ముత్తాపురంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించిన ఆళ్ళపల్లి పోలీసులు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను సూచనలతో శుక్రవారం ఆళ్ళపల్లి ఎస్సై రతీష్ ఆధ్వర్యంలో మండలంలోని గుత్తికొయ గ్రామమైన ముత్తాపురంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించారు .అనంతరం గ్రామస్తులందరితో సమావేశమై అక్కడ నివసించే 11 కుటుంబాలతో సమావేశమయ్యారు.గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని,అదేవిధంగా నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని గ్రామస్తులకు సూచించినట్లు ఎస్సై రతీష్ తెలిపారు.దోమల బారిన పడకుండా ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డెంగ్యూ మరియు మలేరియా లాంటి విష జ్వరాల ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని గ్రామస్తులకు సూచించారు.ఈ కార్యక్రమం లో టీఎస్ఎస్పి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version