ఘనంగా ఆల్ఫాన్సా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు…

విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలి…

విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి…

బెల్లంపల్లి ఏసిపి సదయ్య …

రామకృష్ణాపూర్,జనవరి 11, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని అల్ఫోన్సా కాన్వెంట్ పాఠశాల లో 35 వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధులుగా బెల్లంపల్లి ఏసి పి సదయ్య,ఎం ఈ ఓ పోచయ్య లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. విద్యార్థినీ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రానించాలన్నారు. విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని,విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువు పై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,విద్యార్థులు సోషల్ మీడియాల కు బానిసలు కాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న, ఉన్నత స్థాయిలో ఉండాలన్న సరే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యం అని అన్నారు. వార్షికోత్సవ కార్యక్రమంలో పలు సందేశాత్మకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు, నాటికలు చేసి విద్యార్థులు అలరించారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో విద్యార్థులు డ్రగ్స్ , మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా ఉండేందుకు నాటికలు చేసి అబ్బురపరిచారు. నాలుగో తరగతి ప్రహర్షితా కళ్లకు గంతలు కట్టుకొని రంగులు, నంబర్స్ , అక్షరాలను చెప్పడం పలువురిని విశేషంగా ఆకర్షించింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ బెస్సి,మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి,రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్,సిస్టర్ అల్ఫోన్సా అబ్రహం రోసిన్,ఫాథర్ బినోయ్, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version