధికారులు సరే సరే. అందాల్సిన అమ్యామ్యాలు అందితే చాలు చూసి చూడనట్టుగా వ్యవహారిస్తునరన్నా అభియోగాలు లేకపోలేదు. ఇలా కర్ర వ్యాపారులు ఎవరికీ నచ్చినట్టుగా వారి స్వలాభం కోసం చెట్లను నరక్కుంటూ పోతే ఎలా అని ఇక్కడి ప్రజల అభిప్రాయం. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మొక్కలను పెంచి అడవుల విస్తీరణాన్ని పెంచే కార్యక్రమాలు చేస్తుంటే మరోపక్క కర్ర వ్యాపారులు వాటిని తుంచే ప్రయత్నాలను రాత్రికి రాత్రే జరిపేలా ఆలోచనలు చేయడం చట్టవిరుద్ధముగా భావించి చెట్లను నరికిన వారిపై పూర్తి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియచేయడమైనది. దీనిపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారోనని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

పల్లె ప్రకృతి వనన్ని పట్టించుకొని ఆధికారులు

తాగుబోతులకు అడ్డగా మారిన పల్లె ప్రకృతి వనం

చూచి చూడకుండా వదిలిపెట్టిన పల్లె ప్రకృతి వనం

బోయినిపల్లి:నేటిధాత్రి 

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మానువాడ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నోవేల కోట్ల ఖర్చు చేసి, పల్లె ప్రకృతి వనం నిర్మాణం చేపట్టిన సందర్భంగా అధికారుల నిర్లక్ష్యం వలన పల్లె ప్రకృతి వనం చుట్టూ ఫినిషింగ్ జాలి ఉండగా,గుర్తుతెలియని వ్యక్తులు ఫినిషింగ్ జాలిని విరగొట్టడమే కాక పల్లె ప్రకృతి వనం లోపలికి వెళ్లే దారి గేటు లేనందున తాగుబోతులకు అడ్డగా మారింది.అధికారులు ఎవరూ పట్టించుకోక,చెట్లకు నీళ్లు అందిచక,చెట్లు ఎండిపోయి, విరిగి చెత్తాచెదరంతో పూర్తిగా కూడుకుపోయింది.పక్కనే దారి ఉన్నందున దారిగుంట వెళ్తున్న పత్రిక విలేఖరికి కనిపించినందున వెంటనే పోటోలు తీసి, గ్రామ కార్యదర్శి కి ఫోన్ చేయాగ ఫోన్ కట్ చేశారు.ఏపీవో సబితను పల్లె ప్రకృతి వనం సమాచారం గురించి వివరన కోరగా మా దృష్టికి ఏమీ రాలేదని చెప్పినారు.వెంటనే ఎంపీటీసీ ఐరెడ్డి గీతా మల్లారెడ్డికి సమాచారం ఇవ్వగా స్పందించి పల్లె ప్రకృతికి వచ్చి చూసి, మేము చాలా సార్లు, గ్రామకార్యదర్శితో చర్చించామని అన్నారు. ఎంపీఓ తిలక్ కు సమాచారం అందించగా 2,3 రోజులలో వచ్చి చూస్తానని తెలిపినారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యను తీర్చాలని గ్రామ ప్రజలు, తదితరులు కోరుతున్నారు.

నిమ్స్ లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి గారిని శుక్ర‌వారం పరామర్శించిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.

రెండు రోజుల జిల్లా ప‌ర్య‌ట‌న ముగించుకొని శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ కు వ‌చ్చిన మంత్రి. 

నేరుగా నిమ్స్‌కు వెళ్లి ప్రీతి ఆరోగ్యంపై స‌మీక్ష‌. 

 

ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్, చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని అడిగి తెల్సుకున్న మంత్రి హరీశ్ రావు.  

 

అత్యుత్తమ వైద్యం అందించాల‌ని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యుల‌ను ఆదేశించిన మంత్రి హరీశ్ రావు.  

 

ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చి, ధైర్యం చెప్పిన మంత్రి హరీశ్ రావు. 

 

ప్రభుత్వం అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చిన మంత్రి. 

 

విచారణ పూర్తి నిష్పాక్షికంగా జ‌రుగుతుంద‌ని, దోషులు ఎంత‌టివారైనా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ ఇచ్చిన మంత్రి హ‌రీశ్ రావు.

భూపాలపల్లి బాద్‌ షా గండ్ర

`బిఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ క్రెడిట్‌ గండ్రకే…

`వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ గండ్రదే…

`గండ్ర మీద ప్రజలకున్న ప్రేమకు సంకేతం…

`నేటిధాత్రి చెప్పేదే నిజం…గత అనుభవాలే అందుకు సాక్ష్యం.

`రెండు దశాబ్దాలుగా గండ్రది తిరుగులేని నాయకత్వం…

`రెండు సార్లు ఎమ్మెల్యే…

`ఒకసారి ఎమ్మెల్సీ..

`ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్‌ విప్‌…

`ప్రగతిలో భూపాలపల్లి ప్రత్యేకం…

`ప్రజలతో మమేకమై.. ప్రజల కోసమే అంకితమై…

`సుదీర్ఘ రాజకీయ ప్రయాణం… అభివృద్ధికి తార్కాణం.

`అలుపెరుగని పోరాటం… ప్రజల సంక్షేమం కోసం ఆరాటం.

`నిరంతరం ప్రజల కోసం…నిజమైన సేవా భావానికి నిదర్శనం.

`పార్టీ బలోపేతం కోసం కృషి, నాయకులను కడుపులో పెట్టుకునే చిత్తశుద్ధి.

`పేదలకు ఆప్తుడు…అభాగ్యులకు అన్నార్థుడు.

` నియోజకవర్గం కోసం నిరంతరం తపించే నాయకుడు.

`ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం తపించే ప్రజా సేవకుడు…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాలం కలిసొస్తుంది…ధర్మం, న్యాయం మనవైపు వుంది. తెలంగాణ వచ్చి తీరుతుంది… ఇది ఎవరో అన్న మాటలు కాదు…సాక్ష్యాత్తు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి 2009లో అన్న మాటలు. మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తో అప్పట్లో చెప్పిన మాట…ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే 2009 ఎన్నికలలో గండ్ర వెంకట రమణారెడ్డి తొలి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటికే ఆయన ఎమ్మెల్సీ కూడా… అయితే ఆ ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కేవలం పది సీట్లు సాధించింది. ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో కేటిఆర్‌ అసెంబ్లీ లాబీలో ఎదురైన గండ్ర వెంకట రమణారెడ్డితో కాసేపు తెలంగాణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా కేటిఆర్‌ చెప్పిన విషయాలను సావధానంగా విన్న రమణారెడ్డి తెలంగాణ రావడం ఖాయమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణపై రమణారెడ్డికి వున్న చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేశారు. తన నియోజకవర్గం మీద రమణారెడ్డికి ఎంత ప్రేమ వుందో వివరించే ప్రయత్నం చేశారు. తనకు అత్యంత అప్పుడు రమణారెడ్డి అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఉటంకించారు. రమణారెడ్డి మీద తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. అలాంటి రమణారెడ్డి బిఆర్‌ఎస్‌ లో చేరి భూపాలపల్లికి చేసిన సేవను, అభివృద్ధి కార్యక్రమాలను కీర్తించారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు సభపై కేటిఆర్‌ ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా బిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి నాయకత్వ పటిమను కొనియాడారు. భూపాలపల్లిలో చరిత్ర తిరగరాసేంత గొప్పగా సభను ఏర్పాటు చేసిన గండ్ర జ్యోతికి ప్రత్యేకంగా కేటిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

బిఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ క్రెడిట్‌ గండ్రదే…

భూపాలపల్లిలో జరిగిన బిఆర్‌ఎస్‌ సభ నభూతో నభవిష్యతి అన్నట్లు జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎంత జిల్లా కేంద్రంలో సభైనా అది నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజలకున్న నమ్మకం మీద జరిగిన సభ. ఒక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగిన తర్వాత, అక్కడే జరిగిన సభ. సహజంగా ఎన్నికల సభలకు ప్రజలు విశేషంగా హజరుకావడం చూస్తుంటాం. కానీ ఇలాంటి సభలు బహు అరుదు. అవి ఆది నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీకే, ఆ పార్టీ నాయకులకే సాధ్యమౌతుంది. ఇటీవల కాలంలో బిఆర్‌ఎస్‌ పార్టీ సభలకు ప్రజలు గతం కన్నా ఎక్కువగానే వస్తున్నారు. ఆ మధ్య ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు. జిల్లాలలో సమీకృత కలెక్టర్‌ కార్యాలయం సముదాయాల ప్రారంభోత్సవాలు, మెడికల్‌ కాలేజీల శంకుస్థాపనలకు జరుగుతున్న సభలు కూడా పెద్ద ఎత్తున విజయవంతమౌతున్నాయి. అయితే భూపాలపల్లిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనల తర్వాత జరిగిన బిఆర్‌ఎస్‌ సభ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్‌ అవుతుందని చాలా మంది ఊహించలేదు. కానీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిత్తశుద్ధి, చొరవ, పార్టీ మీద ఆయనకున్న పట్టు, నాయకులలో ఎమ్మెల్యే మీద వున్న విశ్వాసం ఇవన్నీ సభ ఏర్పాటులో కనిపించాయి. అటు వేధిక, ఇటు ప్రజా సముదాయం ఎమ్మెల్యే మీద మరింత నమ్మకాన్ని పెంచిందనే చెప్పాలి. ఇలాంటి సభల సక్సెస్‌ అన్నది నాయకుల మీద మరింత బాధ్యత పెంచుతుంది. ప్రజల్లో నాయకుడిపై నమ్మకం రెట్టింపు అవుతుంది. ప్రజల ఆకాంక్షలు పెరుగుతాయి. మా సమస్యలు తీరుతాయన్న విశ్వాసం పెరుగుతుంది. గత మూడు దశాబ్దాలుగా రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న గండ్ర వెంకట రమణారెడ్డి మీద రోజు రోజుకూ ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గలేదు. అందుకు భూపాలపల్లి సభ విజయవంతం కావడమే నిదర్శనం. బిఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ తో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త రెట్టించిన ఉత్సాహం కనిపించింది. పార్టీ మీద కూడా ప్రజలకు మరింత అచంచల విశ్వాసం పెరిగిందనడానికి నిదర్శనం. 

వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ గండ్రకే… 

భూపాలపల్లిలో జరిగిన సభతో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. అడుగడుగునా మంత్రి కేటిఆర్‌ ఎమ్మెల్యేకు ఇచ్చిన ప్రాధాన్యతలోనే రమణారెడ్డికి పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో అర్థమైంది. ప్రతి సందర్భంలోనూ మంత్రి కేటిఆర్‌ ప్రజలకు రమణారెడ్డి నాయకత్వ గొప్ప తనం గురించి వివరించే ప్రయత్నం చేశారు. రమణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత శ్రమిస్తారనేది కూడా ప్రజలకు మరింత తెలిసేలా చేశారు. ఇంతటి ప్రాధాన్యమనేది అందరికీ దక్కేది కాదు. ఇలాంటి సభలు తెలంగాణలో పెద్దగా ఏర్పాటు చేసినవి కావు. కానీ ప్రత్యేకంగా రమణారెడ్డి మీద వున్న నమ్మకం, ఆయన నాయకత్వంలో అటు పార్టీకి, ఇటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కేటిఆర్‌ కు పూర్తి స్థాయిలో అర్థమైంది. ఒకనాడు ఆయన మనసులోని ఆలోచన తెలుసుకున్న కేటిఆర్‌, ఇప్పుడు రమణారెడ్డి లోని నాయకత్వ దృక్పథం ఎంత విలువైందో తెలిసింది. అందుకే కేటిఆర్‌ ఇంత ప్రాధాన్యత కల్పించారనేది స్పష్టమైంది. అంతే కాకుండా వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ కూడా రమణారెడ్డి కే అన్న పరోక్ష సంకేతాలు కూడా పంపినట్లైంది

గండ్ర మీద ప్రజలకున్న ప్రేమకు సంకేతం…

తెలంగాణలో భూపాలపల్లి అనేది మారుమూల ప్రాంతం. అందులోనూ కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రం. ఆ జిల్లాలో ఒక బ్రహ్మాండమైన సభ జరపడం అన్నది ఎంతో సాహసంతో కూడుకున్న పని. ఏ మాత్రం తేడావచ్చినా నాయకత్వం మీద వున్న నమ్మకం తలకిందులౌతుంది. రమణారెడ్డికి ప్రజల మీద వున్న విశ్వాసం… ప్రజలకు రమణారెడ్డి అంటే వున్న నమ్మకం మీదనే సభ జరిగింది. సక్సెస్‌ అయ్యింది. పార్టికి మరింత జోష్‌ వచ్చింది. బిఆర్‌ఎస్‌ కు తిగులేదని మరోసారి తరలిపోయింది. 

నేటిధాత్రి చెప్పేదే నిజం…గత అనుభవాలే అందుకు సాక్ష్యం. 

ఈ విషయం నేటిధాత్రి ఎప్పటి నుంచో చెబుతోంది. తెలంగాణలో గెలిచే నియోజకవర్గాలు ఏవో, నాయకత్వాలు బలంగా ఎక్కడ వున్నాయో, తిరుగులేని నాయకులు ఎవరో ఇప్పటికే అనేక సర్వేలు నిర్విస్తూ వస్తోంది. భూపాలపల్లి విషయంలో కూడా బిఆర్‌ఎస్‌ ఎంత బలంగా వుందో కూడా చెబుతూనే వస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ముందు నేటిధాత్రి చెప్పిందే నిజమైంది. మునుగోడు అభ్యర్థి విషయంలో నేటిధాత్రి చెప్పిందే ఫైనల్‌ అయ్యింది. తెలంగాణలో నియోజకవర్గాలలో బిఆర్‌ఎస్‌ బలబలాలపై కూడా ఇప్పటికే పలు మార్లు రిపోర్ట్‌ కూడా ప్రచురించడం జరిగింది. అందులో భూపాలపల్లిలో రాజకీయం ఏం నడుస్తుందో కూడా నేటిధాత్రి చెప్పింది. గండ్ర వెంకట రమణారెడ్డి కే పెద్ద పీఠ అన్నది ఎప్పటి నుంచో నేటిధాత్రి చెబుతూనే వస్తోంది. అదే ఇప్పుడు నిజమైంది. కేటిఆర్‌ కూడా సభలో ఇదే విషయాన్ని కొంత బహిరంగంగా, మరి కొంత నర్మగర్భంగా చెప్పాల్సిన విషయమైతే చెప్పాడు. అర్థమైన వాళ్లు అర్థమైనంతగా వివరంగానే తన అభిప్రాయం వెల్లడిరచారు. ఒక రకంగా వచ్చే ఎన్నికలలో రమణారెడ్డి కే టిక్కెట్‌ అన్నది తేల్చేశారు. తగాదాలు వద్దని చెప్పేశాడు. పేచీలకు తావు లేదని స్పష్టం చేశాడు. 

రెండు దశాబ్దాలుగా గండ్రది తిరుగులేని నాయకత్వం…రెండు సార్లు ఎమ్మెల్యే…ఒకసారి ఎమ్మెల్సీ…

ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌. ప్రగతిలో భూపాలపల్లి ప్రత్యేకం…ఆనాడైనా, ఈనాడైనా అభివృద్ధికి కట్టుబడి వున్న నాయకుడు రమణారెడ్డి. ప్రజలతో మమేకమై.. ప్రజల కోసమే అంకితమై…పని చేయడం మాత్రమే రమణారెడ్డికి తెలుసు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం… అభివృద్ధికి తార్కాణం అనేది జిల్లా ప్రజలే చెప్పుకుంటున్న మాట. అలుపెరుగని పోరాటం… ప్రజల సంక్షేమం కోసం ఆరాటం. ఆది నుంచి రమణారెడ్డి వ్యక్తిత్వం. నిరంతరం ప్రజల కోసం…నిజమైన సేవా భావానికి నిదర్శనం. అని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఎప్పుడూ చెప్పుకునే మాట. పార్టీ బలోపేతం కోసం కృషి, నాయకులను కడుపులో పెట్టుకునే చిత్తశుద్ధి. ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా వుండడం రమణారెడ్డి కి తెలుసు. వారి సాధక బాదకాలు పట్టించుకుంటూ కంటికి రెప్పలా చూసుకుంటారు అనే మాట వుంది. పేదలకు ఆప్తుడు…అభాగ్యులకు అన్నార్థుడు. నియోజకవర్గం కోసం నిరంతరం తపించే నాయకుడు.

ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం తపించే ప్రజా సేవకుడు…

తెలంగాణకు చెదపురుగు షర్మిల!

-ప్రశాంతమైన తెలంగాణలో చిచ్చురేపడానికి వచ్చిన చీడ పురుగు.

-చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రాజకీయాలు తెలంగాణలో చెల్లవు.

-తెలంగాణ శత్రువులకు ఇక్కడ చోటులేదు.

-తెలంగాణను దోచుకున్న వాళ్లకు మాట్లాడే అర్హతలేదు.

-షర్మిల దొంగ దీక్షలు…తెలంగాణ మీద లేని ప్రేమలు, పిచ్చి భ్రమలు ప్రజలకు తెలుసు.

-ఒకనాడు తెలంగాణకు నిలువు, అడ్డం నిలబడిరది వైఎస్‌…

-ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ఉనికి కోసం షర్మిల.

-తెలంగాణను తూర్పారపట్టి, ఒట్టిపోయిన ఆవును చేసింది వైఎస్‌.

-అదే తెలంగాణను గంగి గోవును చేసింది కేసిఆర్‌.

-తెలంగాణను ఎండబెట్టింది వైఎస్‌…

-తెలంగాణను సిరుల మాగాణ చేసింది కేసిఆర్‌.

-తెలంగాణ అంటే నిలువెల్ల విషం నింపుకున్నది వైఎస్‌…

నిలువెల్ల గాయాలను మాన్పి, నిత్య వసంతం చేసింది కేసిఆర్‌.

-మా గురించి ప్రశ్నించే అర్హత వుందా?

-తోడ బుట్టిన అన్ననే దూరం పెట్టాడు. 

-ఇంకా ఏ ముఖం పెట్టుకొని వచ్చావు.

-వారసత్వంగా పంచుకోవడానికి రాష్ట్రాలేమైన ఆస్థులా?

-బయ్యారం గనుల కోసమే తెలంగాణలో రాజకీయాలా!

-మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్యూ..

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నేకొక గిరిజనబిడ్డను…ఉన్నత విద్యావంతుడను. ఉన్నతమైన ఆశయాలుకల్గిన వ్యక్తిని. సమాజంలో అట్టుడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సామాజిక వేత్తను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడిని. రెండు సార్లు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిదిని. మహబూబాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్న ఎమ్మెల్యేను. నేను చేసిన అభివృద్ధిని, దాని నమూనాను ప్రజల ముందు వుంచిన ప్రజా నాయకుడిని. అలాంటి నాపై ఆరోపణలు చేసి, నోరుంది కదా? అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, రాజకీయాల కోసం బురద జల్లిపోతా? అంటూ ఊరుకోవాలా? మర్యాద, మన్నన లేకుండా కుసంస్కారవంతమైన భాషను ఉపయోగించి, నన్ను మరో రకంగా సంబోధిస్తూ, నా నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి ప్రేలాపణలు చేస్తుంటే నవ్వుతూ చూస్తుండాలా? ఇదేనా షర్మిల నేర్చుకున్న సంస్కారం? రాజకీయాల పేరుతో యాత్రను నిర్వహిస్తూ నియోజకవర్గాలలో పర్యటిస్తూ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే విని సంబరపడమంటారా? షర్మిల ఎంతైనా మాట్లాడొచ్చా? అదే తెలంగాణ నాయకులు మాట్లాడితే తాను మహిళను అన్నది గుర్తుకొస్తందా? దేశంలో ఏ మహిళా నాయకురాలైనా షర్మిల మాట్లాడినట్లు మాట్లాడుతున్నారా? ఇంత దిజగారి వ్యాఖ్యలు చేస్తున్నారా? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం ఎక్కడైనా చూశామా? దొంగే..దొంగ అన్నట్లు 2004 ఎన్నికల ముందు ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు లేక, ఇంటిని అమ్ముకున్న రాజశేఖరెడ్డి ఐదేళ్లలో లక్ష కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ప్రజలు మర్చిపోయారా? ఆ రోజుల్లో విమర్శల పాలైంది ఎవరు? జైలు పాలైంది ఎవరు? ఎందుకు కేసులు ఎదుర్కొన్నారు? ఇవన్నీ మాట్లాడాలంటే మాకు మాటలు రావా? మేం మాట్లాడలేమా? మహబూబాబాద్‌ చూపిన రుచి మర్చిపోరాయా? ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో ఎక్కడా నా కుటుంబం మీద ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అలాంటిది నా సతీమణి గురించి మాట్లాడడాన్ని కూడా సహించమంటారా? ఒక మహిళ సాటి మహిళ గురించి మాట్లాడాల్సిన మాటలేనా? నేనూ మాట్లాడగలను? కాని నాకు సంస్కారం అడ్డొస్తోంది? అయినా రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయంగా మాట్లాడాలి. అంతే గాని వ్యక్తిగత విమర్శలు..దూషణలు…వేలం వెర్రి మాటలు..పిచ్చి కూతలు కూస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఇంకోసారి షర్మిల నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తే సహించే ప్రసక్తే లేదు. ఇంత కాలం ఆమెను పట్టించుకున్న వారే తెలంగాణలో లేరు. బిఆర్‌ఎస్‌ అసలే పట్టించుకోలేదు. దాంతో ఎలాగైనా వివాదాలను సృష్టించి మీడియాలో హల్‌ చల్‌ చేస్తేచాలు..అదే రాజకీయం అనుకునే భ్రమల్లో షర్మిల వుంది. అందుకే ఇలాంటి కూతలు కూస్తోందని అంటున్న మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్వూ…ఆయన మాటల్లోనే…!

అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, రాజకీయ అవసరాలకోసం ఎంతకైనా దిగజారే తనం..ఇదంతా షర్మిల కుటుంబానికి చెందిన అనుభవం.

అందరూ అలాగే వుంటారని అనుకుంటే పొరపాటు. 2004 ఎన్నికల ముందుకు ఎలాగైనా తెలంగాణ సీట్లు ఎక్కువ గెలిస్తే తప్ప అధికారంలోకి రాలేమని, జై తెలంగాణ అని అంటే తప్ప తెలంగాణలో ఓట్లు రావని తెలిసి, బిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చి మోసం చేసింది వైఎస్‌. బిఆర్‌ఎస్‌తొ పొత్తు పెట్టుకొని తెలంగాణలో గెలిచిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెలంగాణ వాదమే లేదని నిరూపించే ప్రయత్నం చేసి నమ్మక ద్రోహి వైఎస్‌. రాజశేఖరరెడ్డి. తెలంగాణభూములను తెగనమ్మి, తెలంగాణలో అభివృద్ధిని కుంటుపర్చి, ఆంధ్రకు నిధులను తరలించి దుర్మార్గుడు. తెలంగాణను ఎండబెట్టి, పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి, నీళ్లను రాయలసీమకు తరలించి, తెలంగాణ రైతాంగం గోస పుచ్చుకున్న వ్యక్తి వైఎస్‌. తన జీవితంలో ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా రాజకీయాలు చేసి, తన స్వార్ధం కోసం తెలంగాణను ఉపయోగించుకొని ఐదేళ్లలో లక్ష కోట్లు సంపాదించాడన్న అపవాదు ఎదుర్కొన్న నాయకుడు వైఎస్‌. ఆనాడు 2004లో ఏ వామపక్షాలతో ఆయన జతకట్టాడో వారిని కూడా నిండా ముంచి, వారి చేతే లక్ష కోట్లు దోచుకున్న వైఎస్‌ అన్న అపవాదును మోసిన నాయకుడు వైఎస్‌. ఇదీ ఆయన చరిత్ర. నీచ రాజకీయం. నూరు గొడ్లను తిన్న రాబందు నీతులు వల్లించినట్లు ఇప్పుడు తగుదునమ్మా! అని తెలంగాణ గురించి షర్మిల మాట్లాడడం విడ్డూరం. తెలంగాణ అంటే ఏమిటో తెలియదు. దాని త్యాగం తెలియదు. తెలంగాణ గోస తెలియదు. తెలంగాణ సంస్కృతి తెలియదు. తెలంగాణ బోనం తెలియదు. తెలంగాణ బతుకమ్మ తెలియదు. బోనం నెత్తినపెట్టబోతే, బొట్టు పెట్టబోతే తెలంగాణ మహిళలపై గుడ్లు పద్దవి చేసుకొని చూసిన షర్మిలనా తెలంగాణ ప్రజలకు మేలు చేసేది…తెలంగాణలో రాజకీయాలు చేసేది…చెప్పుకోవడానికి కొంచెమైనా ఇంగితం వుండాలి! 

  మహబూబాబాద్‌ లాంటి వెనుకబడిన ప్రాంతాన్ని మరింత వెనుకబాటుకు గురి చేసిందే వైఎస్‌. 

అలాంటి ప్రాంతాన్ని ఇప్పుడు సస్యశ్యామలం చేసిందే ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఎమ్మెల్యేగా నేను..అంతే కాని ఉమ్మడి రాష్ట్రంలో మహబూబాబాద్‌ పరిస్ధితి ఏమిటో ప్రజలకు తెలుసు. అమ్మ పుట్టిల్లు గురించి మేన మామ ముందు గొప్పలు చెప్పినట్లు…మహబూబాబాద్‌ గురించి షర్మిలకు తెలిందల్లా ఒక్క బయ్యారం గనులు…! మాత్రమే..ఇప్పుడు ఆమే చేసే రిజకీయమంతా అందుకే!! తెలంగాణ ఉద్యమ కాలంలో జై తెలంగాణ అన్న ఎంతో మంది ఉద్యోగులను వేధించింది ఎవరో కాదు…షర్మిల తండ్రి వైఎస్‌. ఉద్యోగులను పీడిరచింది…జై తెలంగాణ అనకుండా దారిలోకి తెచ్చుకునేందుకు ఏసిబితో దాడులు చేయించి, ఎంతో మంది ఉద్యోగులను కేసుల్లో ఇరికించిన చరిత్ర వైఎస్‌ది.

నేను తెలంగాణ వాదిగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తుండడాన్ని జీర్ణించుకోలేక, ఉద్యోగ వేధింపులను కూడా భరించాను. చివరికి ఉద్యోగం కూడా వదులుకొని తెలంగాణ కోసం ఉద్యమించాను. ఇదీ నా చరిత్ర. పిల్ల బిత్తరులంతా వచ్చి, పిచ్చి పిచ్చి ప్రేళాపణలు చేస్తే, నా ఉద్యమ చరిత్రకు చెదలు పడుతుందా? ఇరవైఏ ళ్లకిందనే లక్ష కోట్లు దోచుకున్న దొంగల కుటుంబం అని ఆరోపణలు ఎదుర్కొన్న వైఎస్‌ కూతురు షర్మిల తెలంగాణ నాయకుల మీద లేని పోని అవినీతి ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమించరు. అంతదాకా ఎందుకు ఆమె మహబూబాబాద్‌లో మాట్లాడుతన్న సందర్భంలో ప్రజలనుంచి ఎలాంటి సందన కనిపించలేదు. ఒకటికి రెండుసార్లు ప్రజలు అడిగినా ఎవరూ చప్పుడు చేయలేదు. ఆ వీడియాలను స్పష్టంగా చూస్తే నన్ను విమర్శిస్తున్న సందర్భంలో ప్రజలు ఆక్రోశంగా చూశారే…! ఆమె మాటాలకు స్పందిచలేదు. ఇది ఆమె గమనించింది. అందుకే ఇక నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిరది. 

తెలంగాణ అనే పదాన్నే మాట్లాడేందుకు ఇష్టపడని ఆ కుటంబం చేసింది ఏమిటో మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ రాళ్లకు తెలుసు. 

ఇప్పటికీ తెలంగాణ వాదులు ఆ రాళ్లకు పూజలు చేయడం తెలుసు. అలాంటి మహబూబాబాద్‌లో తనపై షర్మిల పిచ్చాసుపత్రిని నుంచి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు పట్టించుకుంటారా? ఆనాడు ఆమె తండ్రి తెలంగాణను దోచుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజల విరాళాలతో పార్టీ నడుపుతోంది. పూట గడుపుకుంటోంది. ఇంతకన్నా సాక్ష్యం మరొకటి అవసరం లేదు. తెలంగాణ మీద పడి దోచుకోవడానికి అలవాటు పడిన ప్రాణం ఊరుకోలేకపోతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చినా వారి ఆశలు చావడం లేదు. దోచుకోవడం ఆగిపోవడం జీర్ణం కావడం లేదు. షర్మిల తెలంగాణ వాది కాదు..తెలంగాణ కోసం కొట్లాడిరది లేదు. తెలంగాణకు మేలు చేసే పని ఏనాడు చేసింది లేదు. మరి ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి అసవరమైన నిధులు ఎక్కడివి? అంత సంపాదన ఎక్కడిది? ముందు ఈ సంగతి చెప్పాలి. చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకునేందు, కాలం కలిసొస్తే, చేజారిపోయిన బయ్యారం కలలు నిజం చేసుకునేందుకు తప్ప తెలంగాణ మీద ప్రేమ కాదు….ఆమె కు తెలంగాణకు సంబంధం లేదు…తెలంగాన అనే పదమే ఒక ఉద్యమ కణిక…ఎన్నేళ్లైనా దాని సెగ తగ్గేది కాదు…దోచుకునేవారికి ఇక్కడ చోటు లేదు…ప్రజలు కూడా ఇవ్వరు…! షర్మిల భ్రమల్లో బతకడం మానుకుంటే చాలు!! పిచ్చి వాగుడు వాగినందుకు తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పు!!!

జిల్లాలో కంటి వెలుగును సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు.

ఏం డోకా లేదు ఇలలోని అందాలను మేము చూడగలం… పేదల కళ్ళలో అద్దాలు ఒక వరం జిల్లాలో 20 బృందాలతో కంటి పరీక్ష లు కంటి వెలుగు కార్యక్రమము తో దురమౌతున్న కంటి సమస్యలు.

జిల్లాలో కంటి వెలుగును సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు.కంటి వెలుగుపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్న జిల్లా కలెక్టర్ 

యస్. క్రిష్ణ ఆదిత్య. 

ములుగు జిల్లా నేటిధాత్రి

 

అద్దాలు పొందిన వారి మాటల్లో ఆనందం చుక్కల మందులు ఇచ్చిండ్రు అద్దాలు ఇచ్చిండ్రు.

పెద్దల రమ వృత్తి కూలి , భర్త సాంబయ్య, శ్రీనివాస కాలనీ, ములుగు.

నా పేరు పెద్దల రమ నాకు ముగ్గురు అమ్మాయిలే కొడుకులు లేరు పెద్ద బిడ్డ బీటెక్ చదువుతుంది. ఇద్దరు బిడ్డలు తాడువాయి లో ఇంటర్ చదువుతున్నారు. దగ్గర చూపు కనపడకపోయేది కంటి వెలుగు వల్ల కంటి పరీక్షలు చేయించుకుంటే ఉచితంగా చుక్కల మందులు ఇచ్చిండ్రు అద్దాలు ఇచ్చిండ్రు అద్దాలు మంచిగా కనబడుతున్నాయి. అద్దాలు పెట్టుకుంటే సూదిల దారం పెడుతున్న… ఈ కంటి వెలుగు మంచిగ అనిపించింది.

 

ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చారు గొల్లపల్లి స్వామి వృత్తి కూలీ

 

నేను బార్దన్ షాపులో పనిచేస్తా మా ఊరు బండారుపల్లి నాకు దగ్గర చూపు కనబడకపోయేది. ఇక్కడ కంటి వెలుగు పథకంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు కూడా ఇస్తున్నారని చెప్పడంతో ఇక్కడికి వచ్చా. డాక్టర్లు కంటి పరీక్షలు చేసి, దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వడంతో గతంలో కంటే ఇపుడు చూపు స్పష్టంగా కనిపిస్తున్నది.

 

ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది.

అచ్చ సాంబయ్య, తండ్రి లక్ష్మయ్య, బంజారా కాలనీ, ములుగు.

 

ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం చాలా సంతోషం. ప్రైవేటు దవఖానాలో ఐతే శానా పైసలు అయితుండే ఈ కంటి వెలుగు లో మందులు అద్దాలు ఉచితంగా ఇచ్చిండ్రు.

 

 శేష్మ అచ్ఛా దిక్రా. మేరా నామ్ హశ్మత్, 53 వయసు గడిగడ్డ, ములుగు.

 

శేష్మ అచ్ఛా దిక్రా నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు వాళ్ళ పెళ్లిళ్లు అయిపోయినాయి. నా భార్త చనిపోయాడు. నాకు కంటి సమస్య కొద్ది నెలల నుండి ఉంది. ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోవడానికి డబ్బులు లేక చుపించుకోలేదు. కంటి వెలుగు కార్యక్రమము ప్రభుత్వం చేపట్టినదని చెప్పిడ్రు. ఉచితంగా మందులు ఇచ్చిండ్రు, అద్దాలు ఇచ్చిండ్రు. ఈ సర్కారు చల్లగా ఉండాలే. ఈ పథకంతో మాలాంటి పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

 

కంటి వెలుగు సూపర్ కే. శ్రీనివాస్, వయసు 46 దేవగిరిపట్నం.

 

కంటి వెలుగు సూపర్ నాకు పేపర్ చదువుతుంటే దగ్గర చూపు ఇబ్బందిగా ఉండేది. కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకుంటే ఉచితంగా అద్దాలు ఇచ్చిండ్రు ఇప్పుడు సూపర్ గా కనబడుతున్నాయి. కేసీఆర్ పెట్టిన కంటి వెలుగు పథకంతో కొత్తచూపు వచ్చినట్లు ఉంది. ఇంకా ఇలాంటి పథకాలు కెసిఆర్ సారు మరెన్నో చేపట్టాలి.

 

 కంటి వెలుగు గిట్లనే కొనసాగించాలే హైమావతి వయసు 45 గొల్లవాడ ములుగు

 

నాకు కంటి వెలుగు కొత్త చూపునిస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేసి మందులు, కళ్లద్దాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. కేసిఆర్ సారు కంటి వెలుగు గిట్లనే కొనసాగించాలే.

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ కంటి వెలుగు కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రజలమాట ఇక ఏం డోకా లేదు కంటి దగ్గర చూపు.. దూరం చూపు… ఇబ్బందిగా ఉండే మాకు కంటి అద్దాలు కంటి వెలుగులో ఇచ్చినవి. పెట్టుకుంటే అంత మంచిగా కనబడుతున్నాయని అంటున్నారు స్వరాష్ట్ర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా, వారి కళ్లలో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పర్యవేక్షణలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పలు శాఖల అధికారులతో సంయుక్తంగా కలిసి శిబిరాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లాలోని 9 మండలాలలో 174 గ్రామపంచాయతీలలో 3,30,031 జనాభా ఉండగా అందులో 18 సంవత్సరాలు పై బడిన జనాభా 2,08,000 మంది ఉన్నారు. వీరందరికి కంటి పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని 15 పిహెచ్ సి లలో, 20 బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన కంటి వెలుగు పరీక్షల శిబిరాలలో 68059 మందికి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో అవసరం ఉన్న 9312 మందికి అక్కడిక్కడే రీడింగ్‌ గ్లాస్ లను సైతం అధికారులు అందించారు. ప్రత్యేక అద్దాలు అవసరం ఉన్న మరో 6155 మందికి అద్దాలను అందించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపగా దానిలో నుంచి 1392 ప్రత్యేక అద్దాలను ములుగు వైద్య ఆరోగ్య శాఖకు పంపించారు. దీనిలో 661 ప్రత్యేక అద్దాలను అవసరం ఉన్న వారికి అందించారు. కంటి వెలుగు శిబిరాలలో పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలకు అద్దాలతో పాటు ఎదురవుతున్న కంటికి సంబంధించి చిన్న చిన్న సమస్యలకు మందులతో పాటు కంటిలో వేసుకోడానికి చుక్కల మందులను సైతం పంపిణీ చేస్తున్నారు.

 

కంటి వెలుగుపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద.

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును విజయవంతం చేసేందుకు ములుగు జిల్లా కలెక్టర్‌ ఎస్. క్రిష్ణ ఆదిత్య జిల్లాలో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ జిల్లా వైద్యాధికారితో పాటు ఇతర శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో కంటి వెలుగు శిబిరాలను తనిఖీలు చేపడుతూ శిబిరాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖతో పాటు అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో కంటి వెలుగు నిర్వహణలో భాగస్వాములై కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.జిల్లాలో వేగవంతంగా కంటి పరీక్షలు.ప్రజల కంటి సమస్యలను తీర్చేందుకు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో ప్రజలు కంటి పరీక్షలకు వేగవంతంగా హజరవుతున్నారు. పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేకంగా షెడ్యూల్‌ను రూపొందించుకొని జీపీ కార్యాలయాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు సోమవారం నుంచి శుక్రవారం వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరాలకు విశేష స్పందన జిల్లాలో అత్యధికంగా దగ్గరిచూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్లు శిబిరాలలో నమోదవుతున్న లెక్కలు చెబుతున్నాయి. 40 ఏళ్ల వయస్సు పైబడిన చాలామందికి దగ్గర చూపు కనిపించడం లేదని శిబిరానికి వస్తున్నారు. ఇలాంటి వారికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి, రీడింగ్ గ్లాసెస్ అందజేస్తున్నారు.

కమీషన్‌ అంటే ఆ కమీషనరే!?

` ఏ రోజు లెక్క ఆరోజే!!

`ప్రతి రోజూ కిలాసలు నిండాల్సిందే!

`లకారాలు లేనిదే ఇంటికి వెళ్లరంతే? 

`ఉద్యోగులను ఎవరినీ నమ్మడు!

`నలుగురు ప్రైవేటు వ్యక్తులతో వ్యవహారం నడిపిస్తాడు?

`సికింద్రాబాద్‌ లో అవినీతి పరాకాష్ఠకు చేరుకొని తబాదలయ్యాడు!

`ఓ మహిళా ఉద్యోగి పిర్యాధుతో ట్రాన్స్‌ ఫర్‌ తప్పలేదు.

`దీపావళి పండగ సమయంలో ఉద్యోగులకు టార్గెట్‌?

`ఆ టార్గెట్‌ ఫుల్‌ ఫిల్‌ చేయలేమని మహిళా ఉద్యోగి తిరుగుబాటు?

`ఫైళ్లకొచ్చేవి ఇస్తూనే వున్నాం…ఇంకా కావాలంటే ఆస్థులు అమ్ముకోలేం…ఇదీ ఆ మహిళా ఉద్యోగి సమాధానం!

`ఇక్కడ ఉద్యోగులను నమ్ముకోకుండా ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు!

`నగర శివారులో పదిహేనెకరాలు సంపాదించుకున్నాడు?

`నెల నెల కోట్లు కూడబెట్టుకుంటున్నాడు?

`ఎమ్మెల్యే ఎన్ని సార్లు హెచ్చరించినా తీరు మారడం లేదు?

`అడ్డూ, అదుపు లేని సంపాదన ఆపడం లేదు!

` అన్నీ ఆన్‌ లైన్‌ అనుమతులైనా సరే…అడిగినంత ముట్టజెప్పాల్సిందే!

`ఇక బిల్డర్లైతే ఏది కోరితే అది ఇవ్వాల్సిందే?

`ముగ్గు కనిపిస్తే చాలు…సంచులు పంపాల్సిందే?

`మోడల్‌ కారిడార్‌ పనుల్లో ఎంత కమీషనో అని గుసగుసలాడుతున్న ఉద్యోగులు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రజలకు మేలు చేయాల్సిన వాళ్లు, ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు, ప్రజల చెల్లించే పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల్లో కొంత మంది అవినీతి సంపాదనకు బాగా అలవాటు పడుతున్నారు. గతంలో ఇంత అవినీతి వుండేది కాదు. ఇంత పెద్ద ఎత్తున ముడుపులు తీసుకునే అవకాశం వుండేది కాదు. ఒక వేళ అవినీతి చేసేందుకు అవకాశం వున్నా, అధికారులు తప్పు చేసేవాళ్లు కాదు. లంచాలు తీసుకునే వాళ్లు కాదు. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ అధికారి గురించి విన్నా అవినీతి అన్న పదమే వినిపిస్తోంది. నేను లంచం తీసుకోను అన్న మాట మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. లంచం తీసుకునే అవకాశం లేని చోట ఉద్యోగం కూడా కావాలని కోరుకోవడం లేదు. ఏ కార్యాలయం సంపాదనకు ఆలవాలమో ముందే తెలుసుకుంటున్నారు. అలా తయారైంది వ్యవస్ధ. ఒకప్పుడు ప్రజలే తమ పని సకాలంలో ఇబ్బందులు లేకుండా పూర్తయితే ఎంతో కొంత ఇచ్చేవారు. కాని ఇప్పుడు ఆ పని చేసి పేడితే నాకేం లాభం…నాకేంత ఇస్తావు? అని నేరుగా ప్రశ్నించే అధికారులే ఎక్కవగా కనిపిస్తున్నారు. అంతే కాదు అడిగినంత ఇస్తే తప్ప పని చేసి పెట్టడం లేదు..కాదు..లేదు అన్న మాట ప్రజల నుంచి వస్తే ఇక అంతే సంగతులు… ఆ ఫైల్‌ ముందుకు వెళ్లేది లేదు. పని జరగడం అంత కన్నా లేదు. అలా తయారైంది వ్యవస్ధ. ముఖ్యంగా రియలెస్టేట్‌ విపరీతంగా పుంజుకోవడం, నగరాలలో జనాభా రోజు రోజుకూ పెరుగుతుండడంతో ప్రజల అవసరాలు ఉద్యోగులక వరాలుగా మారుతున్నాయి. లంచాలకు దారులు పరుస్తున్నాయి. లంచం తీసుకోవడం నేరమని తెలిసినా, తమను ఎవరు ఏం చేయలేరన్న ధైర్యం కూడా ఉద్యోగుల్లో పెరిగిపోయింది. ఒకప్పుడు అవినీతి నిరోధక శాఖ అంటే ఉద్యోగుల్లో అంతో ఇంతో భయం వుండేది. ఇప్పుడు అది కూడా లేదు. అసలు ఆ శాఖ ఏం చేస్తుందో కూడా తెలియకుండాపోతోంది. అటు రాజకీయ నాయకుల ప్రోద్భలం, ప్రజల బలహీనతల కారణంగా కొందరు ఉద్యోగులు ఆడిరది ఆట…పాడిరది పాటగా మారుతోంది. అవినీతి సంపాదనకు ఆలవాలమౌతోంది. ఒక్కసారి ప్రభుత్వ ఉన్నతోద్యోగం చేసే అవకాశం వస్తే చాలు..తర తరాలు కూర్చున్నా తరగతనంత ఆస్ధి సంపాదించుకునే అవకాశం ఎదురౌతోంది. ఇలా సంపాదనా పరులుగా మారిన ఉద్యోగులు ప్రజలకు దూరంగా, నాయకులకు దగ్గర వుంటూ, కోరుకున్న చోట పోస్టింగులు వేయించుకొని మరీ సంపాదనకు ఎగబడుతున్నారు. కోట్లు సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో జిహెచ్‌ఎంసిలో పనిచేసే ఓ డిప్యూటీ కమీషనర్‌ కూడా వున్నాడు. 

 అది ఒకప్పుడు గ్రామ పంచాయితీ ప్రాంతం. తర్వాత మున్సిపాలిటీ అయ్యింది. కొన్నేళ్ల క్రితం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చేరింది. ఐటి రంగమంతా ఇప్పుడు అక్కడే కనిపిస్తోంది. ఇంకేముంది ఆ పల్లె కాస్త పట్టణంగా రూపాంతరం చెందింది. ఇప్పుడు ఐటికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఒకప్పుడు ఆ ప్రాంతమంతా కాలుష్య కాసారంగా వుండేది. నగరానికి చాలా దూరం అనిపించేది. కాని ఇప్పుడు నగరంలో భాగమైంది. అసలైన నగరంగా ఆ పల్లే అభివృద్ది చెందింది. దాంతో రియలెస్టేట్‌ రంగం విసృతంగా పెరిగింది. పల్లె కాస్త ఆకాశహ్రమ్యాల నిర్మాణాలతో వెలిగిపోతోంది. అలాంటి సర్కిల్‌లో ఉద్యోగం అంటే మాటలా….మాట మాట్లాడితే చాలు మూట రావాల్సిందే…పెన్ను తీస్తే చాలు నోట్లు కనిపించాల్సిందే…సంతకం పెట్టాలంటే ప్రతి దానికి ఓ రేటు చెప్పాల్సిందే…అలాంటి సీట్లో కూర్చున్న డిప్యూటీ కమీషన్‌ సంపాదన గురించి వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే…అక్కడ పనిచేసే ఉద్యోగులు, పనుల కోసం వచ్చేవారు చెప్పే మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే…అంతే….

ఈసారు వారు ఇంతకు ముందు సికింద్రాబాద్‌ సర్కిల్‌లో పనిచేశారు. 

అక్కడ ఆయన కింద వుండే టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిని కమీషన్ల సంపాదన కోసం వేధించుకుతినేవాడట. ఓ సందర్భంలో దీపావళి పండగకు ఒక్కొ ఉద్యోగి పది లక్షలు ఇవ్వాలని హుకూం జారీ చేశాడట. దాంతో ఓ మహిళా ఉద్యోగి నా వల్ల కాదని, ప్రతి ఫైలుకు అందాల్సినంత అందిస్తూనే వున్నాం…ఇంకా లక్షలు కావాలంటే మా ఇంటిని కుదువ పెట్టి ఇవ్వాల్సిందే…నేను ఇవ్వను…ఏం చేసుకుంటారో చేసుకోండి? అని మొహం మీదే చెప్పిందట. ఈ విషయం ప్రభుత్వ పెద్ద దాకా చేరిందట. దాంతో ఆ డిప్యూటీ కమీషనర్‌ను అక్కడినుంచి నగర శివారు సర్కిల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అయితే తంతే భూరల బుట్టలో పడ్డట్టు…మంచి ప్రైమ్‌ లోకేటేడ్‌ ఏరియాగా డెవలప్‌ అవుతున్న సర్కిల్‌కు రావడంతో ఆ కమీషనర్‌కు మరింత పంట పండిరది. కమీషన్ల ఆదాయం విపరీతంగా పెరిగింది. రియల్‌ రంగం ఎంత పెరిగిందో అంత సంపాదన మొదలైంది. ఆ ప్రాంతంలో ఇల్లు కట్టు కట్టుకోవాలన్నా, ఎవరైనా ఐదంతస్తు బిల్డింగ్‌ కట్టుకోవాలంటే కమీషన్‌ ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే..అంతా ఆన్‌లైన్‌ సిస్టమ్‌లోనే ధరఖాస్తులు అని చెబుతున్నప్పటికీ, నిర్మాణంలో లొసుగులు చూపించేసి మొత్తం కూల్చేస్తే తర్వాత ఎందుకు ఇబ్బంది అని ప్రజలు కూడా ఇవ్వడం అలవాటు చేసుకున్నారు. ఆ అధికారి సంపాదనకు అందరూ సహకరిస్తున్నారు. 

 ఇక వసూళ్ల పర్వంలో ఈ అధికారి కింది స్ధాయి అధికారులను నమ్మరు…సికింద్రాబాద్‌లో ఎదురైన అనుభవంతో ఆయన ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్నారు.

 ఓ నలుగురు ప్రైవేటు వ్యక్తులకు ఆయన పనులు అప్పగిస్తారు. వారి పని నిత్యం సర్కిల్‌ పరిధిలో ఎక్కడ ఎలాంటి నిర్మాణాలు మొదలౌతున్నాయి. ఎక్కడ రిపేర్లు జరుగుతున్నాయి. ఎక్కడ నిర్మాణాలలో ఉల్లంఘనలు జరిగాయి. రోడ్లు ఎవరు ఆక్రమించుకున్నారు. ఎవరు పర్మిషన్ల కన్నా, ఎక్కువ ఫ్లోర్లు వేసుకున్నారు..పెంట్‌ హౌజ్‌లు ఎక్కడున్నాయి. వాటికి పర్మిషన్లు వున్నాయా? లేదా లాంటి వివరాలు సేకరించడం…ఆ డిప్యూటీ కమీషనర్‌కు వివరాలు అందించడం…ఇదీ నిత్యకృత్యం. ఇటు బిల్డింగ్‌ పర్మిషన్ల కోసం వచ్చే సంపాదనతోపాటు, అటు ఉల్లంఘన పేరుతో జరిగిన నిర్మాణాలపై దృష్టితో వచ్చే సంపాదన అంతా ఇంతా కాదు…నెలలో కోట్లు కూడబెడుతున్నాడని సమాచారం…

                        

                                 

                             ఇలాంటి అవినీతి అధికారిని ఎక్కడా చూడలేదు: ప్రజలు..బాధితులు

                               మా వల్ల కాదు…ఆ కమీషనర్‌ ఆగడాలు భరించలేం? అంటూ ప్రజలు , రియలెస్టేట్‌ వ్యాపారులు నేటిధాత్రిని ఆశ్రయించి, తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తాము ఎలాంటి తప్పులు చేయకపోయినా, ఉల్లంఘనల పేరుతో వేధింపులకు గురైన వారు కూడా అనేక మంది వున్నారు. ఇక పర్మిషన్ల విషయంలో ఎదురైన సమస్యలు అనేక మంది చెబుతూ, డిప్యూటీ కమీషనర్‌కు అవినీతిపై తమ బాధలు చెప్పుకుంటున్నారు. గతంలో ఎంతో మంది అధికారులను చూశాం కాని…ఇలాంటి అధికారిని ఎక్కడా చూడలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి అధికారిపై ప్రజలు చెప్పిన వివరాలతో కూడిన సమగ్ర కథనాలు వరుసగా మీ నేటిధాత్రిలో….

అంత్య క్రియలలో వివక్ష చూపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

దళిత ఎమ్మెల్యే అయినందుకేనా ఇంత వివక్ష

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ డిమాండ్.

చొప్పదండి/ నేటి ధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్      

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గత ఐదు సార్లు ఎమ్మెల్యే ఎన్నికలలో విజయం సాధించిన వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యే సాయన్న తేదీ 19.2 2023 రోజున అకాల మరణం పొందడం దళిత సామాజిక వర్గానికి తీరని లోటు అని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత బి ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దళితుడైనందుకే అంత్యక్రియలు అధికారికంగా జరపకపోవడం చాలా బాధాకర విషయం నిజాం వారసులకు, అగ్రవర్ణ నాయకులకు, సినిమా యక్టర్ల కొంతమంది మరణిస్తే ప్రభుత్వ అధికారిక లాంచనాలు చేయడం వివక్షకు నిదర్శమని, నిరంతరం 20 సంవత్సరాల నుండి ప్రజాసేవ చేసే సాయన్నకు ఒక న్యాయమా ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కుటుంబం మీద ఏలాంటి వివక్ష లేకుంటే వారి కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్యే స్థాయిలో నామినేటెడ్ పదవి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.

గండిలచపేటలొ “ప్రజా గోస-బిజెపి భరోసా”

తంగళ్ళపల్లి : నేటి ధాత్రి 

 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండిలఛ్చపేట గ్రామంలో “ప్రజా గోస-బిజెపి భరోసా ” కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. 

 సురువు వెంకట్, శక్తి కేంద్రం ఇంచార్జీ “కర్రోళ్ల బాలకిషన్” ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు ” శీలం రాజు ” హాజరై మాట్లాడుతూ గ్రామంలో నిర్మించినటువంటి సిసి రోడ్లు, రైతు వేదికలు మరియు వైకుంఠ ధామాలు లాంటి అనేక అభివృద్ధి పనులకు కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని ” కరొన ” విపత్తు సమయంలో పేదలు ఎవరు ఆకలితో అలమటించద్దని మూడేళ్లగా పేదలకు ఉచితంగా నెలకు తల 5 కిలోల బియ్యం అందజేస్తున్న ఘనత “నరేంద్ర మోడీ” గారి ప్రభుత్వాన్ని దేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీ.జే.వై.ఎం ( బీజేవైఎం )జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి ,బూత్ అధ్యక్షులు కుక్కల బాలయ్య, బత్తుల సురేష్, బామ్మగారి వెంకట్, బీజేపీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

చీర్లవంచ ప్రమాద భాదితులను కలిసిన “తోట ఆగయ్య”

చీర్లవంచ ప్రమాద భాదితులను కలిసిన “తోట ఆగయ్య”

 తంగళ్ళపల్లి : నేటి ధాత్రి 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిర్లవంచ గ్రామానికి చెందినవారు నిన్నటి రోజున జరిగిన రోడ్డు ప్రమాదం లో స్టీరింగ్ విరిగిపోయి అదుపుతప్పి బోల్తాపడ్డ వాహనం లోని 13 మంది తివ్రంగ గాయపడ్డ బాధితులను “రాత్రి” ఏరియా హాస్పిటల్ లో పరామర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు “తోట ఆగయ్య 

 ” డాక్టర్ ” సిబ్బంది తో మాట్లాడి తీవ్రంగా గాయపడ్డా వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. 

  గాయపడ్డ వ్యవసాయ కూలీలతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పి. నేను మీకు అండగా ఉన్నానని భరోసా కల్పించారు.

నేతల అక్రమ దందాల కోసమేనా గన్‌మెన్లు నేతల ముసుగు వ్యాపారులు…అండగా గన్‌ మెన్లు?

 

`ప్రభుత్వం బద్నాం తప్ప ప్రయోజనం లేదు.

`కొందరు నాయకులు ప్రజల్లో వున్నది లేదు…ప్రజాసేవ చేస్తున్నది లేదు…

`పార్టీ కోసం పని చేస్తున్నది అంతకన్నా లేదు…

`పార్టీని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు మాత్రం బాగానే చేసుకుంటున్నారు.

`గన్‌ మెన్లతో ప్రజలను బాగానే బెదిరిస్తున్నారు.

`బాధితులు దగ్గరకు రాకుండా గన్‌ మెన్ల సహకారంతో కాలం గడిపేస్తున్నారు.

`వ్యాపారాల పేరిట ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు.

`వీళ్ల వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదు…చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడంలో ఆరితేరిపోయారు.

`ప్రజల్లో పరపతి కోసం పాకులాడడం తప్ప, పార్టీకి చేస్తున్న మేలేమీ లేదు.

`ఆధిపత్య రాజకీయాలతో పార్టీకి మరింత నష్టం చేస్తున్నారు.

`ఎవరికి వారే గొప్పలకు పోతున్నారు.

` కార్యకర్తలకు పనికొచ్చింది లేదు…పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నది లేదు….

`పార్టీ పనులకు ముందట పడుతున్నది లేదు…

`పదవులు అనగానే ముందుంటారు….పని చేయమంటే వెనకుంటారు…

` ప్రధాన నాయకులు వస్తున్నప్పుడే హడావుడి చేస్తారు…

`గన్‌ మెన్లు వుంటే తప్ప గడపదాటరు…

`గత కాలం కాదు…ఇప్పటి చోటా నాయకులకు వచ్చిన ఇబ్బందేమీ లేదు…

` గతంలో నక్సలైట్ల నుంచి రక్షణ కోసం ఇచ్చేవారు…

`ఇప్పుడు గన్‌ మెన్ల అవసరం ఎందుకో స్పష్టత లేదు.

`చిట్‌ ఫండ్ల వ్యాపారులకు, రియలెస్టేట్‌ వ్యాపారులకూ గన్‌ మెన్లు…

` ప్రత్యర్థులను బెదరించేందుకు ఉపయోగపడుతున్నారు…

` సెటిల్మెంట్లలో నేతలకు రక్షణగా వుంటున్నారు.

` గన్‌ మెన్ల వ్యవస్థ దుర్వినియోగానికి కారణమౌతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నాయకులంటే ఓ నాలుగు కార్లు, నలభై మంది అనుచరులు, ఓ నలుగురు గన్‌మెన్లు అబ్బో ఆ సెటప్పే వేరు. ఎంత హోదా? ఎంత దర్పం…నాయకుడు కాలు బైట పెడుతుంటే చాలు ఆ హడావుడే వేరు…ఇంట్లోనుంచి భయలుదేరుతున్నప్పటి నుంచి మళ్లీ నాయకుడు ఇంటికి చేరుకునేదాకా ఆ హంగూ ఆర్భాటం వుంటే తేప్ప నాయకులమన్న భావన వారిలోనే వుండడం లేదు. అందుకే ఎలాగైనా అధికార పార్టీలో చేరాలి. తమ గురించి తాము చెప్పుకోవాలి. పార్టీకి ఇంత చేస్తా…అంత చేస్తా అని చెప్పాలి. పరపతి పెంచుకోవాలి. ప్లెక్సీలు కట్టాలి… పార్టీ పరమైన కార్యక్రమాలలో విసృతంగా పాల్గొంటున్నట్లు నటించాలి. గతంలో తన హోదాను పదే పదే గుర్తు చేయాలి. రాజకీయాలలో వున్నంత కాలం గన్‌మెన్లను కొనసాగించుకోవాలి. వారు ఆ నాయకుడికి రక్షణగా వుండాలి. ఇది నాయకులకు ఫ్యాషన్‌ అయిపోయింది. ఒకప్పుడు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్లు కూడా గన్‌మెన్లు వద్దనుకునేవారు. ముఖ్యంగా గుమ్మడి నర్సయ్య , సున్నం రాజయ్య లాంటి నాయకులు గన్‌మెన్లు లేకుండానే ప్రజల్లో తిరిగేవారు. ఒకప్పటి సిపిఐ, సిపిఎం. రాష్ట్ర స్ధాయి నాయకులు కూడా గన్‌మెన్లు లేకుండానే ప్రజల్లో తిరిగేవారు. కాలం మారింది. చిన్న చిన్న నేతలు కూడా గన్‌మెన్లను ఏర్పాటు చేసుకునే రాజకీయ సంస్కృతి పెరుగుతోంది. ఒకరిని చూసి ఒకరు…నాకేం తక్వువ అనుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో గన్‌మెన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. దర్పం వెలగబెడుతున్నారు. ప్రభుత్వం ఇద్దరు గన్‌మెన్లను ఏర్పాటు చేస్తే, అదే తరహాలో మరో నలుగురు ప్రైవేటు వ్యక్తులను సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వారు కూడా గన్‌మెన్లేనేమో అన్న భ్రమ కల్పిస్తున్నారు. ఇలాంటి నాయకులు తెలంగాణలో వందల్లో వున్నారు. 

 ఒకప్పుడు తెలంగాణలో గన్‌మెన్లు కావాలని నాయకులు వేడుకున్నా అప్పటి పాలకులు ఇచ్చేవారు కాదు.

 అప్పట్లో నక్సలైట్లతో అడుగడునా సమస్యే వుండేది. ఎక్కడినుంచి ఎలా దాడి చేస్తారో అన్న భయం నాయకుల్లో వుండేది. అయినా ఎమ్మెల్యేలకు, ఆ స్ధాయి నాయకులకే గన్‌మెన్లు వుండేవారు. అంతకన్నా తక్కువ స్ధాయి నాయకులకు గన్‌మెన్లను ఇవ్వకపోయేవారు. అలా నష్టపోయిన నాయకులు కూడా వున్నారు. మరి ఇప్పుడు పెద్ద నాయకులు అంటే వేరు..కాని చిన్న చిన్న నాయకులకు గన్‌మెన్లు ఎందుకు అవసరపడుతున్నారన్నదానిపై ఎవరూ దృష్టిపెట్టడం లేదు. గతంలో లాగా నక్సలైట్ల బెడద లేదు. మరే రకమైన ఇబ్బందులు లేవు. ఏవైనా వుంటే వ్యక్తిగత ఇబ్బందులు, వ్యాపారాల సమస్యలు మాత్రమే వున్నాయి. రాజకీయంగా అసలు నాయకులకు ఇబ్బందులు లేవు. ప్రతిపక్షాల పాత్ర లేదు. వారి ఊసు లేదు. వారికి బలం లేదు. ఆయా పార్టీలు పెరుగుతాయన్న నమ్మకం లేదు. మరి గన్‌మెన్లు నాయకులకు ఎందుకు అవసరమౌతున్నారు. 

 ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఓ నాయకుడికి ప్రభుత్వం గన్‌మెన్లను ఉపసంహరించింది.

దాంతో ఆ నాయకుడి వద్ద పనిచేసిన గన్‌మెన్లు కంట తడిపెట్టుకున్నారు. వారిని ఆ నాయకుడు ఓదార్చడం అన్నది పెద్ద సంచనలంగా మారింది. అసలు గన్‌మెన్లు ప్రభుత్వ ఉద్యోగులు. వారు ఎవరి వద్ద డ్యూటీవేస్తే వారికి రక్షణ కల్పించాలి. అంతే కాని నాయకుడికి గన్‌మెన్లను తొలగిస్తే, ఆ గన్‌మెన్లు ఏడ్చేంత పరిస్ధితి ఎందుకొస్తుంది. నాయకుడిమీద వారికి గౌరవం వుండొచ్చు. అలాంటప్పుడు ఉద్యోగం వదిలి ఆయనకు అనుచరులు చేరాలి. అంతే కాని ఇలా పోలీసు వ్యవస్ధను భ్రష్టు పట్టించకూడదు. ఇదిలా వుంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా గన్‌మెన్‌ వ్యవస్ధను వినియోగించుకొని నాయకులు చేస్తున్న ప్రజా సేవ కన్నా, వ్యాపారాలే ఎక్కువ. గతంలో నాయకుడంటే పూర్తి స్ధాయిలో నాయకత్వమే వుండేది. కాని ఇప్పుడు నాయకుడు ఖచ్చితంగా ఏదో ఒక వ్యాపారం చేయాలి. రియలెస్టేట్‌ రంగంలో ఆరి తేరాలి. ఇతర వ్యాపారాల వ్యాపకాలు వుండాలి. అప్పుడే ఆ నాయకుడికి పరపతి అన్నంతగా మారిపోయింది. చిన్న చిన్న నాయకుడు కూడా రాజకీయల్లో వుండాలన్నా, పదవుల పందేరలంలో ముందు వరసలో నిలబడలన్నా, తూకలంలో పదవులు కొనుక్కొవాలన్నా అంగబలం, ఆర్ధబలం ఎంతో అవసరం. ఇదే ఇప్పటి నాయకుల్లో వుండాల్సిన అసలైన క్వాలిటీ…కాని కొందరు నాయకులు అటు ప్రజలకు దగ్గరగా వుంటున్నది లేదు. ప్రజా సేవ చేస్తున్నది లేదు. పార్టీల కోసం పనిచేస్తున్నది లేదు. పార్టీల బలం పెంచేందుకు దోహదపడుతున్నది లేదు. కాని పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు హంగూ, ఆర్భాటం కావాలి. ముందూ వెనక మందీ మార్భలం కావాలి. అందులో నలుగురు గన్‌మెన్లు వుండాలి. ఇదంతా ప్రజా సేవ కోసం అనుకునేరు! కాదు…వ్యాపారం కోసం…వ్యాపారంలో నెంబర్‌ వన్‌ కావడం కోసం..వ్యాపారంలో పోటీ లేకుండా చూసుకోవడం కోసం… అవసరమైతే మోసం చేయడం కోసం… తనకు ఎవరూ ఎదురు తిరగకుండా వుండడం కోసం…

ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వుంటున్నట్లు నటించే చాలా మంది నాయకులు రియలెస్టేట్‌లతోపాటు, చిట్‌ఫండ్‌ వ్యాపారాలు బాగా సాగిస్తున్నవారే వున్నారు. 

వారికి ప్రజల నుంచే తిరుగుబాటు ఎదురౌతున్న సందర్భాలుంటున్నాయి. అందువల్ల వారిని నుంచి తప్పించుకోవడం కోసం, ప్రజలు వారి దరి చేరకుండా వుండడం కోసం, ప్రజలు ఆ నాయకుల వద్దకు రావడానికి కూడా భయపడపడడం కోసం గన్‌మెన్లు ఉపయోగపడుతున్నారు అన్న అపవాదులున్నాయి. ఇక రియలెస్టేట్‌ వ్యాపారాల్లో జరిగే లావాదేవీలలో గన్‌మెన్లను ముందు పెట్టి పనులు పూర్తి చేస్తున్న నాయకులు కూడా చాలా మందే వున్నారు. గన్‌మెన్ల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారన్నది భహిరంగ రహస్యమే…ఇందుకేనా గన్‌మెన్ల వ్యవస్ధ వున్నదీ? అన్నది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేతలతో ప్రభుత్వం కూడా బద్నామౌతుందన్న మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పార్టీలకు చెందిన నేతలే కొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ఓ పదవి నిర్వహించిన నాయకులు ఇప్పటికీ గన్‌మెన్లు రక్షణలో వుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి నాయకులకు గన్‌మెన్లను తొలగించడమే మేలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా చిట్‌ఫండ్‌ వ్యాపారాల్లో వున్న నాయకులు చేస్తున్న మోసాలను గన్‌మెన్ల సహకారం బాగా ఉపయోగపడుతోందన్నది స్వరత్రా వినిపిస్తున్న మాట. అలాంటి నాయకులతో అమాయకులైన ప్రజలు ఎంతో మంది మోసపోతున్నారు. చిట్టీలు వేసి సర్వం కోల్పోతున్నారు. ఇలా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే నాయకులను గుర్తించి వారికి వున్న గన్‌మెన్లను తొలగించాల్సిన అవసరం వుంది. లేకుంటే ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వచ్చే ప్రమాదముంది.

నయా మాఫియా! రియల్‌ ఫైట్‌!!

 

`రియల్‌ రంగంలో సరికొత్త దందా.

`వెంచర్ల మీద దాడులు…

`వెంచర్లే టార్గెట్‌…

`ఆక్రమణలకు దిగుతున్న సరికొత్త రియల్‌ వ్యాపారం…

`దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురిచేయడం…

`భయపడతారో లేదో అని ట్రయల్‌ వేయడం…

`ఏ మాత్రం వణికినా వెంచర్‌ ని అధీనంలోకి తీసుకోవడం…

`కొన్న వారి గురించి అవసరం లేదు!

`అమ్మిన వారిని భయపెట్టిస్తే చాలు…

`వెంచర్‌ లాక్కునే ఎత్తుగడలు…

`కొందామంటే భూములు లేవు…

`అమ్ముదామంటే వెంచర్లు లేవు…

`ఏర్పాటైన వెంచర్లలో పాగా వేస్తే చాలు…

`బలం ప్రదర్శిస్తే చాలు…

`నిన్నటి దాక పక్కోడి భూములు లాక్కునేవారు…

`ఇప్పుడు వెంచర్లే ఆక్రమించుకునేందుకు చూస్తున్నారు…

`అక్రమ ఆక్రమణ దౌర్జన్యాలపై సిపి. రంగనాథ్‌ ఉక్కు పాదం మోపుతున్నారు…

`భూముల వ్యవహారాలు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో కొత్త తరహా మోసానికి కొందరు తెరతీస్తున్నారు…

`కింది స్థాయి పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆరోపణలు…

`తాజాగా రాంపూర్‌ లో జరిగిన ఘటనే సాక్ష్యం…

`ఇంత వరకు కేసు నమోదు చేయకపోవడంతో అనుమానాలకు ఊతం…

`సిపి.గారు ఇలాంటి వాటిపై ఒక్కసారి దృష్టి పెట్టండి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని పెద్దలు ఊరికే అనలేదేమో! 

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దిక్కుమాలిన మార్గాలన్నీ అన్వేషిస్తోంది….బెదిరింపులు, దౌర్జన్యాలతో పాటు, ఏకంగా వెంచర్లే ఆక్రమించుకునే జిత్తుల మారి పోకడలు మొదలయ్యాయి. ఇంత కాలం రైతుల భూములు, అమాకుల భూములు లాక్కున్నారు…ఆక్రమించుకున్నారు…కబ్జా చేశారు…అనే వార్తలే వింటూ వస్తున్నాం…ఇప్పుడు ఆ దశ దాటింది….గత్యంతరం లేని పరిస్థితి ఎదురౌతోంది. నగరానికి దగ్గరలో భూములు అమ్మకానికి లేవు…కొనుగోలు లేదు…సాగు మాట దేవుడెరుగు నివాసాలకు నగరానికి దగ్గరలో జాగలే లేవు…రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు పని లేదు…బిజినెస్‌ లేదు…లక్షలు, కోట్ల సంపాదన చూసిన వారికి చిల్లి గవ్వ రావడం లేదు…భూముల జాడలు లేవు…వెంచర్లేద్దామంటే దొరకడం లేదు….మరి ఏం చేద్దాం… చినమాయను, పెద్ద మాయ మింగడమే అని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన దారిని ఎంచుకున్నారు…ఇప్పటికే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, అమ్మకానికి సిద్దంగా వున్నా సరే…అమ్ముడు పోయినా సరే వెంచర్లో అడుగుపెడితే సరి…దౌర్జన్యం చేస్తే సరి… ఆక్రమించుకుంటే సరి…. వెంచర్‌ నాదేనని ఏవో పాత కాగితాలు చూపిస్తే సరి….బలం, బలగం వుంటే సరి…అవతలి వ్యక్తి భయపడితే మరీ మంచిది..ఇంకే ముంది…కన్ను పడిన వెంచర్‌ మనదే…పెత్తనం లాక్కోవడమే…అసలైన వారిని తరిమేయడమే…ఇదే ఇప్పుడు మొదలైన అసలు సిసలైన రియల్‌ ఫైట్‌….

వరంగల్‌ సమీపంలోని రాంపూర్‌ లో సర్వే నెం. 558/A, 560/A లో 4 ఎకరాల 4 గుంటల స్థలాన్ని ఇద్దరు రియల్‌ వ్యాపారులు డెవలప్మెంట్‌ చేశారు. 

అన్ని రకాల అనుమతులు పొందారు. భూమి చదును చేశారు. ప్లాట్ల హద్దులు ఏర్పాటు చేశారు. అవసరమైన రోడ్లు వేయించారు. కరంటు సౌకర్యం కల్పించారు. వెంచర్‌ ఏర్పాటు చేశారు. అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. అనుకోకుండా కొందరు వ్యక్తులు ఇటీవల ఆ వెంచర్‌ లోకి చొరబడి నానా బీభత్సం సృష్టించారని తెలిసింది. వెంచర్‌ లో విద్యుత్‌ వైర్లు కట్‌ చేశారు. హద్దు రాళ్లు తొలగించారు. రోడ్లు ధ్వంసం చేశారు. వెంచర్లో టెంటు ఏర్పాటు చేసి ఈ స్థలం మాదీ అని డిపార్ట్మెంట్‌ చేసిన వారిని బెదిరించారు. వెంటనే వెంచర్‌ ఖాళీ చేసి వెళ్లిపొమ్మని దౌర్జన్యానికి దిగారు. దాంతో వెంచర్‌ డెవలపర్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఆ స్థలం డెవలప్మెంట్‌ చేసిన వారి వద్ద పూర్తి డాక్యుమెంట్లు వున్నాయి. అన్ని రకాల అనుమతులు వున్నాయి. ఆ స్థలానికి చెందిన కొత్త పాస్‌ పుస్తకాలున్నాయి. కానీ కొందరు ఆ స్థలం మాదని రావడం, డెవలప్మెంట్‌ చేసిన వారిని బెదిరింపులకు, భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసులు రావడం వివరాలు సేకరించడం, దౌర్జన్యం చేసిన వారి వద్ద సరైన ఆధారాలు లేవని తేల్చారు. వారిది తప్పని ఒప్పించారు. కానీ ఇంతవరకు వారిపై కేసు నమోదు చేయలేదు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సౌకర్యాలను నాశనం చేశారు. ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదన్న దానిపై సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. అక్రమ దారుల దాడులు వెంచర్లకు చేరితే రియలెస్టేట్‌ వ్యాపారం దారి తప్పే ప్రమాదం వుంది. అందుకే వరంగల్‌ సిపి. రంగనాధ్‌ వివరాలు తెలుసుకొని వెంచర్‌ మీద దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. సిపి. రంగనాధ్‌ ఇంత స్టిక్ట్‌ గా వున్నప్పటికి కొందరు పోలీసు అధికారుల వల్ల డిపార్ట్మెంట్‌ కు వస్తున్న మంచి పేరు, ఇలాంటి సంఘటనల వల్ల తగ్గే అవకాశం వుంది. నిజా నిజాలు నిగ్గు తేల్చి బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఏర్పడిరది. 

 

వరంగల్‌ సిపిగా రంగనాధ్‌ వచ్చాక నగరంలో చాలా వరకు శాంతి నెలకొంది. తర,తమ అనే భేదం లేకుండా తప్పు చేసిన వారెవరైనా సరే వారిని వదలిపెట్టడం లేదు. ఇలా గతంలో ఎప్పుడు ప్రజలు చూడలేదు…ముందు ప్రక్షాళన డిపార్ట్మెంట్‌ నుంచే మొదలుపెట్టారు. అవినీతి అధికారుల భరతం పట్టాడు. డిపార్ట్మెంట్‌ పరువు తీసిన వారి పని పట్టాడు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన వారిని పక్కనపెట్టాడు. ప్రజలను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులను సక్రమ మార్గంలో పెట్టారు. ముందు ఇళ్లు శుభ్రం చేసిన సిపి. సమాజంలో ప్రజలను వేధించిన వారిని ఆరేశాడు… ప్రజల భూములు ఆక్రమించుకున్న వారి భరతం పట్టాడు. ఏ పార్టీ నాయకుడైనా సరే తప్పు చేస్తే క్షమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశాడు. ప్రభలకు అండగా వుంటున్నాడు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా సాగుతున్నారు. మాకు అన్యాయం జరుగుతోందని ఎవరు కంప్లైంట్‌ చేసినా, చిన్న మెసేజ్‌ చేసినా స్పందిస్తున్నారు. బాధితులకు న్యాయం చేస్తున్నాడు. గతంలో పోలీసు అధికారులను జనం గొప్పగా పొగిడిన సందర్భాలే చూశాం…కానీ ఇప్పుడు సిపి. రంగనాధ్‌ చిత్ర పటానికి కు ప్రజలు పాలాభిషేకం చేయడం చూస్తున్నాం…పదేళ్ల నుంచి నలుగుతున్న సమస్యైనా సరే పది నిమిషాలలో పరిష్కరిస్తున్నారు. తాజాగా ఓ మైనారిటీకి చెందిన వ్యక్తి భూమిని ఓ పార్టీ నాయకుడు ఆక్రమించడంపై పిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగి బాధితుడికి న్యాయం చేశారు.ఇలా బాధితులకు అండగా నిలుస్తున్నారు. పోలీసు వ్యవస్థ మీద మరింత నమ్మకం పెంచుతున్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజున అనాధపిల్లలకు పాలు, పండ్లు పంపిణీ చేసిన 51 మంది గృహ నిర్మాణ శాఖ బాధితులు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు సందర్భంగా గృహ నిర్మాణ శాఖ నుంచి తొలగించబడిన 51 మంది బాధితులు అనాధ పిల్లలకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసిఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు. కేసిఆర్ కారణజన్ముడని కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం పద్నాలుగేళ్లు నిర్విరామ పోరాటం సాగించి, తెలంగాణ సాధించి, పాలకుడిగా బంగారు తెలంగాణ నిర్మాణం చేసిన కేసిఆర్ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ పయనిస్తున్న ప్రగతి శీల మార్గంలోనే దేశం కూడా పయనించాలని కోరుకుంటున్న కేసిఆర్ దేశ రాజకీయాలలో మార్పులు తీసుకొచ్చి, అభినవ భారత నిర్మాణం చేపట్టి, ప్రపంచంలోనే భారత్ ను శక్తి వంతమైన దేశంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. తమ జీవితాలను కూడా నిలబెట్టాలని కోరుకున్నారు. తమను విధుల్లోనుంచి తొలగించి ఆరేళ్లు గడుస్తున్నాయని, మంత్రి కేటిఆర్ తమకు తప్పకుండా దారి చూపిస్తారనే నమ్మకం వుందన్నారు. తమకు ఇప్పటికే మంత్రి కేటిఆర్ మాట ఇచ్చారని, త్వరలో తమకు మంచి రోజులొస్తాయని వారు‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

భావితరం భవితవ్యం…కేసిఆర్‌ నాయకత్వం.

 

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా బిఆర్‌ఎస్‌ విధానాలపై కట్టా రాఘవేంద్రరావు ప్రత్యేక విశ్లేషణ…

`దేశంలో విప్లవాత్మక ప్రగతి విజయాలు కేసిఆర్‌ తోనే సాధ్యం.

`తెలంగాణలో కనిపిస్తున్న అభివృద్ధి దేశానికి అన్వయం…

` రైతు రాజ్య స్థాపనే ధ్యేయం…

`కల్తీ లేని ఆహారం, ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం…

`సాగు రంగంలో నూతన ప్రపంచం…

` నీటి పారుదల రంగానికి విసృత ప్రాధాన్యం…

`దేశం సుభిక్షంగా జాతి మనుగడకు శుభోదయం…

`పాడి, పంటలు సమృద్ధి కోసం…

`పారిశ్రామిక పరుగుల సాదృశ్యం…

`విద్యుత్‌ వెలుగులు ముఖ్యం…

`వ్యవసాయ ఉత్పత్తులలో నూతన ఆవిష్కారం…

`పారిశ్రామిక విధానంలో సరికొత్త మార్గం…

` అన్ని రంగాలలో అద్భుతాల కోసం ప్రయత్నం…

` తాగు నీటి కల్పనకు నిశ్చయం….

`శీఘ్ర గతిన సమగ్ర ఫలితాలే ఇప్పుడు అవసరం…

` దేశమంతా ఉచిత విద్యకు శ్రీకారం…

` ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలకు మార్గనిర్దేశం…

`భావి భారత సమాజం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడడం. 

` ఇదే కేసిఆర్‌ లక్ష్యం… అందుకే బిఆర్‌ఎస్‌ నిర్మాణం.

పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు అని జాతిపిత మహాత్మా గాంధీ అన్నాడు…తెలంగాణ పిత కేసిఆర్‌ ఆచరిస్తున్నాడు…తెలంగాణ ను పాడి పంటలకు స్వర్గసీమ చేశాడు…పల్లెల రూపురేఖలు మార్చాడు… తెలంగాణ పల్లెల్లోనే ప్రగతి జీవన వేధాన్ని రంగరించాడు..ఇప్పుడు దేశమంతా ప్రగతి శీల పల్లెలుగా తీర్చిదిద్ది, సువిశాల భారతం సస్యశ్యామలం చేయడానికి కేసిఆర్‌ సంకల్పించాడు. సుసంపన్నమైన భారతావణి నిర్మాణానికి బయలుదేరాడు. తెలంగాణ పిత ముఖ్యమంత్రి కేసిఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ అందిస్తున్న ప్రత్యేక కథనం…’

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఉద్యమ నాయకుడిగా కేసిఆర్‌ వేసిన అడుగు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. ఆయన పోరాటంతో తెలంగాణ సాకారమైంది. ఆయన నేతృత్వంలో తెలంగాణ సస్యశ్యామలమైంది. సుభిక్షమైంది. సమస్యలు లేని తెలంగాణ నిర్మాణమైంది. తాను కలలుగన్న తెలంగాణ ప్రజల హృదయాలలో గూడు కట్టుకున్న బంగారు తెలంగాణ ఆవిష్కృతమైంది. ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తోంది…రేపు దేశం అనుసరించేందుకు సిద్దపడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం దేశం కోరుకుంటోంది. తెలంగాణ సాధనే కాదు, ఎనమిదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, దేశం మొత్తం జరగాలని కోరుకుంటోంది. అందుకే దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. అసలు ఊహకలందనంత ప్రగతిని సాధించిన తెలంగాణ అన్ని వనరులున్నా, గతంలో పాలకులు చేసిన నిర్లక్ష్యం మూలంగా ఒక తరమే శాపగ్రస్ధమైంది. గోసను అనుభవించింది. ఇప్పుడు దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా కీర్తింపబుతోంది. ఆర్ధిక వృద్ధి రేటు పెరిగింది. దేశ జిడిపికన్నా తెలంగాణదే ఎక్కువ వుంది. ఒకనాడు ఉపాధి కరువై, పాలమూరు లాంటి జిల్లాలు పాడుబడిన గ్రామాలతో బెంగటిల్లింది. ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి, చెట్టుకో దారి, పుట్టకోదారి అన్నట్లు వలస పక్షుల్లా ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి బతికారు. కాని కాలం మారింది. కేసిఆర్‌ శకం మొదలైన నుంచి తెలంగాణలో మార్పులు మొదలయ్యాయి. ఎప్పుడైతే కేసిఆర్‌ జై తెలంగాణ అని నినదించడం మొదలు పెట్టారో అప్పటినుంచి అభివృద్ధి ఛాయలు మొదలయ్యాయి. అయినా నాటి పాలకులకు ఆ మాత్రం తెలంగాణ ప్రగతి కూడా ఇష్టం లేకుండాపోయింది. దాంతో తెలంగాణ సాధన కోసం కేసిఆర్‌ పోరాటం, తెలంగాణ ప్రజల ఆరాటం ఉద్యమ రూపం సంతరించుకొని, సకల జనుల గొంతుక ఒక్కటై నినదించింది. జై తెలంగాణ అన్న పదం మారు మ్రోగింది. ఒక్కడుగా మొదలైన కేసిఆర్‌ ఉద్యమ ప్రస్ధానం తెలంగాణలో కొన్ని కోట్ల గొంతుకలైంది. కొన్ని లక్షల మంది తెలంగాణ సైనికులను తయారు చేసింది. పసి పిల్లాడి నుంచి పండు ముసలి దాకా జై తెలంగాణ అన్నదే వినపడిరది. నాటి పాలకులకు తెలంగాణ ఇవ్వని పరిస్ధితి ఎదురైంది. కేసిఆర్‌ సంకల్పం విజయం సాధించింది. తెలంగాణ వచ్చింది. ప్రగతి వైపు కేసిఆర్‌ నేతృత్వంలో తెలంగాణ అడుగులు పడిరది. ఇప్పుడు పరుగులు పెడుతోంది. దేశానికి ఆదర్శంగా నిలించింది. అలాంటి తెలంగాణ ఇప్పుడు దేశానికి రోల్‌ మోడలౌతోంది. కేసిఆర్‌ నాయకత్వం దేశానికి కావాలని ప్రజలు నినదిస్తున్నారు. కేసిఆర్‌ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నారు. అందుకే తెలంగాణ అభివృద్ధిని దేశానికి అన్వయించి, అన్ని రంగాల్లో దేశాన్ని పురోగమించేలా చేయడానికి కేసిఆర్‌ మరో సంకల్పం చేపట్టాడు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే యజ్ఞం చేయనున్నాడు. దేశానికి మరో కొత్త యుగాన్ని అందించనున్నాడు. భవిష్యత్‌ తరం బంగారు మయం చేయనున్నాడు. 

  రైతంటే కేసిఆర్‌కు ఎంతో ఇష్టం.

 స్వతాహాగా ఆయన కూడా ఒక రైతే కావడం విశేషం. సాగు కోసం ఒకనాడు తెలంగాణ పడిన కష్టం కళ్లారా చూశాడు. రైతులు పడుతున్న గోస తాను అనుభవించాడు… చుక్క నీరు లేని తెలంగాణ నిత్యం రైతు కన్నీటి చుక్కలతో తడవడం చూసి చలించిపోయాడు. తాను కొన్నిసార్లు కన్నీటిపర్యంతమయ్యాడు. తెలంగాణ తలాపున గోదారి పారుతున్నా ఉత్తర తెలంగాణ ఎందుకు ఎండుతోంది? పక్కనుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా దక్షిణ తెలంగాణ ఎందుకు నీరులేకుండా గొంతెండుతోంది? అని మధనపడ్డాడు. తెలంగాణలో పారుతున్న నీళ్లను మళ్లించి, తెలంగాణ బంగారు భూమి చేయాలని అనుకున్నాడు. నాటి పాలకులకు చెప్పాడు. వారు వినిపించుకోలేదు. కనికరించలేదు. తెలంగాణ రైతుగోస తీర్చేందుకు నాటి పాలకులు ముందుకు రాలేదు. ఆ కసిలో నుంచి పుట్టిన తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ సాధించి ఎక్కడైతే నీటి చుక్క పారలేదో అక్కడే ఇప్పుడు నీటి పరవళ్లు చూపించాడు. సాధ్యం కాదన్న చోట్లే కాళేశ్వరం నిర్మాణం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చాడు. దేశంలో తెలంగాణలాగా నీటి వనరులెన్నో వున్నా, చుక్క నీటికి దిక్కులేకి భూములు బీడులైపోవడాన్ని కేసిఆర్‌ చూశాడు. రైతుల కష్టం తీర్చేందుకు నడుంబిగించాడు. ఇటు తెలంగాణ అభివృద్ది చేస్తూనే, దేశ ప్రగతి కోసం ఆలోచన చేశాడు. ముందు తెలంగాణ ప్రగతిని చూపించి, దేశ గతిని మార్చే ప్రణాళిక సిద్దం చేయాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే దేశం తెలంగాణ పాలనవైపు చూసేలా చేస్తున్నాడు. ప్రపంచంలో ఇంత తక్కువ కాలంలో జరిగిన ప్రగతి ఎక్కడా లేదని చూపించాడు. అందుకే దేశం ప్రగతిలో రైతుభాగస్వామి అయితే తప్ప, భవిష్యత్తు లేదన్న సత్యాన్ని రుజువు చేసి చూపించాడు. సాగుతో వున్న భూమికి విలువెక్కువ. బంగారు పంటలు పండే భూమికి ధరెక్కువ. ఒకప్పుడు వేల రూపాయల ధరలేని తెలంగాణ భూములు కోట్లుకు చేరుకున్నాయి. రైతును రాజును చేశాయి. అదే తరహాలో దేశంలోని అన్ని ప్రాంతాల భూములు బంగారు మయం కావాలి. దేశమంతా ధన రాసులు పండాలి. సస్యశ్యామల భారతం విరాజిల్లాలి. ఇది తొలిమెట్టు…తెలంగాణ ఎలా ఒక్కొమెట్టు ఎక్కుతూ, నాలుగేళ్లలో బంగారు తెలంగాణ సాకారం ఎలా జరిగిందో…దేశమంతా అదే విధంగా మారాలి. అవసరమైన చోట ప్రాజెక్టులు రావాలి. వాటితో భూములు సస్యశ్యామం కావాలి. ఆ నీటితో జల విద్యుత్‌ ఉత్పాదన జరగాలి. దేశమంతా వెలుగులు నిండాలి. ఇదంతా దేశం చూడాలి. అందుకు కేసిఆర్‌ నాయకత్వం దేశానికి కావాలి. 

 ఎటు చూసినా కల్తీ…దేశంలో సమృద్ధికరమైన వ్యవస్ధ లేక, చాలీ చాలని పంటల మూలంగా ప్రతిదీ కల్తీ జరుగుతుంది. 

తాగే పాల దగ్గర నుంచి తినే తిండి దాకా అన్నీ కల్తీయే…దాంతో ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. అనారోగ్యాల పాలై విగతజీవులౌతున్నారు. అలాంటి పరిస్ధితి నుంచి దేశాన్ని కాపాడాలి. దేశమంతా సమృద్ధికరమైన పంటలు పండాలి. మనకే కాదు, అవసరమైతే ఎగుమతులు చేసేంత సాగు విప్లవం జరగాలి. ప్రపంచంలోనే ఏ దేశంలో లేనంత నీటి సంపద మన దేశంలో వుంది. దేశం నలువైపుల నదుల పారకం జరుగుతోంది. వాటిని ఒడిపి పట్టాలి. ఆ నీటిని పొలాలకు మళ్లించాలి. సమృద్ధికరమైన అన్ని రకాల పంటలకు భారత్‌ కేంద్రం కావాలి. అంతే కాకుండా దేశంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టాలి. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కోతలు అంటే చెప్పనలవి కానిది. కాని ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై నాలుగు గంటల కరంటు సరఫరాతో తెలంగాణలో పారిశ్రామిక ప్రగతిలో కీలకమైంది. ఒకనాడు పవర్‌ హాలీడేస్‌తో కునారిల్లిన పారిశ్రామిక రంగం ఇప్పుడు దూసుకుపోతోంది. తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో ముందు వరసులో వుంది. అంతే కాకుండా దొంగలు దోచలేని, నిప్పు కాల్చలేనిది విద్య ఒక్కటే…ఆ విద్య సామాన్యులకు అందక దేశంలో ఎంతో మంది విద్యకు దూరమౌతున్నారు. చదువుకోవాలన్న తపన వున్నా, చదవించే స్ధోమత లేక ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కూలీ పనులకు పంపిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఉపాది కోసం ఉత్తరాధి నుంచి వచ్చిన యువతే కనిపిస్తున్నారు. వారికి ఆయా రాష్ట్రాలలో విద్యావకాశాలు లేక, ప్రభుత్వాలు విద్యపై సరైన శ్రద్ద చూపకపోవడం కూడా యువతకు శాపంగా మారింది. కనీసం పది కూడా చదువుకోలేని పరిస్ధితులు వున్నాయి. తల్లిదండ్రులకు ఉపాధి లేక, సాగు చేయలేక, పిల్లలను పోషించలేక, వారి చేత కూలీ పనులు చేయిస్తున్నారు. దేశానికి పనికొచ్చే ఎంతో మంది పిల్లలు యుక్త వయసు రాకముందే కూలీలుగా మారుతున్నారు. ఈ పరిస్ధితి మారాలి. దేశమంతా ఉచిత విద్య అందరికీ అందుబాటులోకి రావాలి. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ గురుకులాలు ఏర్పాటు చేసి, అందిరకీ చదువు అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణను విద్యా నిలయంగా మార్చాడు. ఇప్పుడు దేశమంతా సరస్వతీ నిలయం కావాలి. అందరికీ ఉచిత విద్య అందాలన్నదే కేసిఆర్‌ లక్ష్యం…

 ఇక సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజం దేశమంతా ఏర్పడాలి. 

 తెలంగాణలో ఎలాగైతే ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారో అలాగే దేశంలో కూడా ప్రజలకు ఉచిత వైద్యం అందించాలన్నదే కేసిఆర్‌ నిర్ణయం. ఆ దిశగా కూడా అడుగులు పడాలంటే కేసిఆర్‌ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. ఇదే రేపటి దేశ భవితకు తార్కాణం…దేశమంతా కేసిఆర్‌ రాక కోసం ఎదురుచూస్తున్న తరుణం.

ప్రభుత్వ వైద్యం…తెలంగాణలో సరికొత్త లోకం.

`విప్లవాల పరంపర.

 `విజయాలు తెలంగాణ ముంగిట.

`కేసిఆర్‌ కలల రూపం…సాక్ష్యాత్కారం..

`తెలంగాణ ఆవిష్కారం…బంగారు తెలంగాణ నిర్మాణం.

`ఎనమిదేళ్లలో కేసిఆర్‌ సంక్షేమ పాలన అద్భుతం.

`మొన్న జల విప్లవం,

`నిన్న సాగు విప్లవం,

`నేడు విద్యా విప్లవం,

`రేపు వైద్య విప్లవం,

`అన్ని రంగాలలో అద్భుత ప్రగతి.

` హరీష్‌ రావు నేతృత్వంలో జలయజ్ఞం…

`మూడేళ్లలో కాళేశ్వరం జల విజయం.

`హరీష్‌ రావుకు కాళేశ్వరరావుగా సరికొత్త నామకరణం.

`హరీష్‌ రావు ఆధ్వర్యంలో వైద్య రంగంలో అనూహ్య ఫలితాలు.

`జిల్లాకో మెడికల్‌ కాలేజీ, అనుబంధంగా మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌.

` వరంగల్‌ నగరానికే తలమానికంగా శరవేగంగా సరికొత్త ఆసుపత్రి నిర్మాణం.

`హైదరాబాద్‌ కు నలువైపులా నాలుగు ఆసుపత్రులు.

`ఏటా వేలాది మంది వైద్యుల సేవల అందుబాటులోకి….

`ఇటు బస్తీ దవఖాలు…అటు ప్రతి పల్లెలో వైద్య సేవలు.

`రానున్న రోజుల్లో ప్రభుత్వ వైద్యానికి స్వర్గసీమ తెలంగాణ.

`ఆరోగ్య వంతమైన తెలంగాణ భరోసా

` త్వరలో ప్రైవేటు వైద్యం కనుమరుగయ్యే తరుణం.

`ఇప్పటికే పలు జిల్లాలలో హోటళ్లుగా మారుతున్న ప్రైవేటు ఆసుపత్రులు.

`భవిష్యత్తులో పూర్తి ఉచిత ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి…

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణలోవైద్య విప్లవం ఆవిష్కృతమౌతోంది. అటు పల్లెలనుంచి మొదలు, పట్టణాల్లో బస్తీ దవఖానాలు అన్నవి ఊహలకందని వైద్యసదుపాయాలు అందుతున్న ఏకైక రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలోతెలంగాణలోవైద్యం మృగ్యం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పాట వినిపించిన నేలలో నేడు, ప్రభుత్వ వైద్య సేవలు తప్ప ప్రైవేటు సేవల కోసం ఎవరూ చూడడం లేదు. ఇప్పటికే తెలంగాణలో పేద వర్గాలన్నీ ప్రభుత్వ వైద్య సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో వున్న అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా టెస్టులు కూడా చేస్తున్నారు. జిల్లా ఆసుపత్ల్రుల్లో అధునాతమైన వైద్య పరికారాలు అందుబాటులోకి తెచ్చారు. ఊహించని ఆపరేషన్లు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో చేపడుతున్నారు. ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలల రూపంలో ఒక అద్భుత ఆవిష్కారం…వైద్యం పేదలకు అందుబాటులోకి తెచ్చిన సాక్ష్యాత్కారం. తెలంగాణలో విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు కొదువ లేకుండా చేయడంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చూపిన చొరవ ప్రపంచమంతా కీర్తిస్తోంది. పద్నాలుగేళ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత సిద్ధించిన తెలంగాణలో ఉద్యమ కాలం నాటి నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇప్పుడు విద్య, వైద్య రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఒకనాడు తెలంగాణ అంటే ఎండిన బీడులు…పల్లేర్లు మొలిచిన పొలాలు…సాగుకు పనికి రాకుండాపోయిన భూములు…కనీసం వర్షాధారపంటలకు కూడా దిక్కులేని రోజులు…పంట పొలాలలో ఎండిన పంటలు, రైతు కన్నీళ్లు తప్ప, బావుల్లో చుక్క లేని రోజులు. ఎన్ని బోర్లు వేసినా చుక్క నీటి జాడ లేని సందర్భాలు..అయినా ఆశ చావక, నమ్ముకున్న భూమిని వదులుకోలేక సాగు కోసమే తమ జీవితాలను బలి చేసుకున్న ఎంతో మంది రైతుల గోసలు తెలంగాణలోని ప్రతి పల్లెలో, ప్రతి ఇంటిలో కనిపిస్తుంది. ఆ గోస చూడలేక తెలంగాణ వాదం, నినాదం, జెండా ఎత్తుకొని, తెలంగాణ అంతా ఒక్కటి చేసి, మూడు కోట్ల గొంతులను ఒక్కటి చేసి, జై తెలంగాణ అని నినదించి కొట్లాడిన నాయకుడు కేసిఆర్‌. ఆయన ఉద్యమం మొదలు పెట్టిన నాడు ఎలా ఎగతాళి చేశారో, తెలంగాణ ఆవిష్కారం తర్వాత ప్రగతి గురిచి చెబితే కూడా అలాగే ఆశ్చర్యంగా చూశారు. తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని కేసిఆర్‌ ఎంత గట్టిగా చెప్పినా ఎవరూ ముందు నమ్మలేదు. ఇప్పుడు ఆ అధ్భుతం చూడడానికి రెండు కళ్లు చాలడం లేదు. ఎక్కడ చూసినా నీళ్లే…పచ్చని పంట పొలాలే…ఒకప్పుడు బీడు తప్ప, నీటితో నిండిన మడి కనిపించిన రోజులు లేవు. ఇప్పుడు తడి మడులేగాని, బీడు కనిపించకుండా చేసిన నాయకుడు కేసిఆర్‌. ఆయన సంకల్ప సిద్ధితో తెలంగాణలో కోటి ఎకరాలకు పైగా సాగులోకి రావడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా మూడేళ్లలోనే తెలంగాణ సస్యశ్యామలం చేశారు. అందుకోసం తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు సాధ్యం కావన్న వారి నోరు మూయించేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, మూడేళ్లలో పూర్తి చేసి ఆ నీటి జలాల ఫలాలు పొలాలు పారుతుంటే కాదన్న వారి కళ్లు తెరుచుకున్నాయి. ఆ అధ్భుతం చూసి, కుళ్లుకున్న వారున్నారు. ఇప్పటికీ అంతుపట్టని ఆ రహస్యం మనసు నిండా నింపుకోలేక ఇప్పటికీ తెలంగాణ మీద విషం చిమ్ముతున్నవారూ వున్నారు. తెలంగాణ కోసం కేసిఆర్‌ కొట్లాడకపోతే తెలంగాణ వచ్చేది కాదు… ఈ అధ్భుతాలు చూసే వాళ్లుం కాదు…ఒక్క కేసిఆర్‌ మది ఆలోచన రంగరించి అందించిన అద్భుత నైవేద్యం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విప్లవమని చెప్పాలి. అటు కాళేశ్వరం, మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం, మల్లన్న సాగర్‌ వంటి వినూత్నమైన రిజర్వాయర్ల నిర్మాణం అన్నది కలలో కూడా ఊహించిది కాదు…నిజం చేసిన కేసిఆర్‌ను తెలంగాణ ఎన్ని తరాలైనా మర్చిపోదు. ఇప్పటికీ కాకతీయులను ఎలా చెప్పుకుంటున్నారో…అలా అపర భగీరధుడు కేసిఆర్‌ను, ఆ యజ్ఞం పూర్తి చేసిన అభినవ కాళేశ్వరరావు మంత్రి హరీష్‌రావులను చరిత్ర మర్చిపోదు. 

ఒక విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు.

 ఒకప్పుడు తెలంగాణ విద్యార్ధులు ప్రైవేటు విద్య కోసం విజయవాడ, గుంటూరు, విశాఖ పట్నం వెళ్లేవారు. అంత స్ధోమత లేని వారు తెలంగాణలోనే వున్న ప్రైవేటు బడులకు వేళ్లేవారు. ఇక పల్లెల్లో దిక్కులేక పేదలకంటూ కనీసం నీడ కూడా లేని బడుల్లో చదువుకునేవారు. చదవించే స్ధోమత వున్నవారు మాత్రమే పక్కఊర్లకు వెళ్లిచదువుకునేవారు. అక్కడడక్కడ హస్టళ్లు వున్నా, అందులో సీటు దొరకడం అంటే గగనం..ఇక అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వుండే రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ప్రవేశం అంటే అదో పెద్ద తతంగం. కాని నేడు తెలంగాణలో ఎక్కడ చూసినా అందమైన నూతన స్కూలు భవనాలు… గురుకులాలు. కేజి నుంచి పీజి దాకా ఉచిత విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. పేద ప్రజలకు విద్య ఎంతో అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని విద్యా మాఫియా శాసించేది. కాని నేడు అలాంటి ప్రైవేటు వ్యవస్ధను నిర్వీర్యం చేసి, ప్రభుత్వ విద్యను పూర్తి స్ధాయిలో అందుబాటులోకి తెచ్చి, విద్యా విప్లవాన్ని కూడా తెలంగాణ సాధించిడం ఒక అధ్భుతం. ఇక మన ఊరు…మన బడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. కార్పోరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న స్కూళ్లు భవిష్యత్‌ తరాలకు దేవాలయాలు…తెలంగాణలో నీళ్లు, నియామకాల ప్రక్రియ ఎంతో జరిగిపోయింది. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఐటి ఎగుమతులు రూ.57వేల కోట్లు వుంటే, ఇప్పుడు 1.87 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే తెలంగాణలో ఐటి విప్లవం వచ్చింది. ఒకనాడు ఐటి అంటే బెంగుళూరు గురించి మాట్లాడుకునేవారు. కాని నేడు తెలంగాణ గురించి చెప్పుకుంటున్నారు. తెలంగాణలోని జిల్లాల్లోకి కూడా ఐటి విస్తరించింది. ఒక్క హైదరాబాద్‌లోనే కొన్ని లక్షల మంది ఐటి ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

 ప్రైవేటు విద్యా వ్యవస్ధను కూకటి వేళ్లతో పెకిలించి, పూర్తిగా ప్రభుత్వ విద్య అందుబాటులోకి వచ్చింది.

 పల్లెల్లో అధ్భుతంగా ప్రభుత్వ బడులలకు తోడు, గురుకులా ఏర్పాటుతో వచ్చే తరం ఎంత గొప్పగా వుంటుందో ఆ విద్యాలయాలను చూస్తేనే అర్ధమౌతుంది. అదే దిశలో ఇప్పుడు ప్రభుత్వ వైద్యం కూడా పరుగులు పెడుతోంది. అమ్మ కడుపులో బిడ్డ పడిన నుంచి మొదలు, ఆ బిడ్డ ప్రపంచాన్ని చూసే దాకా ఆలనా పాలన మొత్తం ప్రభుత్వమే చూస్తోంది. తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. తల్లి గర్భంతో వున్నంత కాలం పోషకాలతో కూడిన కిట్‌ను అందజేస్తున్నారు. ప్రతి నెల ఉచితంగా చెకప్‌లు చేస్తున్నారు. నెలలు నిండిన తర్వాత ప్రభుత్వ ఆంబులెన్స్‌లోనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్నారు. పురుడు పోస్తున్నారు. కేసిఆర్‌ కిట్‌ ఇచ్చి, మళ్లీ ఇంటికి చేర్చుతున్నారు. ఇంతగా ప్రభుత్వం తల్లీబిడ్డల సంక్షేమం ఏ రాష్ట్రంలో లేదు. ఒక్క తెలంగాణలోనే ఇంతటి వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇదిలా వుంటే తెలంగాణలో ఇప్పటికే కొన్ని వైద్య కళాశాల ఏర్పాటు జరిగింది. వాటి ద్వారా కూడా ప్రజలకు ఉచిత వైద్యం అందుతోంది. ఇక అన్ని జిల్లాల్లో త్వరలో వైద్య కళాశాలల ఏర్పాటు శరవేగంగా జరుగుతోంది. ఏటా కొన్ని వేల మంది యువ వైద్యులు ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారు. దాంతో పట్టణాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన బస్తీ దవఖానాలలో ప్రజలు వద్దకే వైద్యం అందుబాటలోకి వచ్చింది. పల్లెల్లో కూడా ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైద్యం పల్లెలకు చేరింది. ఇక హైదరాబాద్‌ చుట్టూ నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వరంగల్‌లో ముప్పై అంతస్ధుల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం దసరా వరకు అందుబాటులోకి రానున్నది. ఇలా తెలంగాణలో వైద్య విప్లవం వస్తోంది. ఇప్పటికే అనేక జిల్లా కేంద్రాల్లో అందుతున్న ప్రభుత్వ వైద్య సేవల మూలంగా ఇప్పటిదాకా పేదల రక్తం తాగిన ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహన జరగక, వాటిని హోటళ్లుగా మార్చుకుంటున్నారు. ఇక జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు మొదలైతే ఇక ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లు చీటి కాలమొచ్చే రోజులు త్వరలోనే వున్నాయి. ఇలా తెలంగాణ అన్ని రంగాలలో స్వర్గ సీమగా మారుతుందని కలలో కూడా ఊహించలేదు…దటీజ్‌ కేసిఆర్‌…!

ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని

15,16,17 తేదీలలో మూడు రోజులపాటు జరగబోయే కెసిఆర్ జన్మదిన వేడుకలను పరిశీలించిన తూర్పు ఎమ్మెల్యే

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి చివరకు తెలంగాణ కొరకై తన ఊపిరినే వదలడానికి సిద్ధపడి తెలంగాణ వచ్చుడో నేను సచ్చుడో అనే నినాదంతో అప్పటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో జననేత ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో 15,16,17 తేదీల లో మూడు రోజులపాటు జరగబోయే కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుటకు గాను ఎమ్మెల్యే నరేందర్ 27డివిజన్ లోని అజంజాహి మైదానం స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధే లక్ష్యంగా చేసుకుని ముందుకు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుటకు కంకణం కట్టుకున్న తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ వేడుకలకు ప్రజలు, జిల్లా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, గుండేటి నరేందర్, చింతాకుల అనిల్, బాలిన సురేష్, భోగి సువర్ణ సురేష్, వస్కుల బాబు, ఓని స్వర్ణలత భాస్కర్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, రాష్ట్ర నాయకులు నీలం రాజ్ కిషోర్, చింతాకుల సునీల్ కుమార్, గోరంట్ల మనోహర్, దుబ్బ శ్రీనివాస్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version