తహసీల్దార్‌ తీరుపై రైతుల ఆందోళన…,

తహసీల్దార్‌ తీరుపై రైతుల ఆందోళన…

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో సకాలంలో పనులు చేయకుండా అధికారులు జాప్యం చేస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఐనవోలు మండలం ఏర్పాటైన నాటి నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని, అయినప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు కాలేదంటూ ఒకరి తరువాత ఒకరుగా బదిలీపై వెళ్తున్నారన్నారు. ఈ విషయంపై ఆర్డీవోకి మొరపెట్టుకున్న పనులు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మా భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు కాకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు అంటున్నారు.

పట్టుబడిన భామ, బాస్‌…?

పట్టుబడిన భామ, బాస్‌…?

చెట్టాపట్టాలేసుకుని వయసును, హోదాను, వృత్తిధర్మాన్ని మరచిపోయి ఏకంగా ప్రభుత్వ వాహనాన్ని తన సొంత వాహనంలా వాడుకుంటూ పిల్లలకు బుద్దులు నేర్పాల్సిన ఆ అధికారి ఓ భామతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటాన్ని బాస్‌ కుటుంబసభ్యులతో సహా కార్యాలయ సిబ్బంది, తోటి అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటూ ఛీకొడుతున్నారు. ‘నవ్విపోదురుకాక…నాకేంటి అన్నట్లు’ అతను భామతో తిరుగుతున్న వ్యవహారం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. బయట ప్రపంచంలోనే కాదు, ఏకంగా తాను విధులు నిర్వహించే ప్రభుత్వ కార్యాలయంలోనే వీరు ఏకాంతంగా కలుసుకుని ప్రైవేట్‌గా మాట్లాడుకునే పరిస్థితికి వెళ్లారంటే వీరి మధ్యన ఉన్న బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రెండునెలల క్రితం భామ, బాస్‌ ఓ హోటల్‌ లాడ్జిలో అర్థరాత్రి పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా అడ్డంగా దొరికిపోయారని సమాచారం. దొరికిన వెంటనే పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లగా ఓ ఇద్దరు పైరవీ చేసి పోలీస్‌స్టేషన్‌ నుండి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం ఎక్కడ బయటపెట్టొద్దని పోలీసులను వేడుకున్నారని తెలుస్తోంది.

తృటిలో తప్పిన పెను ప్రమాదం

తృటిలో తప్పిన పెను ప్రమాదం

జనగాం జిల్లా రఘునాథపల్లి మండలకేంద్రంలో కారు ఎదురుగా రావడంతో ఆర్టీసి బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. భూపాలపల్లి డిపోకు చెందిన ఎపి 29 జడ్‌ 3750 నంబర్‌ గల బస్సు హన్మకొండ నుంచి ఉప్పల్‌ ఎక్స్‌రోడ్డు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలను ఒకవైపునకు మళ్లించారు. కారు రాంగ్‌ రూట్లో వేగంగా రావడంతో బస్సును పక్కన ఉన్న కంకర కుప్పలోకి డ్రైవర్‌ మళ్లించాడు. దీంతో బస్సును కంకర కుప్ప ఆపింది. డ్రైవర్‌ చాకచక్యంగా బస్సు నడపడంతో పెనుప్రమాదం తప్పింది. ఆర్టీసి అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బస్సు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణీకులను మరో బస్సులో తరలించారు. కంకర కుప్ప లేకపోతే బస్సు బోల్తా పడేదని ప్రయాణీకులు తెలిపారు.

మంత్రి చుట్టూ జర్నలిస్ట్‌ భజన బందం

యదార్థవాధి లోకవిరోధి-1

మంత్రి చుట్టూ జర్నలిస్ట్‌ భజన బందం

ఇటీవల పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రైవేట్‌ పీఎల వ్యవహారంపై ‘నేటిధాత్రి’ కథనాలను ప్రచురించింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పీఎల విషయంలో జాగ్రత్త, ప్రైవేట్‌ పీఎల నియామకానికి స్వస్తి పలకండి అని చెప్పి, ప్రభుత్వం కేటాయించే పీఎలను తానే నియమిస్తానని మంత్రుల ఇష్టా, ఇష్టాలకు సీఎం చెక్‌ పెడితే, అది కాదని చెప్పి ఎర్రబెల్లి ఏకంగా 20మంది పీఎలను నియమించుకున్నట్లు అందిన సమాచారంతో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ కథనం వెలువరించాం. ఈ కథనం రావడం మంత్రి దయాకర్‌రావుకు అంతగా నచ్చలేదు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఏకైక మంత్రిని తను చేస్తున్న పనులను ప్రశ్నిస్తారా…? ఆ పత్రికకు ఎంత ధైర్యం..? అంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యారట. ఈ మంటను తగ్గించుకోవడం కోసం తాను పిలవగానే ఎస్‌ బాస్‌ అంటూ వాలిపోయే కొంతమంది పెయిడ్‌ జర్నలిస్టులను పిలిపించి తన బాధనంత వెళ్లగాక్కాడట. మంత్రి బాధ బాగానే ఉన్న, కథనం కావల్సినంత వైరల్‌గా మారి ఎర్రబెల్లి పీఎల వ్యవహారం రాష్ట్రమంతా ప్రచారం అయిన కొంతమంది కబోధులకు అది మాత్రం కనపడలేదట. మంత్రి బాధను మొత్తం విన్న కొంతమంది జర్నలిస్టులను కథనాలను ‘గంజిలో ఈగ’లా తీసిపారేసారట. మీరేంటి…? మీ హోదా ఏంటి…? మీరు ధర్మ ప్రభువులు..దాన దయగుణం కలవారు అంటూ ఎలాంటి మొహమాటం లేకుండా కావాల్సినంత తెగ పొగిడెసి ‘నేటిధాత్రి’ సంగతి మేం చూస్తాం అంటూ భరోసానిచ్చారట. ‘తాను దూర సందులేదు మేడకో డోలు అన్నట్లు’ చేసే దందాలు, వసూళ్ల పర్వాల విషయం. వీరు పని చేస్తున్న యాజమాన్యాలకు తెలిసి వద్దుపొమ్మన్న బతిలాడి, బామాలి సూరు పట్టుకుని వేలాడుతున్న ప్రబుద్ధులు ‘నేటిధాత్రి’కి నీతులు వల్లించే స్థాయికి ఎదిగారట. ఎంతమాత్రం ఆత్మగౌరవం లేకుండా జర్నలిజం విలువల్ని బజారుకీడ్చి అక్రమార్కులు, రాజకీయ నాయకుల దగ్గర అక్షరాలను తాకట్టుపెట్టిన వీరికి ‘నేటిధాత్రి’ కథనాలను ప్రశ్నించే హక్కు ఎక్కడిదో అర్థం కావడం లేదు. జర్నలిజం వీరి ఇంటి సొత్తు అయినట్లు ‘నేటిధాత్రి’ ఉనికిని ప్రశ్నించే దమ్ము ఎక్కడిదో తెలియాలి. మా సంస్థను మేము కాపాడుకుంటూ ఉన్నంతలో జర్నలిజాన్ని బతికిస్తూ నిఖార్సయిన వార్తలతో ముందుకెళుతున్న మాపై వీరికి ఎందుకు ఇంత కళ్లు కుడుతున్నాయో అర్థం కాదు. సొల్లు వాగుడు, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు, ప్రెస్‌ నోట్లు, గిట్టుబాటు వార్తలు మాత్రమే రాయడం చేతనైన వీరు అవి కూడా ఘోస్ట్‌రైటర్స్‌తో రాయించుకుని మా వార్త అని జబ్బలు చరుచుకునే వీరికి ‘నేటిధాత్రి’ని శంకించే హక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేస్తున్నాం. ‘ఎనకటికి మా తాత ఎల్లగుర్రం ఎక్కాడు…ఏదో కాయ కాసింది’ అని ఇంట్లో సభ్యుల పేర్లు చెప్పుకుని లబ్ధి పొందే ఓ ఇద్దరు జర్నలిస్టులు తామే జర్నలిజం, తామే పైనుంచి ఊడిపడ్డాం. మాకే సర్వాధికారాలు ఉన్నాయన్నట్లు జర్నలిస్టుల భావప్రకటన స్వేచ్చకు అడ్డు తగిలే విధంగా, ఏ పత్రికలో, ఏ చానల్లో మంత్రికి వ్యతిరేక వార్తలు వస్తున్నాయో గుర్తించి మధ్యవర్తిత్వం వహించినట్లు నటించి, తాము చెప్పి కథనాలు రాకుండా చేస్తున్నాం అని మంత్రి వద్ద నమ్మబలికి లబ్ధిపొందుతున్న విషయం జర్నలిస్టులందరికి తెలిసిందే. ఇటీవల పెద్దపత్రిక మాది అంటూ బోర్డు తగిలేసుకుని ఊరేగే ఓ జర్నలిస్టు ‘నేటిధాత్రి’తో మాట్లాడాడు. మన జిల్లా మంత్రి గారు అంటూ ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తూ తాను అక్షరాలను వేలం పెట్టాను లెక్కగట్టి మరీ అమ్మేస్తున్నాను మీరు వేలం పెట్టండి, అమ్మకానికి సిద్దం కండి అంటూ రాయబారిగా వచ్చి బేరసారాలు నడిపే ప్రయత్నం చేశాడు. అది ఎంత మాత్రం కుదరకపోవడంతో ‘నేటిధాత్రి’ని పట్టించుకోవద్దని మంత్రికి ఉచిత సలహా ఇచ్చాడట. అణిచివేయబడ్డ వారు, సామాజికంగా వెనుకబడ్డ వారు అంటూ డైలాగులు తెగ వల్లించే ఈ జర్నలిస్టు ఏ సామాజికవర్గానికి లబ్ధి చేస్తున్నాడో కాస్త గురైరగాలి. ప్రజల పొట్టకొట్టి, అధికారం ఉంది కదా అని దోపిడికి పాల్పడుతూ ప్రజాధనాన్ని అడ్డగోలుగా స్వప్రయోజనాల కోసం వృధా చేస్తే ఎందుకు ప్రశ్నించకూడదో ఆ జర్నలిస్టు సమాధానం చెప్పాలి. నీతులు వల్లిస్తూ గోతులు తవ్వే అతగాడికి ‘నేటిధాత్రి’ని కామెంట్‌ చేసే అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి. పత్రిక ఏదైనా జనం కోసం పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటుందని, కథనం ఏదైనా జనం నిజానిజాలు గ్రహించి కీలెరిగి వాత పెడతారనే కనీస అవగాహన ఉండాలి. జర్నలిజం అనగానే రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పైరవీలు, లబ్ధిపొందడాలు, ఆస్తులు సంపాదించి ఊరేగడం కాదని గుర్తుంచుకోవాలి. వసూళ్ల పర్వాన్ని యథేచ్చగా కొనసాగించడానికి ఇతర జర్నలిస్టులపై దుమ్మెత్తిపోసే నీతి బాహ్యమైన పనులు చెల్లవని ‘నేటిధాత్రి’ హెచ్చరిస్తుంది. నిజం ఎప్పటికైన గెలుస్తుంది. జర్నలిజం జనంపక్షానే ఉండి తీరుతుంది. మేం రాసే కథనాలపై అనుమానాలు ఉంటే మంత్రైనా ఎంతటివారైన వారికి ‘నేటిధాత్రి’ సమాధానం ఇస్తుంది. కథనాలపై అభ్యంతరం ఉంటే వారికి సంబంధించిన వివరణను ‘నేటిధాత్రి’ జర్నలిజం విలువలను గుర్తించి తప్పక ప్రచురిస్తుంది. ఏకపక్షంగా ఎప్పుడు వ్యవహరించదు. ఎవరిపై కథనం వచ్చిన వారు ‘నేటిధాత్రి’తో మాట్లాడుకుంటారు. కానీ కొంతమంది జర్నలిస్టుల పెత్తనం మా కథనాలపై చూపిస్తే సహించమని చెప్తున్నాం. మా ఉనికిని ప్రశ్నించవద్దని చెప్తున్నాం. మా పత్రికకు సంబంధించిన ప్రతినిధి మీడియా సమావేశంలో లేనప్పుడు దొంగచాటుగా మంత్రి దగ్గర బేష్‌ అనిపించుకునేందుకు సభ్యత మరిచి కామెంట్లు చేయకూడదని అంటున్నాం. అలా చేస్తే ధీటుగా సమాధానం చెప్పడం మాకు తెలుసని చెప్తున్నాం. వ్యక్తులు లేనప్పుడు వారి గురించి ప్రస్తావించడం సంస్కారం కాదని కుసంస్కార స్థాయికి దిగజారిన వారిని కోరుతున్నాం. పాతకాలపు మెదళ్లతో తిరుగుతూ ఎంతమాత్రం అప్‌డేట్‌ కాకుండా ఉండే మీకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ కంటే ‘వెబ్‌ జర్నలిజం’ అత్యంత వేగంగా దూసుకుపోతుందని వసూళ్లు తప్ప సమాజంలో వస్తున్న మార్పులపై ఎంతమాత్రం అధ్యయనం చేయలేని మీకు చెప్తున్నాం.

 

టిఎస్‌ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్‌.జగన్‌

టిఎస్‌ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్‌.జగన్‌

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శిగా డి.ఎస్‌.జగన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం మసాబ్‌ట్యాంక్‌లోని సమాచార భవన్‌, మీడియా అకాడమీ కార్యాలయంలో కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వరంగల్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడిగా పనిచేస్తున్న డి.ఎస్‌.జగన్‌కు మీడియా అకాడమీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ అరవింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు పదవీ బాధ్యతలు స్వీకరించి జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు కృషి చేస్తానని తెలిపారు.

ఉమా బుక్‌స్టాల్‌పై దాడులు

ఉమా బుక్‌స్టాల్‌పై దాడులు

వరంగల్‌ నగరంలో ప్రైవేటు పాఠశాలలకు సంబందించిన నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలను ఉమాబుక్‌ స్టాల్‌ నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల నగరంలోని దేశాయిపేట రోడ్‌లో నిర్వహిస్తున్న ఉమా బుక్‌స్టాల్‌పై సొమవారం తూనికలు, కొలతల అధికారలు దాడులు నిర్వహించి బుక్‌స్టాల్‌ నిర్వాహకులు అమ్ముతున్న నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. వాటిపై ఉన్న రేట్లను క్షణ్ణంగా పరిశీలించారు. ఎమార్పి రేట్ల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తూనికల, కొలతల అధికారలు హెచ్చరించారు. నగరంలో ప్రైవేటు పాఠశాలలు కొన్ని బుక్‌స్టాల్‌ వారితో కుమ్మక్కయి అక్రమ దందా నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నారని అధిక ధరలకు పుస్లకాలను అమ్ముతున్నారని, కొన్నింటిపైనా ఎమ్మార్పి రేటు లేకుండానే నిర్వాహకులు ఎంత చెబితే అంత ఇచ్చి కొనాల్సిందేనని, పుస్తకాల భారం మోయలేకుండా ఉన్నదని తల్లిదండ్రులు వాపోతున్నారు. వారి ఫిర్యాదు మేరకు సొమవారం చేపట్టిన తనిఖీల్లో ఎమ్మార్పి లేకుండా విక్రయిస్తున్న పుస్తకాలు, నోట్‌బుక్‌లు కొన్ని లభ్యమయినట్లు తెలుస్తున్నది. ఈ దాడులు నగరమంతా నిర్వహించి ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మినా, ప్రైవేటు పాఠశాలలతో కుమ్మక్కై వ్యాపారం నిర్వహించినా కఠిచర్యలు తీసుకుంటామని, మరో రెండురోజుల పాటు ఈ దాడులు నిర్వహిస్తామని అధికారలు తెలిపారు.

మట్టి మాఫియాపై రెవెన్యూ కొరఢా

మట్టి మాఫియాపై రెవెన్యూ కొరఢా

వరంగల్‌ నగర శివార్లలో కొందరు అక్రమంగా చెరువులలో మట్టి తవ్వకాలు జరిపి యదేచ్చగా ఇటుకబట్టీలకు అమ్ముకుంటు లక్షల రూపాయల విలువ చేసే మట్టిని వ్యాపారంగా మార్చి ప్రభుత్వ రెవిన్యూ అధికారల కళ్లు గప్పి గుట్టుగా దందా కొనసాగిస్తున్నారని ‘చెరువు మట్టి…మాయమవుతోంది..’ అనే శీర్షికతో ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే. నేటిధాత్రి కథనానికి స్పందించిన రెవిన్యూ అధికారులు ఆదివారం రంగశాయపేట సమీపంలోని దామెర చెరువులో మట్టి వ్యాపారులు అక్రమంగా మట్టిని తవ్వుతుండగా విఆర్వో శ్రీనివాస్‌, విఆర్‌ఏలు సదానందం, రమేష్‌లు వెళ్లి పరిశీలించగా ఒక జెసిబీతో మట్టిని తవ్వుతుండగా పనులను నిలిపివేసి జెసిబినీ స్శాదీనం చేసుకున్నట్లు విఆర్వో శ్రీనివాస్‌ తెలిపారు. అనేక సార్లు హెచ్చరించినా మట్టి వ్యాపారలు పెడచెవిన పెట్టడంతో ఆదివారం రాత్రి దామెర చెరువు వద్ద రెక్కి నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని , మట్టిని తరలించే సమయంలో నాలుగు టిప్పర్లు పారిపోయాయని, ఒక జెసిబిని పట్టుకొని కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సిబ్బంది

ఆదివారం రాత్రి వేళలో అక్రమంగా దామెర చెరువులో మట్టి తవ్వకాలు జరుపుతున్నట్టు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లగా చెరువులో తవ్వుతున్న మిషన్‌లను అదులపులోకి తీసుకున్నారు. పారిపోయిన టిప్పర్ల కొసం పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకొని వెళ్లారని వాటి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. అర్ధ రాత్రి పక్కాసమాచారంతో వెళ్లి పట్టుకున్నామని రెవిన్యూ అధికారులు తెలిపారు.

జెసిబిని స్వాదీనం చేసుకున్న రెవిన్యూఅధికారులు

దామెర చెరువులో మట్టిని తవ్వుతున్న టిఎస్‌ 03 ఇఎఫ్‌ 4019 అను నెంబర్‌ గల జెసిబిని రెవిన్యూ అధికారలు నిర్వహించిన దాడిలో పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని తవ్వుతున్నందున ఈ జెసిబిని అదుపులోకి తీసుకొని ఎమ్మార్వో కార్యాలయానికి తరలించామని విఆర్వో తెలిపాడు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎవరైనా చెరువులలో మట్టిని తవ్వినా, మట్టిని తరలించి వ్యాపారానికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యదార్థవాది లోక విరోధి…!

యదార్థవాది లోక విరోధి…!

నేటిధాత్రి కథనాలు కొంతమంది జర్నలిస్టులు అలియాస్‌ ఎర్నలిస్టులకు మింగుడు పడడం లేదు

రెచ్చిపోతున్న చదువు,తెలివి లేని డమ్మీ జర్నలిస్ట్‌ లు

వసూళ్ల కోసం ప్రోత్సహిస్తున్న పెద్ద పత్రికల్లోని స్వయం ప్రకటిత మేధావులు

పొట్టచీరితే అక్షరం ముక్కరాదు జర్నలిజాన్ని మొత్తంగా వారే మోస్తున్నట్లు బిల్డప్‌

నిజాలు రాస్తున్న నేటిధాత్రిపై నోరు పారేసుకుంటున్న ఎర్నలిస్టులు

సంపాదనే ద్యేయంగా తెలివిమీరిపోతున్న కొందరు జర్నలిస్టులు అలియాస్‌ ఎర్నలిస్ట్‌లపై సంచలన కథనం త్వరలో….

తక్షణం పరిష్కరించండి

తక్షణం పరిష్కరించండి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె జిల్లా అధికారులనుద్దేశించి మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై శాఖలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పరిష్కారమార్గం చూపెట్టాలని, అపరిష్కతంగా ఉంటే సంబంధిత శాఖ ఉన్నతాధికారి బాధ్యలవుతారని స్పష్టం చేశారు. పెండింగ్‌ ఫిర్యాదులపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని సూచించారు. భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువ వస్తున్నందున రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఆయాశాఖల అధికారులకు పంపించినప్పుడు వెంటనే స్పందించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు ఎన్ని సమస్యలు పరిష్కరించారు, మిగిలినవి ఎందుకు పరిష్కరించలేకపోయారో కూడా స్పష్టమైన వివరణ ఇవ్వాలని, సంబంధిత నివేదికలను అందజేయాలని సంయుక్త కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ప్రాదేశిక ఎన్నికల కోడ్‌ ముగిసినందున ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై ప్రత్యేక దష్టిపెట్టాలని సంయుక్త కలెక్టర్‌ జిల్లా అధికారులకు తెలిపారు. పథకాల అమలులో అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయం మర్చిపోవద్దని అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజావాణికి వచ్చిన వారి నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా, డీఆర్వో ఎన్‌. ఖీమ్యానాయక్‌తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో రవీందర్‌, డిడేంలంమ సరస్వతి , డిసిఓ మహమ్మద్‌ అలీ, ఈఈలు విగ్నేశ్వర్‌రెడ్డి, కనకరత్నం, డిటిఓ కొండల్‌ రావు , సిపిఓ రాజారామ్‌, డిఎస్‌సిడిఓ రాజేశ్వరి, బిసిడిఓ సువర్ణ కిరీటి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణికి జన తాకిడి…కిక్కిరిసిన కలెక్టరేట్‌

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ శాఖలకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ప్రాదేశిక ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం ప్రజవాణిని తిరిగి ప్రారంభించడంతో పెద్దఎత్తున ప్రజలు కల్లెక్టరేట్‌కు తరలివచ్చి తమ సమస్యలను అధికారులకు తెలిపారు. మొత్తం 163 దరఖాస్తులు రాగా వాటిలో పెన్షన్‌ సంబంధిత దరఖాస్తులు 82 కాగా, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు కోరుతూ 31, రెవిన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోరుతూ 50 దరఖాస్తులు అందాయి.

14 nunchi badibaata, 14 నుంచి బడిబాట

14 నుంచి బడిబాట

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో ఈనెల 14 నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామస్థులు, పజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ రోజువారీగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ధ్యేయంగా జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ నిర్వహించనుంది.

డిజిటల్‌ తరగతుల బోధన…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి వాటిని సంరక్షించడమే ధ్యేయంగా ప్రభుత్వం బడిబాట పేరిట ఏటా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గతంలో వేసవి సెలవుల్లోనూ నిర్వహించినా, ఆ దిశగా కొంత మేర సఫలీకతం అయ్యింది..దీంతో ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకుంటూ అయిదేళ్లు నిండిన విద్యార్థులతోపాటు గ్రామాల్లో బడిఈడు పిల్లలను చేర్పించాలని భావిస్తోంది. గతేడాది చాలామంది విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఆంగ్ల మాధ్యమాలను ప్రవేశపెట్టింది. దీంతో కొన్ని గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా..పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో విద్యార్థుల నమోదు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల పట్ల సానుకూలత కనిపిస్తోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతోపాటు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు ఇందుకు దోహదం చేస్తున్నాయని చెప్పక తప్పదు. మధ్యాహ్న భోజనం, డిజిటల్‌ తరగతులు, ఆంగ్ల మాధ్యమం ఉచితం, సమరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, వివిధ రకాల ఉపకార వేతనాలు అందుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఐదురోజుల పాటు..

జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని ఐదురోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకు ఒక్కోరోజు ఒక్కో విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. బడిబాట మొదటిరోజున ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేయాలని సూచించింది. పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను అట్టహాసంగా చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 11గంటల వరకు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.

బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి ….

సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా

ఐదు సంవత్సరాలు నిండిన బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట అవగాహన కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. ప్రైవేటు పాటశాలతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలో వసతులు, నాణ్యమైన విద్య విషయం తదితర అన్ని విషయాలలో ప్రభుత్వ పాఠశాలలు మెరుగన్నారు. క్షేత్రస్థాయిలో సంబంధిత ప్రభుత్వ శాఖలు పర్యటించి ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. టార్గెట్‌ బేస్డ్‌ అప్రోచ్‌ తో అధికారులు ముందుకు సాగలన్నారు. జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించాలన్నారు. మధ్యలో బడి మానివేసిన విద్యార్థులను కూడా గుర్తించి పాఠశాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బడిబాటలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతీరోజు ర్యాలీలు నిర్వహించి నమోదును పెంచేందుకు కషి చేయాలన్నారు. విద్యార్థుల నమోదు వివరాలను విధిగా ప్రతీరోజు ఎంఈవో కార్యాలయానికి పంపాలన్నారు. బడి మానివేసిన విద్యార్థుల వివరాలను సేకరించి..అందరూ బడిలో చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 14 నుంచి బడిబాట నిర్వహించాలన్నారు. బడిబాట నిర్వహించే సమయంలో ప్రతిరోజు ఎంతమంది విద్యార్ధులను పాఠశాలల్లో చేర్పించారో పారదర్శకంగా తెలిపేలా పాఠశాల, మండల, జిల్లాస్థాయిలో బడిబాట డెస్క్‌ను తప్పక ఏర్పాటుచేసి ఒక బాధ్యున్ని నియమించాలని ఆదేశాలు అందాయన్నారు. బడిబాట విజయవంతానికి అధికారులు పాటుపడాలన్నారు.

బడిఈడు పిల్లలను గుర్తిస్తాం…

– ధనాలకోట రాధాకిషన్‌, జిల్లా విద్యాధికారి, రాజన్న సిరిసిల్ల

బడిఈడు, బడి బయటి పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేలా అధికారులకు సూచించాం. ఉపాధ్యాయులతో బడిబాట కార్యక్రమం చేపట్టనున్నాం. అంగన్‌వాడీలో ఐదేళ్లు నిండిన పిల్లలను, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేరేలా కషి చేస్తాం. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సైతం పాల్గొనేలా ఉద్యోగులకు వివరించాం.

14 nunchi certificatela parishilana, 14నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

14నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామక తుదిపరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 14వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులైన 1,02,048మంది అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నట్లు రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి వెల్లడించింది. ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 17కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు నియామక మండలి తెలిపింది. అభ్యర్థులు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టిఎస్‌ఎల్‌పిఆర్‌బి.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి సమాచార లేఖలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొంది. ఈనెల 12వ తేదీ ఉదయం 8గంటల నుంచి 13వ తేదీ రాత్రి 8గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని మండలి తెలిపింది.

anganvadi kendralathone chinnarula abhivruddi, అంగన్‌వాడీ కేంద్రాలతోనే చిన్నారుల అభివద్ధి

అంగన్‌వాడీ కేంద్రాలతోనే చిన్నారుల అభివద్ధి

అంగన్‌వాడీ కేంద్రాలలో అందించే పోషక ఆహార పదార్థాల వలన చిన్నారులు అభివద్ధి చెందారని అంగన్‌వాడీ కార్యకర్త నల్ల భారతి అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో ఏఎల్‌ ఎస్‌ఎంసీ చైర్మన్‌ వాసం కవిత ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు, తల్లులతో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్లా భారతి మాట్లాడుతూ 3 నుండి 5సంవత్సరాల చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. అంగన్‌వాడి కేంద్రాలలో పోషకాలతో కూడిన భోజన వసతులు పాలు, కోడిగుడ్డు అందిస్తున్నామని తెలిపారు. చిన్నారులు శారీరకంగా, మానసికంగా ఎదగడం కోసం ఆటలు, పాటల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి.గౌసియాబేగం, సునీత, కమిటీ సభ్యులు రవళి, కవిత, సనాతోపాటు చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.

majjiga packetla papini, మజ్జిగ ప్యాకెట్ల పంపిణి

మజ్జిగ ప్యాకెట్ల పంపిణి

హైదరాబాద్‌లోని మణికొండ ల్యాంకో హిల్స్‌ మర్రిచెట్టు సర్కిల్‌ వద్ద విఆర్‌4యు సంస్థ సీనియర్‌ సిటిజన్‌ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి కార్యక్రమాన్ని చేపట్టామని ఆ సంస్థ అధ్యక్షుడు బాపూజీ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు నేడు ఉదయం 10గంటల నుండి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఈ మజ్జిగ పంపిణికి మణికొండ మాజీ సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి సహకరించాలని తెలిపారు. మా సీనియర్‌ సిటిజన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం జాయింట్‌ సెక్రటరీ ప్రదీప్‌రావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మా సంస్త ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. మా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్చభారత్‌, పర్యావరణ పరిరక్షణ, అనాథ పిల్లలకు చేయూత వంటి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే నేడు మజ్జిగ పంపిణీని చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి దిలీప్‌ థక్కడ్‌, సభ్యులు డాక్టర్‌ ప్రభావతి, సాంబశివరావు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

harithaharaniki siddamina nursary, హరితహారానికి సిద్దమైన నర్సరీ

హరితహారానికి సిద్దమైన నర్సరీ

హసన్‌పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో నర్సరీని ఎపిఎం విజయలక్ష్మి సోమవారం సందర్శించారు. నర్సరీ మొక్కలు వర్షాకాలం దగ్గర పడటంతో నర్సరీలోని మొక్కలు నాటడానికి సిద్దం చేయాలని అన్నారు. ప్రతి ఇంటికి రెండుమొక్కలు నాటాలని, రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటాలని, వాటిని కాపాడే బాధ్యత అందరూ తీసుకోవాలని తెలిపారు. టేకు, దానిమ్మ, సీతాఫలల చెట్లు, పూలమొక్కలు, నీడనిచ్చే మొక్కలు రాబోయే తరం వారికి కూడా ఉపయోగపడేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పచ్చని చెట్లు-ప్రగతికి మొట్లు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కొండ రాజ్‌కుమార్‌, టిఎ సృజన సుదర్శన్‌, అశోక్‌, గ్రామ సర్పంచ్‌ చిర్ర సుమలత, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

anganvadi teacherla badibata, అంగన్‌వాడీ టీచర్ల బడిబాట

అంగన్‌వాడీ టీచర్ల బడిబాట

చిన్నారులను బడిబాట పట్టించేందుకు అంగన్‌వాడీ టీచర్లు రోడ్డుబాట పట్టారు. ఐదేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులలో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలబాలికలు ఐదేళ్లలోపు పిల్లలు అంగన్‌వాడీకి పంపాలని, ఐదేళ్లు దాటిని పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని అంగన్‌వాడీ టీచర్లు గ్రామాలలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో గ్రామగ్రామాన ర్యాలీలు చేపడుతున్నారు. 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు బడిబాట చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గ్రామంలోని ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ ఎ.రాధిక, సర్పంచ్‌ జెన్నయ్య, ఉపసర్పంచ్‌ గట్టు శివకుమార్‌, తరగం సునీత, ఆయా రజియా, కో ఆప్షన్‌ మెంబర్‌ ఎస్‌కె.లాల్‌, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

kakisthara…thappisthara…?, కక్కిస్తారా…తప్పిస్తారా…?

కక్కిస్తారా…తప్పిస్తారా…?

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో క్యాంపు పేరిట లక్షల రూపాయలను అక్రమంగా మెక్కేశారని, దొంగల పేర్లతో దొంగ అకౌంట్లు సేకరించి క్యాంపులో భాయ్స్‌గా పనిచేసినట్టు దొంగతనంగా పేర్లను రాసి లక్షల రూపాయలల్లో అవినీతికి పాల్పడినారని, అవినీతి జరిగిన తీరుపై వెంటనే విచారణ కమిటిని వేసి బాధ్యులను గుర్తించి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘంలు డిమాండ్‌ చేస్తున్నా ఇప్పటి వరకు కమిటినీ వేయకుండా కాలయాపన చేస్తున్నదని ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.

క్యాంపు పేరుతో లక్షల రూపాయలు మాయం

ఇంటర్మీడియట్‌ పరీక్ష పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపు కార్యాలయంలో దొంగబిల్లులు పెట్టి, భాయ్స్‌గా పనిచేయకున్నా పనిచేసినట్టుగా దొంగపేర్లను రాసి డబ్బులు నొక్కేశారని తెలుస్తోంది. డిఐఈవో కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల అకౌంట్లలో, అందులోనే పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగుల అకౌంట్లలో, పింగిళి మహిళ జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి సంబందించిన వారి అకౌంట్లలో దొంగదారిన డబ్బులు జమచేశారని అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వొడపెల్లి మురళి ఆరోపించారు. అక్రమంగా సుమారుగా 90 మంది అకౌంట్లలో వేశారని ఒక్కో అకౌంట్లో రూ.8.540 నుండి రూ.16.653 వరకు వేశారని, వీటిని తిరిగి సూపరింటెండెంట్‌ సాయబాబా కలెక్ట్‌ చేసుకొని ప్రభుత్వ సొమ్మును అప్పనంగా నొక్కేశారని, నొక్కేసిన డబ్బులను కలిసి పంచుకున్నారని ఆరోపించారు.కేవలం సుతిల్‌ దారాలకు 50వేల రూపాయలు అయినట్లు బిల్లులు పెట్టారంటే ఇంకా స్టేషనరీ పేరుతో ఎంతెంత నొక్కేసి వుంటారో అర్ధం చేసుకోవచ్చని సంఘాల నాయకులు అంటున్నారు.

కార్యాలయ సిబ్బంది ఆఫీస్‌ భాయ్స్‌ ఎలా అవుతారు?

డిఐఈవో కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌, రెగ్యులర్‌ ఉద్యోగుల అకౌంట్లలలో కూడా క్యాంపు ఆఫీసులో మూటలు మోశారని, పేపర్‌ బండిల్స్‌లు అందించారని ఆఫీస్‌ భాయ్స్‌గా పనిచేశారని వారి అకౌంట్లలలో డబ్బులు వేశారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు రోజువారి కూలీలు ఎలా అవుతారో? డిఐఈవో లింగయ్య, సూపరింటెండెంట్‌ సాయిబాబాలే ప్రజలకు, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. కార్యాలయంలో అటెండర్‌ నుండి ప్రభుత్వ ఉద్యోగి వరకు ఎవరిని వదలకుండా అందరి అకౌంట్లలో రోజువారి కూలీల మాదిరిగా, క్యాంపుభాయ్స్‌ పేరిట అకౌంట్లలో డబ్బులు చెక్కుల ద్వారా వివిద బ్యాంక్‌లల్లో జమ చేశారు. అవకతవకలపై, అవినీతిపై ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ కమిటిని వేసి ప్రభుత్వం తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

hanthakulanu katinaga shikshinchali, హంతకులను కఠినంగా శిక్షించాలి

హంతకులను కఠినంగా శిక్షించాలి

బక్కి శ్రీను హంతకులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌వర్గం రాష్ట్ర నాయకుడు గడ్డం సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్కి శ్రీను హంతకులను కూడా శ్రీనును చంపిన విధంగానే ఉరితాడుకు వేలాడేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలని జెఎసికి పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బక్కి శ్రీను హంతకులను శిక్షించాలని ఆందోళన చేస్తూ పోరాటం చేస్తున్న జెఎసికి సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు. అదేవిధంగా బక్కి శ్రీను సంస్మరణ సభ సందర్భంగా శ్రీను కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు.

16na sanmana karyakramam, 16న సన్మాన కార్యక్రమం

16న సన్మాన కార్యక్రమం

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మేదరి ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో మేదర విద్యార్థులు, ఉద్యోగులు, పదవీవిరమణ పొందిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆ సంఘం అధ్యక్షుడు ప్రతాపగిరి ప్రసాద్‌, జనరల్‌ సెక్రటరీ దండుగుడుము ఉపేందర్‌ తెలిపారు. శనివారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లలో అధికమార్కులు సాధించిన మేదరి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని అన్నారు. అదేవిధంగా కొత్తగా ఉద్యోగం పొందిన వారికి, ఉద్యోగంలో పదోన్నతులు పొందిన వారికి, ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీవిరమణ పొందిన వారికి ఈనెల 16వ తేదీన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమం వరంగల్‌ జెమిని టాకీస్‌ సమీపంలోని పోతన విజ్ఞాన పీఠంలో జరుగుతుందని, అర్హత కలిగిన విద్యార్థులు తమ మార్కుల జాబితాలను అందజేయాలని తెలిపారు. ప్రోత్సాహాక కమిటీ ద్వారా వారి తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా ఆహ్వానం తెలుపుతామని అన్నారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడు కూచనపల్లి శ్యామ్‌సుందర్‌, ఉపాధ్యక్షులు ప్రతాపగిరి సత్యదేవ్‌, దీకొండ సరిత, లీగల్‌ అడ్వైజర్‌ కూచనపల్లి వెంకటేశ్వర్లు, చీఫ్‌ అడ్వైజర్‌ సిలువేరు మల్లిఖార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

upadihami panula zoru, ఉపాధిహామీ పనుల జోరు

ఉపాధిహామీ పనుల జోరు

హసన్‌పర్తి మండలంలోని సీతానాగారం గ్రామంలో వర్షాకాలం రావడంతో కూలీలు భారీసంఖ్యలో ఉపాధిహామీ పనులకు వస్తున్నారని ఎపిఓ విజయలక్ష్మి తెలిపారు. కాలం రావడంతో ఎవరి పొలంలో వారు మట్టి కొట్టుకపోకుండా కూలీలు అధికసంఖ్యలో పాల్గొన్నారన్నారు. మబ్బులు చల్లపడటంతో కూలీలు సంతోషంగా పనులు చేస్తున్నారన్నారు. రైతులు వారివారి పొలాల్లో మట్టిని పోసుకుంటున్నారని, ఉపాదిహామీ కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడటంతోపాటు వారి అవసరాలను తెలుసుకున్నానని చెప్పారు. ఇంతమంది కూలీలు వందరోజుల పనిని వినియోగించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ అయిలయ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రవీందర్‌, టిఎ సృజన తదితరులు పాల్గొన్నారు.

avirbava dinostavanni jayapradam cheyali, ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు పుట్ట రవి అన్నారు. శుక్రవారం హసన్‌పర్తి మండలకేంద్రంలో ఎమ్మార్పీఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పుట్ట రవి మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంద కృష్ణమాదిగ పర్యటన సందర్భంగా ఉదయం 7గంటలకు మహబూబాబాద్‌ జిల్లాలోని గంగారం మండలకేంద్రంలో, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలో ఉదయం 11గంటలకు, ములుగు జిల్లాకేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంటలకు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 2గంటలకు, జనగామ జిల్లాలో 5గంటలకు మంద కృష్ణమాదిగ పర్యటన అన్ని జిల్లాలలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పాదయాత్రకు సంఘీభావంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాలు కలసిరావాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఈమామూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవం 25లక్షల మందితో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. 25సంవత్సరాల ఉద్యమస్ఫూర్తి అట్టడుగు పేదల స్ఫూర్తిదాయంగా ఎమ్మార్పీఎస్‌ నిలిచిందని అన్నారు. ఇంటికి ఇద్దరు, పల్లెకు 2వాహనాల చొప్పున తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారపు బిక్షపతి, మండల అధ్యక్షుడు రేణుకుంట్ల దుర్గాప్రసాద్‌, నాయకులు రామంచ సంపత్‌, కేతపాక సదానందం, పలనాటి రవీందర్‌, రాజు, జనార్థన్‌, ప్రసాద్‌, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version