వసూళ్లలో రూటు మార్చిన మరో క్వారీ.

*దర్జాగా టీఎస్ఎండిసి సిబ్బంది వసూళ్లు.*

*మహాదేవపూర్ పుసుపుపల్లి వన్, క్వారీ లో దారుణం.*

*సీరియల్ 700, లోడింగ్ 100, పాసింగ్ కొరకు 100.*

*టీఎస్ఎండిసి ఉన్నత అధికారుల నిఘా ఎక్కడ.*

*మహాదేవపూర్- నేటి ధాత్రి:*

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించబడుతున్న ఇసుక క్వారీలు అదనపు ఇసుక అక్రమ వసూళ్లకు హద్దు అదుపు లేకుండా పోయింది.ఎవరు పసిగ్గటి రీతిలో బొమ్మపూర్ ఎలికేశ్వరం ఇసుక క్వారీలతోపాటు మహాదేవపూర్ పూసుకుపల్లి ,ఒకటవ నంబర్ పేరుతో మండలంలోని కుదురుపల్లి శివారు వద్ద నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ లో వసూళ్లకు రూటు మార్చి ,కాంట్రాక్టర్ సిబ్బంది కాకుండా టి ఎస్ ఎం డి సి, కు చెందిన సిబ్బంది ప్రతి లారీ వద్ద 700 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా లోడింగ్ వద్ద 100 రూపాయలు, కాంట వద్ద టీఎస్ ఎంబీసీ సిబ్బంది కూర్చుని పాసింకు ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చిన తిరిగి ఇసుక వేయడం లేదా తీయడం చేస్తూ మరో అదనంగా 100 రూపాయలను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ లలో ఎక్కువ మోతాదులో ఈ క్వారీ నుండి ఇసుక లారీల రవాణా కావడం జరుగుతుంది.

 

ప్రస్తుతం మండలంలో సుమారు 150 కు పైగా ప్రతిరోజు లారీల ఇసుకను లోడ్ చేసే క్వారీల్లో బొమ్మపూర్ ఎలికేశ్వరం తో పాటు, మహాదేవపూర్ పుసుపుపల్లి, ఒకటవ నంబర్ క్వారీ కూడా ఉంది. గత నెల కేవలం 3 నుండి 17 లారీలకే పరిమితమైన, ఈ క్వారీ ఈనెల వారం రోజులుగా 60 నుండి నేడు 246 లారీల ఇసుక ను తరలిస్తుందంటే, అక్రమ వసూళ్ల పర్వం ఎంతవరకు ఉందో స్పష్టం అవుతుంది. సాండ్ పొలిసి ని కఠినంగా అమలు పరుస్తున్నాము ,అని చెప్పుకుంటున్న మైనింగ్ శాఖ, మండలంలో దర్జాగా వసూళ్లు చేస్తుంటే ఎందుకు నిశ్శబ్దం వహిస్తుంది. గుత్తేదార్ గుమస్తాలుగా మారి టీఎస్ఎండిసి సిబ్బంది, ఇసుక లోడింగ్ వద్ద ఉండాల్సినప్పటికీ, కేవలం కంటైనర్ల వద్ద పరిమితమై సీరియల్ పేరుతో సిబ్బంది వసూలు చేయడం మైనింగ్ అధికారులకు, కాంట్రాక్టర్ల నుండి వాటా పోగకుండా ఇలా సాధ్యమవుతుంది. మైనింగ్ ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి, అక్రమ వసూళ్లు చేస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version