ప్రజలే మా కుటుంబం…సేవయే కర్తవ్యం : ఐనవోలు-1 ఎంపిటిసి అభ్యర్ధి మార్నేని మధుమతి రవిందర్‌రావు

కుటుంబమంతా సమాజసేవలోనే కొనసాగుతున్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని చేయడానికి ప్రజలు ఇచ్చిన ఆశిస్సులతో ముందుకు సాగుతున్నారు. దశాబ్దాలకాలంగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూనే వారు సంతృప్తి చెందుతున్నారు. స్థానికంగా మార్నేని వంశస్థులు చేసిన ప్రజాసేవను వారసత్వంగా స్వీకరించి సమాజసేవలోనే తరిస్తున్నారు. రాజకీయ జీవితంలో నిజమైన నాయకత్వ లక్షణాలతో ప్రజల గుండెల్లొ నిలిచిన ఎంపిపి మార్నేని రవిందర్‌రావు సేవలు మరోమారు ప్రజలు ముక్తకంఠంతో కోరకున్న తరుణంలో రిజర్వేషన్ల మార్పులు జరిగి అవకాశం మహిళలకు రావడంతో సేవ చేయడానికి ప్రజల కోరిక మేరకు ఎంపిటిసి బరిలో ఉన్న మార్నేని మధుమతి రవిందర్‌రావుతో నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ

నేటిధాత్రి ప్రతినిధి: మార్నేని కుటుంబం నుండి ప్రజాజీవితంలో రెండు దశాబ్దాల కాలంగా ఉన్నారు.ప్రస్తుతం అభ్యర్ధిగా పోటిలో ఉన్నారు ప్రజల స్పందన ఎమిటి?

మధుమతి రవిందర్‌రావు: మార్నేని వంశంలో సభ్యురాలిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తా.ఎందుకంటే సమాజసేవలో ప్రజల బాగోగులు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసే అదృష్టం దక్కింది. చిన్నతనం నుండే సమాజసేవ గురించి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల గురించి అవగతం చేసుకునే అవకాశం మా కుటుంబం నుండే వచ్చింది. మా తల్లిదండ్రులు కూడా ప్రజాక్షేత్రంలో దశాబ్దాల కాలంగా ప్రజాప్రతినిధులుగా ఉండడం వలన ప్రజాసేవలో ప్రత్యక్ష అనుభవం ఉంది. మార్నేని కుటుంబంలోకి సభ్యురాలిగా వచ్చిన దగ్గర నుండి మరింత దగ్గరగా ప్రజలతో ఉండే అవకాశం నాకు దొరికింది.నా జీవితంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక అభ్యర్ధిగా పోటిలో ఉన్న విషయానికొస్తే నా అభ్యర్ధిత్వం నేను కోరుకున్నది కాదు స్థానిక ప్రజలు నేను ఇంతకాలం వారికి చేసిన సేవలు ప్రత్యక్షంగా చేసేందుకు నాకు ఇచ్చిన అవకాశంగానే భావిస్తున్నా.నేను పోటి చేసేది పదవుల కోరకు ప్రజాసేవను మరింత బాధ్యతగా స్వీకరించడానికి. వారు కోరి ఇచ్చిన అభ్యర్ధిత్వం కాబట్టి ప్రచార కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గోన్నారు. వారి అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.

ప్రతినిధి:ప్రజలు మీ నాయకత్వాన్ని కోరకోవడం గురించి మీ అభిప్రాయం ?

మధుమతి రవిందర్‌రావు: ప్రజలకు ఇంతకాలం చేసిన సేవయే నన్ను నాయకత్వ విషయంలో ప్రతిపాధించేలా చేసింది. వారు నా నుండి కోరకుంటున్న సేవ విషయంలో మరింత బాధ్యతగా ఉంటాను. సాధారణ గృహిణిగా ఉన్నప్పటికి నాభర్త ఇంతకాలంగా చేస్తున్న సమాజ సేవలో పరోక్షంగా పాలుపంచుకునే అవకాశం లభించింది. ఎట్టి పరిస్థితుల్లో మండల కేంద్రం నిలిచిపోకూడదనే అభిప్రాయంతో నాపై నమ్మకంతో ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని పోదడం పట్ల నేను చేసిన సేవలకు లభించిన నమ్మకం. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను.

ప్రతినిధి:ప్రజలు ఆశిర్వదిస్తే మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏమిటి.?

మధుమతి రవిందర్‌రావు: ఎంతోకాలంగా ప్రజలు కోరుకున్న ఐనవోలు గ్రామం మండలంగా మారింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మండల వ్యవస్థకు అవసరమైన అన్ని వ్యవస్థల ఏర్పాటుకు కృషి చేస్తా. స్థానికంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం. స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం. పంచాయితీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డిల సహకారంతో అభివృద్ధి కోరకు అవసరమైన నిధులు తీసుకువచ్చి ఆదర్శమండల కేంద్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.

ci overaction, సీఐ ఓవరాక్షన్‌

సీఐ ఓవరాక్షన్‌

వరంగల్‌ నగరంలో భూకబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల, భూకబ్జాదారులకు సహకరించిన పోలీసు అధికారుల పట్ల పోలీస్‌శాఖ కఠినంగా వ్యవహారిస్తుందని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ పదేపదే చెబుతున్న పోలీస్‌ బాస్‌ మాటలను పెడచెవిన పెడుతూ యథేచ్చగా భూకబ్జాదారులకు పోలీస్‌ అధికారులు సహకరిస్తున్నారని నగర ప్రజలు విమర్శిస్తున్నారు. వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన మిడిదొడ్డి సంపత్‌ అనే భూభాదితుడిని కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ తీవ్ర వేధింపులకు, బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితుడు తన ఆవేదనను ‘నేటిధాత్రి’కి వ్యక్తం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…హన్మకొండ మండలం వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన మిడిదొడ్డి సంపత్‌ భూబాధితుడికి సర్వే నెంబర్‌ 641/ఎ/ఇ లో గల స్థలం విషయంలో వివాదం ఉంది. ఈ వివాదానికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తున్న క్రమంలో బాధితుడైన సంపత్‌కు కోర్టు అనుకూలంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. అయినప్పటికీ కొంతమంది భూకబ్జాదారులు 641/ఎ/ఇ వడ్డేపల్లిలోని ప్రశాంత్‌నగర్‌ స్థలంలో అక్రమనిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ తనకు ఫోన్‌ చేసి ప్రశాంత్‌నగర్‌ స్థలవివాదంలో పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ మీపై కేసు నమోదైందని వస్తావా…రావా…అంటూ పరుషపదజాలంతో తిడుతూ బెదిరించాడని తెలిపారు. ఆ స్థలం మాదేనని కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా కబ్జాదారులకు వంతపాడుతూ తమను మానసికంగా భయభ్రాంతులకు గురిచేస్తూ వేధిస్తున్నాడని చెప్పాడు. మాకు కోర్టు నుంచి ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉందని కూడా చెప్పిన వినకుండా పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందే…రాకుంటే బాగుండదని వ్యక్తిగత దూషణ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు రమ్మని ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు…రా…బే…అంటూ అవమానకరంగా మాట్లాడుతూ తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించాడు. నాకు జరుగుతున్న అన్యాయంపై ప్రెస్‌మీట్‌ పెట్టుకుని వాస్తవాలను ప్రజలకు, పోలీసు ఉన్నతాధికారులకు తెలియపరుచుకుంటానని బాధితుడు సీఐకి చెప్పగా ప్రెస్‌మీటే పెట్టుకో…ఇంకేమైనా పెట్టుకో…అంటూ ధ్వంధార్థంతో తిట్టాడని తెలిపాడు. ఇదిలా ఉండగా…భూబాధితుల కోసం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో భూబాధితుల ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినా నగరంలో భూబాధితులకు భూకబ్జాదారుల నుంచి, వారికి సహకరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల నుండి వేధింపులు, బెదిరింపులు తప్పడం లేదని బాధితులు వాపోతున్నారు. పోలీసులు సివిల్‌ తగదాలలో తలదూర్చవద్దని పోలీసు ఉన్నతశాఖ అధికారులు చెబుతున్న నగరంలో కొంతమంది పెడచెవిన పెడుతూ భూబాధితులను పైవిధంగా బెదిరింపులకు గురిచేయడంతోపాటు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి విషయాల్లో గత కొన్ని రోజుల క్రితం భూకబ్జాదారులకు సహకరిస్తున్నాడని విచారణలో తేలడంతో కాకతీయ యూనివర్సిటీ సీఐ రాఘవేందర్‌రావు, ఎస్సై విఠల్‌లను సస్పెండ్‌ చేసిన విషయం మరవకముందే కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ భూకబ్జాదారులకు వంతపాడుతూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ భూబాధితుడిని బెదిరించిన వైనాన్ని చూస్తే పోలీసు అధికారులకు పోలీస్‌ బాస్‌ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల గౌరవం, భయం ఏ మాత్రం లేనట్లు కనిపిస్తుందని నగర ప్రజలు, భూబాధితులు భావిస్తున్నారు. ‘నేటిధాత్రి’ కాజీపేట సీఐని వివరణ కోరేందుకు ఫోన్‌ చేయగా సీఐ అందుబాటులో ఉండటం లేదు.

baari mejaritytho gelipinchukundam…,భారీ మెజారిటీతో గెలుపించుకుందాం….

భారీ మెజారిటీతో గెలుపించుకుందాం….

వర్ధన్నపేట మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జన్ను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి కులానికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత, నిరంతరం బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం కషి చేస్తు, పొదుపు సంఘాలతోనే పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. పొదుపు సంఘాల అభివద్ధికి కషిచేస్తున్న భిక్షపతిని అన్నివర్గాల ప్రజలు ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలుపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర నాయకుడు పినింటి రవీందర్‌ రావు, జిల్లా అధ్యక్షుడు ఎండి.మదర్‌ పాషా, వెంకట్‌ రెడ్డి, రాజయ్య, మహబూబ్‌ఆలీ, సారయ్య, వీరయ్య, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

pranalikalu rupondinchali, నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిలు రూపొందించాలి

నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిలు రూపొందించాలి

వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్ల భాగ్యలక్ష్మి తెలిపారు. శనివారం డివిజన్‌లోని రంగశాయిపేట, గొల్లవాడ, రజకవీధి, కాపువాడలలో పర్యటించారు. అనంతరం డిఇ, ఎఇలకు ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీటిని పంపిణీ చేయించేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. రంగశాయిపేటలోని కొన్ని ప్రాంతాలలో కనీసం ఒక బిందె నీరు కూడా రావడం లేదని, ఈ ప్రాంత ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డిఇ మనోహర్‌ మాట్లాడుతూ నీరురాని ప్రాంతంలో నూతనంగా పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తే ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేసి నీటి ఎద్దడిని తీర్చవచ్చని తెలిపారు. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రతిపాదనలను తయారుచేసి కమీషనర్‌ దృష్టికి తీసుకువెళుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఇ వెంకటేశ్వర్లు, టిఆర్‌ఎస్‌ నాయకులు మరుపల్ల రవి, లైన్‌మెన్‌ కరుణాకర్‌తోపాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

spandana, ‘నేటిధాత్రి’కి స్పందన

‘నేటిధాత్రి’కి స్పందన

‘స్మశనమే తనదంటున్నాడు’ శీర్షికతో ‘నేటిధాత్రి’లో ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. సర్వే నెంబర్‌ 700లోని పెద్దమ్మగడ్డ స్మశన స్థలం కబ్జాకు గురైందని విషయాన్ని వెలుగులోకి ‘నేటిధాత్రి’ తీసుకురావడంతో కథనానికి స్పందించిన వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ఇటీవల ఏర్పాటు చేసిన భూబాదితుల ప్రత్యేక సెల్‌ అధికారి అయిన బోనాల కిషన్‌ విచారణ నిమిత్తం శనివారం పెద్దమ్మగడ్డ స్మశనవాటిక స్థల పరిశీలనకు పంపించారు. విచారణకు వెళ్లిన సీఐ ఇరువర్గాలతో మాట్లాడి తమ వద్ద ఉన్న ఆధారాలను తీసుకురావాలని వారికి చెప్పానని సీఐ బోనాల కిషన్‌ తెలిపారు. ఇరువర్గాలు తీసుకువచ్చే ఆధారాల ఆధారంగా నిజనిజాలను నిగ్గుతేల్చుతామని చెప్పారు.

aa naluguru corporatorlu, ఆ నలుగురు కార్పోరేటర్లు

అమాయకుల భూముల కొల్లగొడుతున్న ఆ నలుగురు కార్పోరేటర్లు

మీ సొంత స్థలంలో మీరు ప్రహారీగోడ కట్టుకున్న కూల్చేస్తారు…సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తారు…మా డివిజన్‌ కార్పోరేటర్‌ అయితే బెటర్‌ అని సలహా ఇస్తారు…తీరా కార్పోరేటర్‌ దగ్గరకు వెళ్తే ప్రహారీగోడ కూల్చిన గ్యాంగ్‌, కార్పోరేటర్‌ ఒక్కటేనని బాధితులకు బోధపడుతుంది. ల్యాండ్‌ కావాలంటే ఫిప్టీ..ఫిఫ్టీ మంత్రం ఉత్తమమని బెదిరిస్తారు. వినకుంటే ఏమవుతుందో అర్థమయ్యేలా విడమరచి చెప్తారు. ఉత్తపుణ్యానికి సగం భూమిని మింగేసి స్థల యజమానులకు చుక్కలు చూపిస్తారు. వరంగల్‌ తూర్పు 8,18,21,23వ డివిజన్లలో నలుగురు కార్పోరేటర్లు ఆడుతున్న భూసెటిల్‌మెంట్‌ ఆట ఇది. ఇలాగే ఉత్తపుణ్యానికి భూమిని కోల్పోయిన ఓ బాధితుడు ‘నేటిధాత్రి’ ని సంప్రదిస్తే ఈ కార్పోరేటర్ల తతంగం అంతా బయటపడింది.

6 nundi sri bhadrakali ammavari kalyana brahmastavalu, 6నుండి శ్రీభద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మూెత్సవాలు

6నుండి శ్రీభద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మూెత్సవాలు

వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవస్థానంలో ఈనెల 6వ తేదీ నుండి 17వ తేదీ వరకు శ్రీభద్రకాళి-భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మూెత్సవాలు నిర్వహించబోతున్నామని ఈఓ సునీత, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో వారు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్‌ ప్రజలకు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీభద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మూెత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ బ్రహ్మూెత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

 

బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి

బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి

భారతీయ జనతా పార్టీ ద్వారానే గ్రామాల సమగ్ర అభివద్ధి జరుగుతుందని బిజెపి వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తెలిపారు. శనివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో జడ్పీటీసీ అభ్యర్థి జనగామ కిష్టయ్య, ఎల్కతుర్తి గ్రామ ఎంపిటిసి అభ్యర్థి బొజ్జ హరీష్‌, దామెర గ్రామ ఎంపిటిసి అభ్యర్థి పర్వీన బేగంకి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతత్వంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గ్రామాలు అభివద్ధి చెందాలనే సంకల్పంతో అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, ఎక్కడ అవినీతి ఉండకూడదనే దఢ నిశ్చయంతో ప్రధాని నరేంద్రమోడీ వేలకోట్ల రూపాయలు తెలంగాణకు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.

ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ పార్టీకి అవకాశం ఇచ్చిన అభివద్ధి శూన్యం అని అన్నారు. నేడు గ్రామాల అభివద్ధి కావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని, నరేంద్రమోడీ ద్వారా నిధులను తీసుకువచ్చి ఇంకా ఎక్కువ అభివృద్ది చేయడానికి అవకాశం ఉంటుందని, ప్రజలందరూ కోరుకునేది ఒక్కటే జడ్పీటీసీ అభ్యర్థిగా, ఎంపిటిసి అభ్యర్థిగా బిజెపికి ఓటువేసి గెలిపించి గ్రామాల అభివద్ధికి తోడ్పడాలని రావు పద్మ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌ రావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గురుమూర్తి శివకుమార్‌, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ పాశికంటి రాజేంద్రప్రసాద్‌, మండల అధ్యక్షుడు వర్ధన్‌, ఓబీసీ మోర్చా జిల్లా కోశాధికారి అశోక్‌, మండల నాయకులు చిరంజీవి, ఎర్రగొల్ల రాజు, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్‌ ‘దండ’న

కార్పొరేషన్‌ ‘దండ’న

వరంగల్‌ గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎదురుగా బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తులకు బల్దియా అధికారులు పూలమాల వేసి జరిమాన విధిస్తున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలుు వేస్తున్నారని నగర అభివద్ధికి మల, మూత్ర విసర్జననే అడ్డుపడిందా అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్‌లో ప్రాంగణంలోనే ఉన్న మరుగుదొడ్లకు తాళంవేసి ఉంటే ఎక్కడికి పోవాలని, కార్పొరేషన్‌ అధికారుల పనితీరుపై స్థానికులు, ప్రజలు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్పోరేషన్‌ అధికారులు నగరాభివృద్ధిపై దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.

nuthana mayorku shubakankshalu, నూతన మేయర్‌కు శుభాకాంక్షలు

నూతన మేయర్‌కు శుభాకాంక్షలు

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై బల్దియా ప్రధాన కార్యాలయంలో భాద్యతలు స్వీకరించిన గుండా ప్రకాష్‌కు మాజీ ఎంపీలు పసునూరి దయాకర్‌, గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్‌, నన్నపనేని నరేందర్‌, మాజీ ఇంచార్జి మేయర్‌ ఖాజా సిరాజుద్దీన్‌, సాంబారి సమ్మారావు, కార్పొరేటర్లు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

mallannaku rudrabhishekam, మల్లన్నకు రుద్రాభిషేకం

మల్లన్నకు రుద్రాభిషేకం

ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి దేవస్థానంలో శుక్రవారం మాసశివరాత్రి సందర్భంగా శ్రీమల్లిఖార్జునస్వామి వారికి మహన్యాస రుద్రాభిషేకం, స్వామి వారి కళ్యాణం, రుద్రహోమం నిర్వహించారు. ఒగ్గు పూజరులతో పెద్దపట్నం వేయించారు. ఈ కార్యక్రమాలు దేవాలయ ఉప ప్రధాన అర్చకుడు నందనం శివరాజయ్య, ముఖ్య అర్చకుడు పాతర్లపాటి శ్రీనివాస్‌, పురోహిత్‌ ఐనవోలు మధుకర్‌శర్మ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 అభివృద్ధిని చూసి పట్టం కట్టండి

దశాబ్దాల కాలంగా తెలంగాణ ప్రజలకు అభివృద్ధిలో ముందుకు సాగనివ్వని పాలకుల దగ్గర ప్రజలను ఐక్యం చేసి రాష్ట్రాన్ని సాధించి ప్రజలు కోరకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి అముల చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్‌ చేసిన అభివృద్ధి చూసి పరిషత్‌ ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్ధులను గెలిపించాలని శాసనసభ్యుడు అరూరి రమేష్‌ అన్నారు. శుక్రవారం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల ఎన్నికల ఇంచార్జీ ఇల్లందుల సుదర్శన్‌ అధ్యక్షతన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మండలంలోని చెన్నారం,ఉప్పరపల్లి,నల్లబెల్లి,ల్యాబర్తి,కొత్తపల్లి గ్రామల్లో జెడ్పీటీసి అభ్యర్ధి మార్గం భిక్షపతితో కలిసి ఆయా గ్రామాల ఎంపిటిసి అభ్యర్ధులతో ప్రచారం నిర్వహించారు. ఈసంధర్భంగా ప్రచార కార్యక్రమానికి హాజరైన ఆయా గ్రామాల ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు దివించాలని కోరారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో ముందు నుండి ఉద్యమించి పార్టీ నాయకత్వాన్ని నమ్మి ఇంత వరకు నిలిచిన నాయకుడు మార్గం భిక్షపతిని జెడ్పీటిసి అభ్యర్ధిగా ప్రజలపై నమ్మకంతోనే మీ ముందుకు పంపిందని అన్నారు. అదే విధంగా పార్టీ నిర్ణయాలు,ప్రజలు కోరకున్న వ్యక్తులకే ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్ధులుగా ఖరారు చేసినట్లు అరూరి తెలిపారు. మండలంలో 11 స్థానాలకు గాను ఇప్పటికే 2 స్థానాలు ఎకగ్రీవం ఆయ్యాయని మిగతా 9 స్థానాలకు 9 స్థానాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మార్నేని రవిందర్‌రావు,జెడ్పీటీసి పాలకుర్తి సారంగపాణి,మాజీ మార్కెట్‌ చైర్మన్‌ గుజ్జ సంపత్‌రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచ్‌లు,పార్టీ ఎన్నికల ఇంచార్జీలు,పార్టీ ముఖ్యనాయకులు,ప్రజలు పాల్గోన్నారు.

katnam bhoomi samarpayami, ‘కట్నం’భూమి.. సమర్పయామి..!

‘కట్నం’భూమి..

సమర్పయామి..!

వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలోని దివిటిపల్లి గ్రామానికి చెందిన కందిక కోమల సోమయ్య దంపతుల కూతురయిన రజి తను, పారనంది యాదమ్మ(సోమయ్య చెల్లెలు) కుమా రుడైన మధుకర్‌కు (2001లో) ఇచ్చి వివాహం జరిపిం చారు. కాగా, కట్న కానుకల కింద దివిటిపల్లి గ్రామంలో ఉన్న 376/ఎ ఉన్న తన 1.10 గుంటల వ్యవసాయ భూమిని రాసిచ్చారు. రజిత, మధుకర్‌ కాపురం అన్యో న్యంగా సాగింది. 2008 నుంచి మధుకర్‌ వ్యసనాలకు లోనయ్యాడు. భార్యా పిల్లలను పట్టించుకోకపోగా జల్సా లు చేయడం మొదలెట్టాడు.ఎంతకూ వినకపోవడంతో రజిత పెద్దమనుషులను ఆశయ్రించింది. మధుకర్‌ను మందలించి ప్రవర్తన మార్చుకుని సక్రమంగా కాపురం చేసుకుని చెడు వ్యసనాలను వదిలి వేయాలని పెద్దమనుషులు సూచించారు.అయినా వినిపించుకోని మధుకర్‌ తన తల్లిదండ్రులతో కలిసి రాయపర్తి మండలంలోని గన్నారం (గతంలో వారి స్వంత గ్రామం) గ్రామానికి మకాం మార్చాడు,

భూమినే నమ్ముకుని..

మధుకర్‌ తనకు దూరంగా తల్లిదండ్రులతో రజిత మాత్రం.. తన భూమినే నమ్ముకున్నది. వ్యవసాయంతో పాటు కూలీనాలీ చేస్తూ పిల్లలను పోషిస్తూ వస్తోంది. తన బిడ్డకు ఆధారంగా ఆ భూమి ఉందని భరోసాతో ఉన్న ఆమెకు ‘అత్తింటి’ రూపంలో అనుకోని గండం వచ్చిపడింది. రజితపై కనికరం చూపాల్సిన భర్త మధుకర్‌, అత్త యాదమ్మలు వివాహ సమయంలో కట్నం ఇచ్చిన భూమిని అత్త యాదమ్మ పేరుమీదకు మార్చారు. కుటుంబంలో గొడవలు జరుగుతున్న సమయంలో వివాదానికి కారణమైన భూమిని రజిత అనుభవదారుగా కూడా రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో భూమి రజిత పేరున నమోదవుతుందని, అలా అయితే తమకు ఏం దక్కదని కుట్ర పన్నారు. అనుకున్నదే తడవుగా వివాదాస్పద భూముల కోనుగోళ్ళకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే మడికొండకు చెందిన ఓ రియల్టర్‌కు కట్టబెట్టినట్లు సమాచారం. ఇంకేముంది మూడో కంటికి తెలియకుండా భూమి చేతులు మారింది. ఈ విషయం తెలియని రజిత ఎప్పటిలాగానే భూమిలో సాగు చేసుకుంటున్న సమయంలో కొందరు అడ్డుకుని ఈ భూమిని తాము కొనుగోలు చేసినట్లు చెప్పారు. న్యాయం కోసం అప్పటి నుంచి ఆమె పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది.

పోలీస్‌ స్టేషన్లో పిర్యాధు…

వివాదానికి కారణమైన భూమిని కోనుగోలు చేసింది.మొదలు ఇప్పటి వరకు ఆ భూమి మీదకు రాని వారు తాజాగా బుధవారం రజిత సాగు చేసుకుంటుండగా వ్యవసాయ భూమి వద్దకు వచ్చి పనులను అడ్డుకుని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అక్రమంగా భూమిని సాగు చేస్తున్నట్లు పిర్యాధు చేసినట్లు సమాచారం.

mahagarjananu vijayavantham cheyali, మహాగర్జనను విజయవంతం చేయాలి

మహాగర్జనను విజయవంతం చేయాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ వైఖరికి నిరసనగా మహాగర్జనను చేపట్టామని, మహాగర్జనను దళితులు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు మంద రాజు కోరారు. శుక్రవారం కమలాపూర్‌ మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ దళితులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ వైఖరికి నిరసనగా ఈ మహాగర్జనను ఈనెల 8వ తేదీ బుధవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని డంపింగ్‌ యార్డులో వేసి ముఖ్యమంత్రి కేసిఆర్‌ దళితులను చిన్నచూపు చూశారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలుస్తారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు ఏకమై అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిస్తూ కేసిఆర్‌ ప్రభుత్వానికి చరమగీతం పాడుతామన్నారు. ఈనెల 8న నిర్వహించే మహాగర్జనకు దళితులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నద్దునూరి కిరణ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు చిలువేరు సంపత్‌కుమార్‌, అంబేద్కర్‌ జిల్లా కార్యదర్శి పుల్ల వినోద్‌, మండల గౌరవ అధ్యక్షుడు మంద రవీందర్‌, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్‌, ఉపాధ్యక్షుడు రమేష్‌, జిల్లా కార్యదర్శి నద్దునూరి ప్రసాద్‌, సుధాకర్‌, ఓదేలు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

mayorku shubakankshalu thelipina kuda chairmen, మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కుడా చైర్మన్‌

మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కుడా చైర్మన్‌

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపాలిటి కార్పొరేషన్‌ మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గుండా ప్రకాష్‌ని కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి శుక్రవారం కలసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండా ప్రకాష్‌కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టిఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

memu ea kabzaku palpadaledu, మేము ఏ కబ్జాకు పాల్పడలేదు

మేము ఏ కబ్జాకు పాల్పడలేదు

పెద్దమ్మగడ్డ స్మశానాన్ని తాము ఎంతమాత్రం కబ్జా చేయలేదని, ఆ స్థలం తమ సొసైటీకి చెందిందని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని జాగృతి సొసైటీ బాధ్యులు బొజ్జ కిషన్‌రాజ్‌ స్పష్టం చేశారు. సోమవారం ‘నేటిధాత్రి’ పత్రికలో ప్రచురితమైన ‘స్మశానమే తనదంటున్నాడు’ కథనానికి ఆయన స్పందించారు. పైసా, పైసా పోగుచేసి తమ సొసైటీ తరపున స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. తాము కొనుగోలు చేసిన స్థలంలో తాము అడుగుపెట్టకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని అన్నారు. 700సర్వే నెంబర్‌లోని 4ఎకరాల 20గుంటలపై తమ సొసైటీకి అన్నిరకాల హక్కులు ఉన్నాయన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భూమిని స్వాధీనం చేసుకునేందుకు తాము అధికారుల చుట్టూ తిరుగుతున్నామన్నారు. నివాస స్థలాల కోసమని సొసైటీ ఆధ్వర్యంలో తాము భూమి కొనుగోలు చేశామని, ఎవరి భూములను కబ్జా చేసే ఉద్ధేశ్యం తమకు లేదన్నారు.

సమాధుల స్థలాన్ని వదిలివేస్తాం

పెద్దమ్మగడ్డ సమీపంలోని 700సర్వే నెంబర్‌లోని సమాధులను ధ్వంసం చేసే ఉద్ధేశ్యం లేదని కిషన్‌రాజ్‌ స్పష్టం చేశారు. పెద్దమ్మగడ్డ వాసుల సెంటిమెంట్‌ను తాము గుర్తించి మానవతా దృక్పథంతో సమాధులున్న స్థలాన్ని వారికే వదిలివేస్తామన్నారు. ఇరుపక్షాల సమక్షంలో మరోసారి భూమిని రీసర్వే చేయంచుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటామని ఆయన ‘నేటిధాత్రి’ ప్రతినిధికి తెలిపారు. పెద్దమ్మగడ్డ డెవలప్‌మెంట్‌ కమిటీ పెద్దలు సైతం సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.

peruke mahila police stationlu, పేరుకే మహిళా పోలీస్‌స్టేషన్లు

పేరుకే మహిళా పోలీస్‌స్టేషన్లు

సమాజంలో రోజురోజుకు కుటుంబాల మధ్య వైరం పెరుగుతున్నాయి. కలసిమెలసి ఉండాల్సిన కుటుంబాలు మనస్పర్థలతో ఎడమొహం…పెడ మొహం పెడుతూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. గతంలో కొనసాగిన ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాల పేరుతో విడిపోయి ఒకరికొకరు ఓదార్చుకునే పరిస్థితుల నుంచి ఒంటరై నా అనుకునే వాళ్లకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మద్య ఏర్పడే చిన్నచిన్న అపార్థాలు అనేక అనర్థాలకు దారి తీస్తున్నాయి. ఈ పరిస్తితులను చక్కదిద్డడానికే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖ భార్యాభర్తల మధ్య ఏర్పడే అంతరాలను, అపార్థాలను అర్థం చేయించుటకు కౌన్సిలింగ్‌తో చక్కబెట్టేందుకు మహిళా పోలీస్‌స్టేషన్లను నెలకొల్పారు. మొదట్లో మహిళా పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితుల నుంచి పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి సమస్యకు మూలం ఎక్కడ ఉందో గ్రహించి ఆ కుటుంబాలకు కౌన్సిలింగ్‌ ద్వారా మెప్పించి, ఒప్పించి అనేక కాపురాలను నిలబెట్టగలిగారు. దీంతో ప్రజలకు, మహిళలకు మహిళా పోలీస్‌స్టేషన్లపై అపారనమ్మకం పెరిగింది. ఈ మధ్య కాలంలో మహిళా పోలీస్‌స్టేషన్లకు వస్తున్న బాదితుల నుంచి పోలీసులు ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం ఇరువురిని పిలిపించి తుతుమంత్రంగా వారితో మాట్లాడి చేతులు దులుపుకుంటున్నారు. ఇరువర్గాలను నిల్చుబెట్టి కేసు పెట్టమంటారా…పెద్ద మనుషుల్లో మాట్లాడుకుంటారా…అని ఉచిత సలహాతో కౌన్సిలింగ్‌ ఇవ్వకుండా పెద్దమనుషుల మధ్య మాట్లాడుకోండని స్వయంగా పోలీసులే పెద్దమనుషుల పంచాయితీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటికే బాధితులు పెద్దమనుషుల చుట్టూ తిరిగి పడరాని పాట్లు పడి ఆర్థికంగా నష్టపోయి ఉ ంటున్నారు. మళ్లీ పెద్దమనుషుల పంచాయితీ పేరుతో డబ్బు, మద్యం తదితర ఖర్చులు పెద్దమనుషుల పంచాయితీకి పెట్టలేక పోలీస్‌స్టేషన్‌లో న్యాయం జరగక మా కర్మ ఇంతేనని నెత్తినోరు కొట్టుకుంటూ ఇబ్బందుల పాలవుతున్నారు. అక్కడ…ఇక్కడ అనే తేడా లేకుండా చేతివాటం ముట్టనిదే ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు బోరున విలపిస్తున్నారు.

కౌన్సింగే సరైన మార్గం అంటున్న విశ్లేషకులు

ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఫిర్యాదులు అందిన వెంటనే ముందుగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదును పూర్తిగా చదివి అర్థం చేసుకుని అందులో వారు చెప్పిన విషయాలను, సమస్యలను గ్రహించి ఆ తరువాత రెండు కుటుంబాల వారిని పిలిపించి వారితో నేరుగా మాట్లాడి వారు చెప్పిన మాటల్లో కల్పితాలను, వాస్తవాలను గ్రహించాలన్నారు. అనంతంర భార్యాభర్తలను పిలిపించి విడివిడిగా వారితో మాట్లాడాలి. తరువాత ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయాలి. వారు చెప్పిన ప్రతి విషయాన్ని పోలీసులు నోట్‌ చేసుకోవాలి. చివరగా వారిద్దరు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా అసలు సమస్య ఎక్కడ మొదలైంది అనే దగ్గర నుంచి వారికి కుటుంబంలో ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది ఎదురవుతుంది…ఎందుకు ఎదురవుతుంది…ఎలా అవుతుంది అనే కోణంలో దర్యాప్తు జరగాలి. ఆ తరువాత ఏం చేస్తే వారు కలసి ఉంటారు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి పోలీసులే స్వయంగా పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా పండంటి కాపురాలు పచ్చగా పదికాలాలపాటు వర్థిల్లుతాయని సామాజిక విశ్లేషకులు, సైకాలజిస్టులు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇలా చేస్తారని ఆశిద్ధాం.

pressclub sports meetnu prarambinchina cp, ప్రెస్‌క్లబ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను ప్రారంభించిన సీపీ

ప్రెస్‌క్లబ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను ప్రారంభించిన సీపీ

క్రీడలు మానసికోల్లాసానికి, ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. శుక్రవారం వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ స్పోర్ట్స్‌ మీట్‌-2019 క్రీడలను వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ప్రారంభించారు. అనంతరం సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌ మాట్లాడుతూ రోజంతా వార్త సేకరణలో అలుపెరగకుండా తిరుగుతూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారని, వారికి ఈ క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని అన్నారు. క్రీడలతో శరీరం ధృడంగా తయారవుతుందని తెలిపారు.

mayor badyathala swekarana, మేయర్‌ బాధ్యతల స్వీకరణ

మేయర్‌ బాధ్యతల స్వీకరణ

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా గుండా ప్రకాష్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికై బల్దియా ప్రధాన కార్యాలయంలో భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్‌ గుండా ప్రకాష్‌ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఏకం చేస్తూ గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.

prajaswamyama…? racharika rajayama…?, ప్రజాస్వామ్యమా…? రాచరిక రాజ్యమా…?

ప్రజాస్వామ్యమా…? రాచరిక రాజ్యమా…?

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమా…, రాచరిక రాజ్యమా అని బిజెపి నాయకుడు, మాజీ మంత్రి గుండె విజయరామారావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలపై ఉన్న అవకతవకల వల్ల 24మంది విద్యార్థులు మతిచెందినా, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా గురువారం బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో బిజెపి వరంగల్‌ అర్బన్‌ జిల్లా శ్రేణులతోపాటు బంద్‌ నిర్వహిస్తున్న మాజీ మంత్రి గుండె విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమరేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్‌, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ రాజేంద్రప్రసాద్‌, ఎన్నారై సెల్‌ కన్వీనర్‌ కందగట్ల సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి గుండెకారి కోటేశ్వర్‌, అయినవోలు మండల అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌, 32వ డివిజన్‌ అధ్యక్షులు పెరుగు సురేష్‌, రాజేష్‌ ఖన్నా, శేఖర్‌ తదితరులను పోలీసులు అరెస్ట్‌చేసి హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నేడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని, ఎన్నో కలలు కనీ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బతుకులు బంగారం మయమవుతాయని అనుకుంటే భారమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్‌ రాచరిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. గ్లోబరినా సంస్థపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version