ఉద్యమ కారులమంతా సిద్ధం-ఎంపీ సీటు గెలిపించుకుంటా-మాజీ ఎమ్మెల్యే మోలూగూరి

పరకాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని వెల్లడి

బుచ్చన్న పార్టీలో చేరడం చాలా సంతోషకరం

పరకాల నేటిధాత్రి

హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో సోమవారం రోజున స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం, శాలువాతో సన్మానించి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా బిక్షపతి మాట్లాడుతూ పరకాల అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని తన పదవుల కోసం పార్టీలో చేరలేదని అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్యమకారులకు న్యాయం చేస్తున్నాడు అందుకోసమే నాతోపాటు ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని వారందరితో చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు ప్రజా సంక్షేమ పాలన దిశగా అడుగులు వేస్తున్నారని ఎన్నో సంక్షేమ పథకాలను వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రజలందరికీ అందించారని ఆయన ప్రజా పాలన లో భాగం అయ్యేందుకు ఆయనతోపాటు పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి నర్సంపేటను ఎన్నో రకాల అభివృద్ధి పరచారని పరకాలను కూడా అభివృద్ధి పరుస్తారని వారితో కలిసి పని చేసేందుకు పార్టీలో చేరానని అన్నారు.కాంగ్రెస్ పార్టీలో గతం నుండి పనిచేసిన నాయకులకు గుర్తింపు ఉంటుందని రాబోయే పరకాల మున్సిపల్ ఎన్నికల్లో 22 సీట్లకు 22 గెలిచే విధంగా కృషి చేస్తానని,ఎంపీ ఎన్నికలలో ఎవరిని నిలపెట్టిన గెలిపించుకుంటానని తెలిపారు.అనంతరం పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్న అంటే నేనున్నానని ఆపదలో ఆదుకునే నాయకుడు పరకాల ప్రాంతని అభివృద్ధి చేసిన మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి కాంగ్రెస్ పార్టీలో చేరడం స్వాగతిస్తున్నామని అన్నారు.పరకాల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక పెద్ద దిక్కుగా ఉండి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు అన్నతో కలిసి పని చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల కౌన్సిలర్ పంచగిరి జయమ్మ తో పాటు మాజీ ఎంపీపీలు ఒంటేరు రామ్మూర్తి, పావుశెట్టి సుకన్య,లక్ష్మీపురం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్ల చిన్ని, మాజీ పీఏసీ చైర్మన్ పూజారి సాంబయ్య,కాంగ్రేస్ సేవాదల్ సభ్యుడు బొచ్చు చెందర్,చిన్నాల గోనాథ్,పరకాల పట్టణ కమిటీ ఉపాధ్యక్షులు ఒంటేరు శ్రవణ్,సుర సతీష్,ప్రధాన కార్యదర్శిలు చందుపట్ల రాజిరెడ్డి,పబ్బా శ్రీనివాస్, బొమ్మగంటి చంద్రమౌళి,బొచ్చు బాబు,లక్కం వసంత,పసుల జయ,చర్ల పెళ్లి మాజీ సర్పంచ్ చాడ రవీందర్ రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు, నడికూడా మండల కమిటీ సభ్యులు,పరకాల మండల కమిటీ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version