arpatlanu parishilinchina sp, ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపిటిసి రెండవ విడత ఎన్నికల సందర్బంగా జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే తంగళ్లపల్లి గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను, పోలింగ్‌ సరళిని పరిశీలించారు. అదేవిధంగా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు ప్రశాంతవాతావరణంలో నిర్వహించాలన్నారు. ఎస్పీ వెంట సిరిసిల్ల రూరల్‌ సీఐ అనిల్‌కుమార్‌ ఉన్నారు.

ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుంది : పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు

నల్లబెల్లి మండలంలో జరుగుతున్న మండల పరిషత్‌ ,జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్షంగా అన్ని స్థానాలతో పాటు జడ్పీటిసి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అని నర్సంపేట శాసన సభ్యులు  .శుక్రవారం నర్సంపేట డివిజన్‌లోని ఖానాపురం, నల్లబెల్లి మండలాల్లో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ రెండవ విడత ఎన్నికలు జరిగాయి. నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి నల్లబెల్లి టీఆర్‌ఎస్‌ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి పెద్ది స్వప్నతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ గత ఇరవైఅయిదు సంవత్సరాలుగా నల్లబెల్లి మండల ప్రజలకు ప్రజాసేవ చేస్తున్నానని, ఇక్కడి నుండే తనకు రాజకీయ అవకాశం వచ్చిందని, నల్లబెల్లి మండల ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారని తెలిపారు. తన సతీమణి స్వప్నకు అధిష్టానం జడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం కల్పించిందని అన్నారు .

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నా సతీమణికి జడ్పీటీసీ అవకాశం దక్కనందున కొందరు ఆరోపణలు చేశారని తెలుపుతూ తన ప్రచారానికి ఒక్కరోజు కూడా రాలేదన్నారు .అయినప్పటికీ మండల ప్రజలు ,ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఎంతో విశ్వాసంతో ఆమె గెలుపు కోసం ఎవరికి వారిగా కషి చేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని అన్ని జడ్పీటీసీ స్థానాలలో నల్లబెల్లి నుండి పదివేల మెజారిటీ వస్తుందని విశ్వాసంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్‌ పదవిపై వస్తున్న ప్రచారం పట్ల అడుగగా అధిష్టానం మేరకు నడుచుకుంటానని ఇప్పటికీ త్పత్తి కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వివరించారు. జడ్పిటిసి అభ్యర్థి పెద్ది స్వప్న సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలకు సెవా వేసేందుకు తెలంగాణ ఉద్యమకారురాలుగా ఎన్నికల బరిలో దిగానని ఆమె తెలిపారు. మండల ప్రజలు, పార్టీ శ్రేణులు తనకు జడ్పిటిసిగా పట్టం కట్టడానికి ఏకాభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ బాటలో నడుస్తామని తెలుపుతూ పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటామని స్వప్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి సర్పంచ్‌ రాజారాం, నాయకులు సట్ల శ్రీనివాస్‌ గౌడ్‌, దార్ల రమాదేవి ,మాజీ సర్పంచ్‌ కోటిలింగాచారిలతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు .

ఎంపి అభ్యర్థికి బహిరంగ లేఖ

ఎంపి అభ్యర్థికి బహిరంగ లేఖ

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ఖర్చుల డబ్బులను ఇవ్వాలని కోరుతూ బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షుడు కందగట్ల టాక రాజు ఎంపీ అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్‌కు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా బహిరంగ లేఖను రాసారు .ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మహబూబాబాద్‌ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నర్సంపేట పట్టణంలో మహిళలతో రోడ్‌షోను నిర్వహించారని తెలిపారు .కోలాటం మహిళలకు ఒక్కరికి వంద రూపాయల చొప్పున 550 మందికి 55000 అలాగే మంచినీటి ప్యాకెట్ల కోసం 800రూపాయలు ఖర్చు అయ్యాయని ,అందుకు పార్లమెంటు అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌ , నర్సంపేట ఎన్నికల ఇంచార్జి బోడా వీరన్న ముప్పైనాలుగు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని, మిగతా 26300 రూపాయలను ఇప్పటికీ ఇవ్వడం లేదంటూ రాజు ఆరోపించారు.

వీరన్నను ఎన్నికల ఖర్చుల మిగతా డబ్బులు ఇవ్వమని అడిగితే గతంలోనే ఇచ్చారంటూ దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నారని ఈ విషయంపై అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌ కు వివరించి తెలుపగా గతంలోనే మొత్తం డబ్బులను వీరన్నకు ఇచ్చామని తెలిపినట్లు ఆయన తెలిపారు. కోలాటం సంబంధించిన మహిళలు ప్రతిరోజూ తమ ఇంటి వద్దకు వచ్చి అడుగుతున్నారని, దీంతో దిక్కులేని స్థితిలో మనస్తాపానికి గురైతున్నట్లు రాజు వివరించారు. వెంటనే డబ్బులను జిల్లా పార్టీ అధిస్థానం ఇప్పించాలని కందగట్ల రాజు కోరారు.

shwetharkamula ganapathini darshinchukunna corporator swapnasridhar, శ్వేతార్కమూల గణపతిని దర్శించుకున్న కార్పొరేటర్‌ స్వప్నశ్రీధర్‌

శ్వేతార్కమూల గణపతిని దర్శించుకున్న కార్పొరేటర్‌ స్వప్నశ్రీధర్‌

కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతిస్వామిని 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిడిదొడ్డి స్వప్నశ్రీధర్‌ శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో ఈనెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న 21వ వసంతోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలలో చివరిరోజు శుక్రవారం 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిడిదొడ్డి స్వప్నశ్రీధర్‌ కుటుంబసభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు అనంతమల్లయ్యశర్మ స్వాగతం పలికి ప్రత్యేకపూజలు చేసి ఆశీర్వాదించారు. అనంతరం ఆలయ అర్చకులు రాధాకృష్ణశర్మ కార్పొరేటర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ శ్రీశ్వేతార్కమూల గణపతిస్వామి అందరి కోరికలు తీర్చే దేవుడని, ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు రావడం గొప్ప విషయమని, స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు క్షేమంగా ఉండాలని అన్నారు.

ఇక్కడ బిజెపి ఉందా…చెప్పుతో కొడతా : దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించిన గండ్ర జ్యోతి

 దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించిన గండ్ర జ్యోతి

శాయంపేట మండలకేంద్రంలో రెండవ విడత జరుగుతున్న ప్రాదేశిక పోలింగ్‌ సందర్భంగా శాయంపేట-2 ఎంపీటీసీ బిజెపి అభ్యర్థి కోడెపాక స్వరూప ఓటర్లకు బిజెపికి ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి, శాయంపేట జడ్పీటిసి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గండ్ర జ్యోతి మండలకేంద్రంలో స్వరూప వద్దకు వెళ్లి ఇక్కడ ఇంకా బిజెపి ఉందా…బిజెపి ఎక్కడిది…బిజెపికి ఓటు వేయాలని అడుగుతున్నావా…చెప్పుతో కొడతా…అంటూ దళిత మహిళ అయిన స్వరూపను ఇష్టం వచ్చినట్లు తిట్టిందని బిజెపి ఎంపీటీసీ అభ్యర్థి కోడెపాక స్వరూప తెలిపారు.

ఈ సందర్భంగా కోడెపాక స్వరూప మాట్లాడుతూ శుక్రవారం పోలింగ్‌ కేంద్రం వద్ద తాను ఓటర్లకు పువ్వుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా గండ్ర జ్యోతి తన వద్దకు వచ్చి దళిత మహిళనైన నన్ను చెప్పుతో కొడతానని ఇష్టంవచ్చినట్లు తిట్టిందని ఆరోపించింది. గతంలో తాను ఉపసర్పంచ్‌గా పనిచేసిన విషయాన్ని కూడా మరచి నన్ను చెప్పుతో కొడతానని అనడం టిఆర్‌ఎస్‌ పార్టీ దౌర్జన్యానికి అగ్రకుల అహాంకారానికి గండ్ర జ్యోతి వ్యవహారించిన తీరే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

kazipet cipia HRClo firyadu, కాజీపేట సిఐపై హెచ్‌ఆర్‌సిలో పిర్యాదు

కాజీపేట సిఐపై హెచ్‌ఆర్‌సిలో పిర్యాదు

తన భూమి విషయంలో కాజీపేట సిఐ అజయ్‌కుమార్‌ తనను బెదిరింపులకు గురిచేస్తూ తన ప్రత్యర్థులకు సహకరిస్తున్నాడని వడ్డేపల్లికి చెందిన కటకం సంపత్‌ గురువారం మానవహక్కుల కమిషన్‌కు పిర్యాదు చేసారు. కాజీపేట సిఐ భూకబ్జాదారులకు సహకరిస్తూ తనపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నాడని, రౌడీషీట్‌ నమోదు చేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సిఐ అండతో భూకబ్జాదారులు తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, సీఐ తరుచుగా ఫోన్‌ చేస్తూ బూతులు తిడుతూ స్టేషన్‌కు రావాలని వేధిస్తున్నాడని లేఖలో భాదితుడు సంపత్‌ ఆరోపించాడు. భూమి విషయంలో కోర్టు నుంచి తనకు అనుకూలంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉందని సీఐకి వివరించే ప్రయత్నం చేసినా తన మాటను లెక్క చేయకుండా పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందేనని ఫోన్‌లో బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ భూమికి సంబంధించిన వివాదం కోర్టు విచారణలో ఉందని బాధితుడు తెలిపారు.

acbki chikkina avinithi chepa, ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

అవినీతికి పాల్పడుతూ మెప్మాకు చెందిన ఓ కో-ఆర్డినేటర్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మెప్మా సమన్వయ అధికారి (డిఎంసి) కమలశ్రీ పొదుపు సంఘం సభ్యురాలి వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. రుణం మంజూరుకూ, రిసోర్స్‌ పర్సన్‌ నియామకానికి సంబంధించి లంచం డిమాండ్‌ చేసి, రూ.40 వేలు తీసుకుంటుండగా అధికారులు రైడ్‌ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు.

vidyarthi jivithalatho kalashala yajamanyam chelagatam, విద్యార్థి జీవితాలతో కళాశాల యాజమాన్యం చెలగాటం

విద్యార్థి జీవితాలతో కళాశాల యాజమాన్యం చెలగాటం

సుబేదారి పీఎస్‌లో యాజమాన్యంపై విద్యార్థి ఫిర్యాదు

విద్యాబుద్దులు నేర్పాల్సిన అధ్యాపకులు గుండాల్లా వ్యవహరించిన తీరు, మానవత్వాన్ని చేపాల్సిన కాలేజి యాజమాన్యం అధిక ఫీజుల రూపంలో మానవమృగాలై విద్యార్థి జీవితాన్ని సర్వనాశనం చేసిన ఘటన, మృదువుగా విద్యార్థి తల్లిని కాలేజికి రప్పించి మూకుమ్మడిగా ఆ తల్లిపై బెదురింపులకు పాల్పడిన కాలేజి అధ్యాపక బృందం. అడ్మిషన్‌ సమయంలో ఒప్పందం చేసుకున్న ఫీజు కంటే ఎక్కువ ఫీజు కట్టాలని ఒత్తిడి చేసిన వైనం. ఫీజు చెల్లించలేదన్న సాకుతో నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా విద్యార్థి పరీక్షా ఫీజును ఇంటర్మీడియట్‌ బోర్డులో చెల్లించకుండా భవిష్యత్‌ను బజారుపాల్జేసిన ఘోర తప్పిదం. మా అబ్బాయి పరీక్షా ఫీజును ఎందుకు కట్టలేదని ప్రశ్నించిన తల్లిదండ్రులపై విద్యా విలువలను మట్టిలో గలిపి విద్యార్తి పేరెంట్స్‌ పైనే కాలేజి యాజమాన్యం సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో అక్రమ ఫిర్యాదు చేసిన తీరు అందరిని విస్మయానికి గురి చేస్తున్నది.ఇంటర్మీడియట్‌ బోర్డు డి.ఐ.ఈ.వో ప్రధానకార్యాలయానికి కూతవేటు దూరంలో వున్న ఓ ప్రైవేటు జూనియర్‌ కాలేజి నిబంధనలకు విరుద్దంగా నడుపుతూ, ఓ విద్యార్థి జీవితాన్ని కాలేజి యాజమాన్యం సర్వనాశనం చేసి, విద్యార్థి తల్లిని కాలేజికి పిలిపించి పదిమందికి పైగా కాలేజి అధ్యపకులు చుట్టు ముట్టి రౌఢీల్లా వ్యవహరించిన తీరుపై నగర ప్రజలు,విద్యార్థులు,విద్యార్థిసంఘాలు,ప్రజాసంఘాలు,విద్యావేత్తలు,విద్యార్థుల తల్లిదండ్రులు ఆ కాలేజి పై పెదవి విరుస్తున్నారు.

shubanandini karyalayam mundu andholana, శుభనందిని కార్యాలయం ముందు ఆందోళన

శుభనందిని కార్యాలయం ముందు ఆందోళన

మహబూబాబాద్‌ జిల్లా పట్టణంలోని శుభనందిని చిట్‌ఫండ్‌ ప్రధానకార్యాలయం ముందు బాదితులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా బాదితులు మాట్లాడుతూ శుభనందిని చిట్‌ఫండ్‌లో నెలనెల చిట్టీలు కట్టామని,చిట్టీ ఎత్తుకున్న తతువాత డబ్తులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని బాదితులు తెలిపారు.ఇప్పుడిస్గాము,అప్పుడిస్తామంటూ కాలయాపన చేస్తుండటంతో ఆందోళన చేపట్టామని మాకు రావల్సిన చిట్టీ డబ్బులు ఇచ్చేంత వరకు మా ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు.

okka cc camera vanda manditho samanam, ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం

ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం

సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ పి.సదయ్య

నగరంలో ఇంటి యజమానులు ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ పి.సదయ్య ప్రజలకు సూచించారు.సీసీ కెమెరాలతో ఇంటికి ఎంతో భద్రత వుంటుందని, ఒక్కో సీసీ కెమెరా వందమందితో సమానం అని అన్నారు.నగరంలో రోజురోజుకు దొంగలు పెట్రేగాపోతూ తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారని వీరి బారి నుండి రక్షించుకోవడానికి ప్రతి ఒక్క ఇంటి యజమాని సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు.30-40 లక్షలు పెట్టి ఇంటిని నిర్మించుకొని 20 వేల రూపాయలకు వచ్చే సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అలా కాకుండా ఇంటి భద్రత కొరకు సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సదయ్య నగర ప్రజలను కోరారు.

samyuktha collectorga yasmin basha, సంయుక్త కలెక్టర్‌గా యాస్మిన్‌ భాషా

సంయుక్త కలెక్టర్‌గా యాస్మిన్‌ భాషా

రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌గా యాస్మిన్‌ భాషా కలెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. నాన్‌ క్యాడర్‌ హోదాలో రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పనిచేస్తున్న యాస్మిన్‌ భాషాకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కన్‌ఫర్డ్‌ ఐఎఎస్‌ హోదా ఇచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. జెసితోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మరో 10మందికి కలిపి మొత్తం 11మందికి కన్‌ఫర్డ్‌ ఐఎఎస్‌ హోదాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.

కొత్తగా ఐఎఎస్‌ పదోన్నతి పొందిన యాస్మిన్‌ భాషాకు నూతన హోదాతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యాస్మిన్‌ భాషా ఐఎఎస్‌ హోదాతో రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఐఎఎస్‌ హోదాతో జేసిగా బాధ్యతలు స్వీకరించిన జెసి యాస్మిన్‌ భాషాకు జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి ఫోన్‌లో అభినందించారు. డిఆర్వో ఎన్‌.ఖీమ్యానాయక్‌, ఆర్డీఓ టి.శ్రీనివాసరావు, డిఆర్‌డిఓ బి.రవీందర్‌, డిఇఓ రాధాకిషన్‌, డిసిఎస్‌ఓ శ్రీనాథ్‌, డిపిఆర్వో మామిండ్ల దశరథం, పౌరసరఫరాల సంస్థ డిఎం శ్రీకాంత్‌, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ పరిపాలనా అధికారి గంగయ్య, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రసాద్‌, విజయ్‌, రామకష్ణ, ప్రశాంత్‌, ఇతర కలెక్టరేట్‌ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ బాధ్యతల స్వీకరణ అనంతరం జెసి యాస్మిన్‌ భాషా మాట్లాడుతూ ఐఎఎస్‌ హోదా మరింత భాద్యతను పెంచిందన్నారు. ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు మరింత విస్తత సేవ చేసేందుకు అవకాశం లభించిందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

aropanalu nirupinchakunte udyogam vadulukuntava…, ఆరోపణలు నిరూపించకుంటే ఉద్యోగం వదులుకుంటావా…?

ఆరోపణలు నిరూపించకుంటే ఉద్యోగం వదులుకుంటావా…?

కాజీపేట సీఐకి కార్పోరేటర్‌ బహిరంగ లేఖ

‘ఖాకి ఎంత కఠినం’ శీర్షికన ‘నేటిధాత్రి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై దుమారం రేగుతోంది. కథనం ప్రచురితం కాగానే కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ పత్రికకు సంబంధించిన వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ మెసేజ్‌ పోస్టు చేశారు. ఈ మెసేజ్‌లో పత్రికపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూనే కబ్జా కార్పోరేటర్‌కు సహకరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిడిదొడ్డి స్వప్న స్పందించారు. సీఐ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు. చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ గురువాంర ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. భూమి విషయంలో అన్ని అర్హతలు ఉన్న బాధితుడు తనకు వినతిపత్రం ఇచ్చాడని భూమికి సంబంధించిన అన్ని పత్రాలను ‘నేటిధాత్రి’ గ్రూప్‌లో పోస్టు చేశారు. తనపై సీఐ చేసిన ఆరోపణలు నిరూపిస్తే కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించకుంటే సీఐ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడా…? అని సవాల్‌ విసిరారు. కబ్జాదారులకు ఎవరు సహకరిస్తున్నారో అందరికీ తెలుసునని, బాధితుల భూమి సర్వే నెంబర్‌ 641, సీఐ సహకరిస్తున్న వారి సర్వే నెంబర్‌ 730, 731లకు కిలోమీటర్‌ దూరం ఉందని అన్నారు. సీఐ కావాలనే ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సివిల్‌ విషయంలో తలదూర్చి బాధితుడిని బెదిరింపులకు గురిచేస్తున్నాడని కార్పొరేటర్‌ సీఐ, బాధితుడిని బెదిరిస్తున్న ఆడియోను విడుదల చేశారు.

చట్టప్రకారం నడుచుకుంటాం

కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌

తాము చట్టప్రకారమే నడుచుకుంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. కార్పొరేటర్‌ స్వప్న బహిరంగ లేఖపై స్పందించిన ఆయన ఎవరి పక్షం వహించాల్సిన అవసరం తమకు లేదని, చట్టప్రకారం నడుచుకుంటూ న్యాయం పక్షమే తాముంటామని అన్నారు. భూమి ఎవరిదనేది కోర్టు తేల్చుతుందన్నారు.

bukabzalatho maaku sambandham ledu, భూకబ్జాలతో మాకు సంబంధం లేదు

భూకబ్జాలతో మాకు సంబంధం లేదు

కార్పొరేటర్‌ మేడిది రజిత మధుసూదన్‌

నేటిధాత్రి బ్యూరో: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ఎలాంటి భూకబ్జాలతో తమకు సంబంధం లేదని 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ మేడిది రజిత మధుసూదన్‌ ‘నేటిధాత్రి’కి స్పష్టం చేశారు. భూకబ్జాల విషయంలో తమ డివిజన్‌ను ప్రస్తావించడాన్ని వారు ఖండించారు. మూడు దశాబ్ధాల రాజకీయ జీవితంలో తన భర్త కాని, 21వ డివిజన్‌లో ప్రజాభిమానాన్ని చూరగోని భారీ మెజార్టీతో గెలుపొందిన తానుగానీ, ప్రజల పక్షమే నిలుస్తాం తప్ప ప్రజావ్యతిరేకమైన పనులను ఏనాడు చేయమన్నారు. 21వ డివిజన్‌లో ఎలాంటి భూకబ్జాలకు తాము పాల్పడటం కానీ, ఎవరికీ సహకరించడం కానీ చేయడం లేదని అన్నారు. ఎవరు గిట్టని వారు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని, భూములను కోల్పోయిన భాదితులు ఎవరైన తమపై ఆరోపణలు చేస్తే అవి తప్పని నిరూపించడానికి తాము సిద్ధమన్నారు. కార్పోరేటర్‌గా గెలిచిన దగ్గర నుంచి ప్రజల్లో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేశామే తప్ప అక్రమాలకు ఎన్నడు పాల్పడలేదని, పాల్పడబోమని అన్నారు. తమపై ఎవరైన నారాధారమైన ఆరోపణలు చేస్తే అవి తప్పని నిరూపిస్తామని, చేయనప్పుడు తాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాసేవ చేయడం తప్ప కబ్జాలు, అవినీతి, అక్రమాలు చేయడం తమకు రాదన్నారు. డివిజన్‌లో ఎవరిని పలకరించిన తమకు క్లీన్‌చీట్‌ ఇస్తారని రాజకీయాల్లో నీతిగా తాము మెదలుతున్నామన్నారు.

 

marosari bariga bangaram pattivetha, మరోసారి భారీగా బంగారం పట్టివేత ..

మరోసారి భారీగా బంగారం పట్టివేత ..

దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి మూడున్నర కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోదుస్తుల్లో ప్రత్యేకమైన జేబులను తయారుచేసుకుని బంగారాన్ని ప్రయాణికులు తీసుకువచ్చారు. బంగారం విలువ కోటి రూపాయల పైచిలుకు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలుపుతున్నారు. ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని కస్టమ్స్‌ అధికారులు విచారిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే 7కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

june 1 nunchi kotha ration cardulu, జూన్‌ 1 నుంచి కొత్త రేషన్‌ కార్డులు

జూన్‌ 1 నుంచి కొత్త రేషన్‌ కార్డులు

తెలంగాణలో జూన్‌ 1వ తేదీ నుంచి కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను పౌరసరఫరాల శాఖ వేగవంతం చేసింది. ఇందుకోసం రెండు కమిటీలను నియమించింది. కొత్తగా రేషన్‌కార్డులకోసం

దరఖాస్తు చేసుకునేవారు, కొత్త పేర్లను చేర్చుకునేవారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

ప్రజలే మా కుటుంబం…సేవయే కర్తవ్యం : ఐనవోలు-2 ఎంపిటిసి అభ్యర్ధి మార్నేని మధుమతి రవిందర్‌రావు

ఐనవోలు (వర్ధన్నపేట), నేటిధాత్రి: కుటుంబమంతా సమాజసేవలోనే కొనసాగుతున్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని చేయడానికి ప్రజలు ఇచ్చిన ఆశిస్సులతో ముందుకు సాగుతున్నారు. దశాబ్దాలకాలంగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూనే వారు సంతృప్తి చెందుతున్నారు. స్థానికంగా మార్నేని వంశస్థులు చేసిన ప్రజాసేవను వారసత్వంగా స్వీకరించి సమాజసేవలోనే తరిస్తున్నారు. రాజకీయ జీవితంలో నిజమైన నాయకత్వ లక్షణాలతో ప్రజల గుండెల్లొ నిలిచిన ఎంపిపి మార్నేని రవిందర్‌రావు సేవలు మరోమారు ప్రజలు ముక్తకంఠంతో కోరకున్న తరుణంలో రిజర్వేషన్ల మార్పులు జరిగి అవకాశం మహిళలకు రావడంతో సేవ చేయడానికి ప్రజల కోరిక మేరకు ఎంపిటిసి బరిలో ఉన్న మార్నేని మధుమతి రవిందర్‌రావుతో నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ

నేటిధాత్రి ప్రతినిధి: మార్నేని కుటుంబం నుండి ప్రజాజీవితంలో రెండు దశాబ్దాల కాలంగా ఉన్నారు.ప్రస్తుతం అభ్యర్ధిగా పోటిలో ఉన్నారు ప్రజల స్పందన ఎమిటి?

మధుమతి రవిందర్‌రావు: మార్నేని వంశంలో సభ్యురాలిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తా.ఎందుకంటే సమాజసేవలో ప్రజల బాగోగులు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసే అదృష్టం దక్కింది. చిన్నతనం నుండే సమాజసేవ గురించి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల గురించి అవగతం చేసుకునే అవకాశం మా కుటుంబం నుండే వచ్చింది. మా తల్లిదండ్రులు కూడా ప్రజాక్షేత్రంలో దశాబ్దాల కాలంగా ప్రజాప్రతినిధులుగా ఉండడం వలన ప్రజాసేవలో ప్రత్యక్ష అనుభవం ఉంది. మార్నేని కుటుంబంలోకి సభ్యురాలిగా వచ్చిన దగ్గర నుండి మరింత దగ్గరగా ప్రజలతో ఉండే అవకాశం నాకు దొరికింది.నా జీవితంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక అభ్యర్ధిగా పోటిలో ఉన్న విషయానికొస్తే నా అభ్యర్ధిత్వం నేను కోరుకున్నది కాదు స్థానిక ప్రజలు నేను ఇంతకాలం వారికి చేసిన సేవలు ప్రత్యక్షంగా చేసేందుకు నాకు ఇచ్చిన అవకాశంగానే భావిస్తున్నా.నేను పోటి చేసేది పదవుల కోరకు ప్రజాసేవను మరింత బాధ్యతగా స్వీకరించడానికి. వారు కోరి ఇచ్చిన అభ్యర్ధిత్వం కాబట్టి ప్రచార కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గోన్నారు. వారి అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.

ప్రతినిధి:ప్రజలు మీ నాయకత్వాన్ని కోరకోవడం గురించి మీ అభిప్రాయం ?

మధుమతి రవిందర్‌రావు: ప్రజలకు ఇంతకాలం చేసిన సేవయే నన్ను నాయకత్వ విషయంలో ప్రతిపాధించేలా చేసింది. వారు నా నుండి కోరకుంటున్న సేవ విషయంలో మరింత బాధ్యతగా ఉంటాను. సాధారణ గృహిణిగా ఉన్నప్పటికి నాభర్త ఇంతకాలంగా చేస్తున్న సమాజ సేవలో పరోక్షంగా పాలుపంచుకునే అవకాశం లభించింది. ఎట్టి పరిస్థితుల్లో మండల కేంద్రం నిలిచిపోకూడదనే అభిప్రాయంతో నాపై నమ్మకంతో ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని పోదడం పట్ల నేను చేసిన సేవలకు లభించిన నమ్మకం. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను.

ప్రతినిధి:ప్రజలు ఆశిర్వదిస్తే మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏమిటి.?

మధుమతి రవిందర్‌రావు: ఎంతోకాలంగా ప్రజలు కోరుకున్న ఐనవోలు గ్రామం మండలంగా మారింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మండల వ్యవస్థకు అవసరమైన అన్ని వ్యవస్థల ఏర్పాటుకు కృషి చేస్తా. స్థానికంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం. స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం. పంచాయితీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డిల సహకారంతో అభివృద్ధి కోరకు అవసరమైన నిధులు తీసుకువచ్చి ఆదర్శమండల కేంద్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.

పార్టీ నిర్మాణమే కుటుంబ అభివృద్ధిగా భావించా : ఐనవోలు మండల టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి గజ్జెల శ్రీరాములు

పార్టీ నిర్మాణమే కుటుంబ అభివృద్ధిగా భావించా

పార్టీల్లో నాయకులుగా ఉండడం పదవులు ఆశించడం ఎలాగోలా ఎదో ఒక పదవి తెచ్చుకొవడం ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధరణంగా చూస్తునే ఉంటాం. మరికొంతమందైతే ధనబలాన్ని,బంధుత్వబలాన్ని ఉపయోగించుకుని నేరుగా పదవులు అనుభవిస్తున్న వ్యక్తులను చూస్తూనే ఉంటాం. కాని ఎలాంటి పదవులు లేకున్నా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి కనీస ఆదరణ లేని సమయంలో పార్టీలోకి వచ్చి ప్రజల ఆకాంక్షను నేరవేర్చే ఉద్యమంలో తనవంతు పాత ఉండాలనే సదుద్దేశ్యంతో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాటి నుండి పార్టీ కార్యమ్రాల్లో పాలు పంచుకుంటూనే పార్టీని క్రమంగా ముందుకు తీసుకెళ్ళడంలో అహర్నిశలు కష్టపడ్డాడు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న విధానంతో నానాటికి కార్యకర్తలు పెరుగుతూ వచ్చారు. పార్టీ కొరకు,ప్రజల ఆకాంక్ష కొరకు కుటుంబ సభ్యులతో సమయాన్ని కూడా వెచ్చించకుండా దొరికిన ప్రతి క్షణాన్ని పార్టీ నిర్మాణానికి,ఉద్యమ ఒరవడికే కేటాయించారు. పార్టీ నిర్మాణం కోరకు ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఆయనను 18 సంవత్సరాల కాలంపాటు మండలపార్టీ అధ్యక్షుడిగా కోనసాగించాయి. రాష్ట్రంలో తెలుగుదేశం,కాంగ్రేస్‌ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో కూడా ఏనాడు ఉద్యమస్ఫూర్తిని వీడలేదు.తాను భాగస్వామ్యం అయిన ఉద్యమ ఫలితం రాష్ట్రం సిద్దించినా,తాను కార్యకర్తగా పని చేసిన పార్టీ అధికారంలోకి వచ్చినా ఏనాడు పదవుల కోరకు పాకులాడని సహనం ఆయన సోంతం.అందుకే ఆయనను ప్రస్తుతం జరుగుతున్న పరిషత్‌ ఎన్నికల్లో పార్టీ,స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్‌ల నిర్ణయం మేరకు జెడ్పీటీసి సభ్యుడిగా పోటి చేస్తున్నారు.ఆయనే మండలంలోని నందనం గ్రామానికి చెందిన గజ్జెల శ్రీరాములు.ప్రస్తుత ఎన్నికల ప్రచారం,తన అభ్యర్ధిత్వంపై గ్రామాల్లో ప్రజల నుండి వస్తున్న ఆదరణ తదితర అంశాలను గురించి ఆయన పంచకున్న విశేషాలు నేటిధాత్రిలో ప్రత్యేక ఇంటర్వ్యూ…

నేటిధాత్రి ప్రతినిధి: గ్రామాల్లో ప్రచారం ఎలా జరుగతుంది.?

జడ్పీటిసి అభ్యర్ధి: గ్రామాల్లో ప్రతి రోజు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆయా గ్రామాలకు సంబంధించిన పార్టీ అభ్యర్ధుల ప్రచారంతో పాటు జడ్పీటీసి అభ్యర్ధిగా నేను కూడా ఒక ప్రణాలికతో ప్రచారంలో ముందకు సాగడం జరుగుంది. ఇప్పటికే స్వయంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. అధే విధంగా స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్‌,నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జీ మర్రి యాదవరెడ్డి,ఎంపిపి మార్నేని రవిందర్‌రావులతో మరోమారు గ్రామాల్లో రోడ్‌షోలు నిర్వహించాం.

ప్రతినిధి: ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది.?

జడ్పీటీసి అభ్యర్ధి: ప్రజల చాలా ఆదరణ చూపిస్తున్నారు. ఇంతకాలం ఎన్నికల్లో ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పదేపదే చెప్పాల్సి వచ్చేది. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను గురించి ప్రతి వ్యక్తి ఈ రోజు చర్చించుకుంటున్నారంటే ఫ్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజల చెంతకు చేరాయి. ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. అందుకే వారు ఈ ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్ధులను వ్యక్తిగతంగా కంటే పార్టీ అభ్యర్ధులుగా ఆదరిస్తున్న తీరు హర్షనీయం.

ప్రతినిధి: పార్టీ అభ్యర్ధుల ఎంపికలో ఏఏ విషయాలను పరిగణలోకి తీసుకున్నారు?

జడ్పీటీసి అభ్యర్ధి: పరిషత్‌ ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్ధుల ఎంపికలో స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు కోరకున్న అభ్యర్ధులకు అభ్యర్ధిత్వం ఇవ్వడానికి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చారు.అధే విధంగా గ్రామాల్లో పార్టీ విధేయులకు,పార్టీ కోరకు పని చేస్తూ సేవ చేయగలగే వ్యక్తులకు ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించడం జరిగింది. అభ్యర్ధుల ఎంపికను ప్రజలు గమనించారు.కాబట్టే ఇప్పటికే మండలంలో ఉన్న ఐనవోలు 1 ఎంపిటిసి,వనమాల కనపర్తి అభ్యర్ధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధే విధంగా మిగిలిన అన్ని స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించడం ఖాయం

ప్రతినిధి:మీకు జెడ్పీటీసి అభ్యర్ధిగా అవకాశం ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం?

జడ్పీటీసి అభ్యర్ధి: అధికారం కోసం మాత్రమే కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే స్ధానికంగా పార్టీ కోరకు,రాష్ట్రం కోరకు పని చేసిన గులాబీ సైనికులు చాలామంది ఉన్నారు. ఇంతకాలం పార్టీలో ఇచ్చిన బాధ్యతలు నిర్వహించిన తీరు,ఉద్యమ నేపథ్యం ఇలాంటి అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని తనకు అవకాశం ఇచ్చారు.ఇచ్చిన అభ్యర్ధిత్వం ప్రజలు ఆశిర్వదించి జెడ్పీటీసిగా ఎన్నుకుంటే ఈ తరుణంలో మరింత భాద్యత పెరుగుతుందనే అనుకుంటున్నా. ఎందేకంటే మండలంలో ఉన్న ఉద్యమకారులను,పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సి బాధ్యత నాపై ఉంది.బహూశా రానున్న రోజుల్లో ఉద్యమకారులకు మంచి రోజులు వస్తాన్నాయనే ఒక సూచనను ఇవ్వడానికే నాకు ఈ అవకాశం ఇచ్చారని భావిస్తున్నా.ఎది ఏమైనా తనపై నమ్మకంలో తనకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టుకుని తన విజయాన్ని స్థానిక శాససభ్యులు ఆరూరి రమేష్‌కు కానుకగా ఇస్తా. అధే విధంగా తన అభ్యర్ధిత్వానికి సహకరించిన నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జీ మర్రి యాదవరెడ్డి,ఎంపిపి మార్నేని రవిందర్‌రావు, ఇండ్ల నాగేశ్వర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు,అంతేకాకుండా తన ప్రచార కార్యక్రమాల్లో సహకరిస్తున మండల పార్టీ అధ్యక్షుడు మునిగాల సమ్మయ్య,మండల పార్టీ అధికార ప్రతినిధి మిద్దెపాక రవిందర్‌, మార్నేని యువసేన బాధ్యులు డబ్బా శ్రీనులకు ఋణపడి ఉంటా.

encounterlo iddaru mavolu mruthi, ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి

సుఖ్మా జిల్లా దంతెవాడలోని ఆర్నాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో డీఆర్‌ జీ, ఎస్‌టీఎఫ్‌ బందాలు కూంబింగ్‌ నిర్వహించాయి. కూంబింగ్‌ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. మావోయిస్టులు ఎదురుకాల్పులు జరపడంతో కూంబింగ్‌ బృందాలు కూడా ఎదురు కాల్పులు చేయగా ఇద్దరు మావోలు మతిచెందారు. వీరిలో ఒకరు పురుషుడు, ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. వీరి వద్ద నుండి విప్లవ సాహిత్యం, ఒక ఇన్‌ సాస్‌, 12 బోర్‌ వెపన్‌లను పోలీస్‌ బందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా ఎన్‌కౌంటర్‌ కొనసాగుతూనే ఉంది.

rakthadana shibiram, రక్తదాన శిబిరం

రక్తదాన శిబిరం

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలలో క్షతగాత్రులకు సరైన సమయంలో రక్తం అందుబాటులో లేక చాలామంది మరణిస్తున్నారని, అలాగే ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు శరీరంలో ఉండాల్సిన రక్తం కంటే తక్కువగా ఉన్నప్పుడు అనేక జబ్బులకు గురికావల్సి వస్తుందని వీరికి రక్తం అందించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ రక్తం బ్లడ్‌ బ్యాంక్‌లలో ఒక్కొక్కసారి అందుబాటులో ఉండటం లేదని, దీనికంతటికి కారణం దాతలు రక్తదానాలు చేయకపోవడమే ప్రధాన కారణమని కాజీపేట ఏసీపీ నర్సింగరావు అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలకేంద్రానికి చెందిన చిలుక మేఘన స్వేరో తన శరీరంలో ఉండాల్సిన రక్తం కంటే తక్కువ ఉండి బ్రెయిన్‌ ట్యూమర్‌కు గురై మరణించడం జరిగింది. ఇలాంటి మరణాలు నివారించడానికి ఆమె జ్ఞాపకార్థంగా ధర్మసాగర్‌ మండలకేంద్రంలో అంబేద్కర్‌ విజ్ఞాన మందిరం ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘం అధ్యక్షుడు బొడ్డు ధనుంజయరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గురుకులాల ప్రిన్సిపాల్‌ సెక్రటరీ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ రక్తదాన శిబిరం గురువారం వరంగల్‌ ఎంజిఎం బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతుందని యువకులు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్‌ను కాజీపేట ఏసీపీ నర్సింగరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంజిఎం వైద్యులు డాక్టర్‌ బి.రాజమోహన్‌, డాక్టర్‌ జి.వేణు, డాక్టర్‌ మల్లిఖార్జున్‌, డాక్టర్‌ కొమురయ్య, మడికొండ సీఐ జాన్‌నర్సింహులు, స్థానిక సీఐ శ్రీలక్ష్మీ, ఎస్సై విజయ్‌రామ్‌కుమార్‌, బొడ్డు ప్రసాద్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

athmiya sanmanam, ఆత్మీయ సన్మానం

ఆత్మీయ సన్మానం

గ్రేటర్‌ వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాష్‌కు గురువారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆత్మీయ సన్మానం కార్యక్రమం వరంగల్‌ తూర్పు వర్కింగ్‌ జర్నలిస్ట్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వరంగల్‌ చౌరస్తాలోని ఆర్యవైశ్య భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు వర్కింగ్‌ జర్నలిస్టు సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మేయర్‌ గుండా ప్రకాష్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని, వరంగల్‌ తూర్పు వర్కింగ్‌ జర్నలిస్టులు చేసిన సత్కారాన్ని తాను మర్చిపోలేనని అన్నారు. జర్నలిస్టుల ఇండ్ల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి జర్నలిస్టులకు గహాలను అందేలా కషి చేస్తానని తెలిపారు. ప్రజల సేవకే అంకితం కావాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, నగర అభివద్ధికి అహర్నిశలు కషి చేస్తానని హామీ ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version