మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు మాదకద్రవ్యాల నిరోధకప్రతిజ్ఞ చేశారు. మండల ప్రజా పరిషత్ పై అధికారుల ఆదేశాల మేరకు తమ పరిసరాలలో మాదక ద్రవ్యాల వినియోగం జరిగితే పోలీస్ యంత్రాంగానికి సమా చారం ఇచ్చి సమాజ రక్షణకు తోడ్పతామని, డ్రగ్స్ రహిత పోరాటంలో క్రియాశీలభాగస్వా ములమవుతామని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగ స్వామి అవుతానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఫణి చంద్ర,మండల ప్రజా పరిష త్ కార్యాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.
