ప్రజా పోరాటాల ఫలితంగానే శవ పరీక్ష కేంద్రాన్ని ప్రభుత్వం నిర్మించింది

భద్రాచలం నేటి దాత్రి

చర్ల ఆస్పత్రి ఆవరణ0లో నిర్మించిన శవ పరీక్ష కేంద్రాన్ని తక్షణమే ఓపినింగ్ చెయ్యాలి

లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

CPIML మాస్ లైన్ (ప్రజాపంధా) పార్టీ చర్ల మండల కమిటీ

సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ ఆధ్వర్యంలో చర్ల ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో నిర్మించిన శవపరీక్ష కేంద్రాన్ని తక్షణమే ఓపెనింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ డివిజన్ నాయకుడు కొండాచరణ్ మాట్లాడుతూ ఎన్నో ప్రజా పోరాటాల ఫలితంగా చర్ల మండలానికి శవపరీక్ష కేంద్రంన్నీ ప్రభుత్వం నిర్మించిందని అన్నారు స్పందించి శవపరీక్ష కేంద్రాన్ని నిర్మించినందుకు అధికారులకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కానీ శవ పరీక్ష కేంద్రం నిర్మించి ఆరు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఓపెనింగ్ చేయకపోవడం అనేది సరైన పద్ధతి కాదు అని వాపోయారు ప్రభుత్వం వైద్యాధికారులు చర్ల మండలంలోని ప్రజలు శవ పరీక్ష కేంద్రం నిర్వహణలో లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవాలని అన్నారు మరణించిన మృతదేహానికి శవపరీక్ష చేయవలసి వచ్చినప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క మృతదేహాన్ని వాహనంలో వేసుకొని 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లి ఒక రోజు మొత్తం అక్కడ ఉంచి పోస్టుమార్టం చేయించి మరణించిన మరుసటి రోజు ఇంటికి తీసుకువచ్చి దహన మరియు ఇతర కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది బంధువులకు అత్యంత వేదన కలిగించేటువంటి విషయం అని అంతే కాకుండా చర్ల మండలం పోలీస్ యంత్రాంగానికి కుడా ఎంతో సమస్యగా ఉంటు0దనీ అన్నారు కాబట్టి ఈ పరిస్థితిని వైద్య ఉన్నత అధికారులు అర్థం చేసుకోవాలి తక్షణమే వారం రోజుల్లో ఈ శవ పరీక్ష కేంద్రాన్ని ఓపెనింగ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ప్రజానీకాన్ని ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండ కౌశిక్ పార్టీ మండల నాయకులు చెన్నం మోహన్ , నరసింహ, పార్టీ నాయకులు రేగా ఆంధ్రయ ,జములు, గౌర్ల నాగమణి, పురటి సుశీల, గూడపాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *