పార్టీ నిర్మాణమే కుటుంబ అభివృద్ధిగా భావించా : ఐనవోలు మండల టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి గజ్జెల శ్రీరాములు

పార్టీ నిర్మాణమే కుటుంబ అభివృద్ధిగా భావించా

పార్టీల్లో నాయకులుగా ఉండడం పదవులు ఆశించడం ఎలాగోలా ఎదో ఒక పదవి తెచ్చుకొవడం ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధరణంగా చూస్తునే ఉంటాం. మరికొంతమందైతే ధనబలాన్ని,బంధుత్వబలాన్ని ఉపయోగించుకుని నేరుగా పదవులు అనుభవిస్తున్న వ్యక్తులను చూస్తూనే ఉంటాం. కాని ఎలాంటి పదవులు లేకున్నా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి కనీస ఆదరణ లేని సమయంలో పార్టీలోకి వచ్చి ప్రజల ఆకాంక్షను నేరవేర్చే ఉద్యమంలో తనవంతు పాత ఉండాలనే సదుద్దేశ్యంతో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాటి నుండి పార్టీ కార్యమ్రాల్లో పాలు పంచుకుంటూనే పార్టీని క్రమంగా ముందుకు తీసుకెళ్ళడంలో అహర్నిశలు కష్టపడ్డాడు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న విధానంతో నానాటికి కార్యకర్తలు పెరుగుతూ వచ్చారు. పార్టీ కొరకు,ప్రజల ఆకాంక్ష కొరకు కుటుంబ సభ్యులతో సమయాన్ని కూడా వెచ్చించకుండా దొరికిన ప్రతి క్షణాన్ని పార్టీ నిర్మాణానికి,ఉద్యమ ఒరవడికే కేటాయించారు. పార్టీ నిర్మాణం కోరకు ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఆయనను 18 సంవత్సరాల కాలంపాటు మండలపార్టీ అధ్యక్షుడిగా కోనసాగించాయి. రాష్ట్రంలో తెలుగుదేశం,కాంగ్రేస్‌ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో కూడా ఏనాడు ఉద్యమస్ఫూర్తిని వీడలేదు.తాను భాగస్వామ్యం అయిన ఉద్యమ ఫలితం రాష్ట్రం సిద్దించినా,తాను కార్యకర్తగా పని చేసిన పార్టీ అధికారంలోకి వచ్చినా ఏనాడు పదవుల కోరకు పాకులాడని సహనం ఆయన సోంతం.అందుకే ఆయనను ప్రస్తుతం జరుగుతున్న పరిషత్‌ ఎన్నికల్లో పార్టీ,స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్‌ల నిర్ణయం మేరకు జెడ్పీటీసి సభ్యుడిగా పోటి చేస్తున్నారు.ఆయనే మండలంలోని నందనం గ్రామానికి చెందిన గజ్జెల శ్రీరాములు.ప్రస్తుత ఎన్నికల ప్రచారం,తన అభ్యర్ధిత్వంపై గ్రామాల్లో ప్రజల నుండి వస్తున్న ఆదరణ తదితర అంశాలను గురించి ఆయన పంచకున్న విశేషాలు నేటిధాత్రిలో ప్రత్యేక ఇంటర్వ్యూ…

నేటిధాత్రి ప్రతినిధి: గ్రామాల్లో ప్రచారం ఎలా జరుగతుంది.?

జడ్పీటిసి అభ్యర్ధి: గ్రామాల్లో ప్రతి రోజు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆయా గ్రామాలకు సంబంధించిన పార్టీ అభ్యర్ధుల ప్రచారంతో పాటు జడ్పీటీసి అభ్యర్ధిగా నేను కూడా ఒక ప్రణాలికతో ప్రచారంలో ముందకు సాగడం జరుగుంది. ఇప్పటికే స్వయంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. అధే విధంగా స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్‌,నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జీ మర్రి యాదవరెడ్డి,ఎంపిపి మార్నేని రవిందర్‌రావులతో మరోమారు గ్రామాల్లో రోడ్‌షోలు నిర్వహించాం.

ప్రతినిధి: ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది.?

జడ్పీటీసి అభ్యర్ధి: ప్రజల చాలా ఆదరణ చూపిస్తున్నారు. ఇంతకాలం ఎన్నికల్లో ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పదేపదే చెప్పాల్సి వచ్చేది. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను గురించి ప్రతి వ్యక్తి ఈ రోజు చర్చించుకుంటున్నారంటే ఫ్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజల చెంతకు చేరాయి. ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. అందుకే వారు ఈ ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్ధులను వ్యక్తిగతంగా కంటే పార్టీ అభ్యర్ధులుగా ఆదరిస్తున్న తీరు హర్షనీయం.

ప్రతినిధి: పార్టీ అభ్యర్ధుల ఎంపికలో ఏఏ విషయాలను పరిగణలోకి తీసుకున్నారు?

జడ్పీటీసి అభ్యర్ధి: పరిషత్‌ ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్ధుల ఎంపికలో స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు కోరకున్న అభ్యర్ధులకు అభ్యర్ధిత్వం ఇవ్వడానికి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చారు.అధే విధంగా గ్రామాల్లో పార్టీ విధేయులకు,పార్టీ కోరకు పని చేస్తూ సేవ చేయగలగే వ్యక్తులకు ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించడం జరిగింది. అభ్యర్ధుల ఎంపికను ప్రజలు గమనించారు.కాబట్టే ఇప్పటికే మండలంలో ఉన్న ఐనవోలు 1 ఎంపిటిసి,వనమాల కనపర్తి అభ్యర్ధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధే విధంగా మిగిలిన అన్ని స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించడం ఖాయం

ప్రతినిధి:మీకు జెడ్పీటీసి అభ్యర్ధిగా అవకాశం ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం?

జడ్పీటీసి అభ్యర్ధి: అధికారం కోసం మాత్రమే కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే స్ధానికంగా పార్టీ కోరకు,రాష్ట్రం కోరకు పని చేసిన గులాబీ సైనికులు చాలామంది ఉన్నారు. ఇంతకాలం పార్టీలో ఇచ్చిన బాధ్యతలు నిర్వహించిన తీరు,ఉద్యమ నేపథ్యం ఇలాంటి అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని తనకు అవకాశం ఇచ్చారు.ఇచ్చిన అభ్యర్ధిత్వం ప్రజలు ఆశిర్వదించి జెడ్పీటీసిగా ఎన్నుకుంటే ఈ తరుణంలో మరింత భాద్యత పెరుగుతుందనే అనుకుంటున్నా. ఎందేకంటే మండలంలో ఉన్న ఉద్యమకారులను,పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సి బాధ్యత నాపై ఉంది.బహూశా రానున్న రోజుల్లో ఉద్యమకారులకు మంచి రోజులు వస్తాన్నాయనే ఒక సూచనను ఇవ్వడానికే నాకు ఈ అవకాశం ఇచ్చారని భావిస్తున్నా.ఎది ఏమైనా తనపై నమ్మకంలో తనకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టుకుని తన విజయాన్ని స్థానిక శాససభ్యులు ఆరూరి రమేష్‌కు కానుకగా ఇస్తా. అధే విధంగా తన అభ్యర్ధిత్వానికి సహకరించిన నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జీ మర్రి యాదవరెడ్డి,ఎంపిపి మార్నేని రవిందర్‌రావు, ఇండ్ల నాగేశ్వర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు,అంతేకాకుండా తన ప్రచార కార్యక్రమాల్లో సహకరిస్తున మండల పార్టీ అధ్యక్షుడు మునిగాల సమ్మయ్య,మండల పార్టీ అధికార ప్రతినిధి మిద్దెపాక రవిందర్‌, మార్నేని యువసేన బాధ్యులు డబ్బా శ్రీనులకు ఋణపడి ఉంటా.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version